Home Blog Page 30

అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఏసీబీ నూతన కార్యాలయాన్ని సోమవారం సీపీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీబీ కి ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయాలని సూచించారు. ఈ పారంబోత్సవానికి హైదరాబాద్ ఏసీబీ వెస్ట్ జోన్ డిప్యూటి డైరెక్టర్ డి. కమలాకర రెడ్డ్ని నిజామాబాద్ ఏసీబీ డీస్పీ జి.శేకర్ గౌడ్, ఇన్స్ పెక్టర్స్ యం.వేణుకుమార్, జి.నగేష్, ఏసీబీ సిబ్బంది హాజరయ్యారు.

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం

*ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు సమస్యల విషయంలో మరో సారి తన కట్టుబాటును చాటుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు ప్రభుత్వం నిధులు మం జూరు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు జీవనాడిగా నిలిచే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి వరకు రిజర్వాయర్ ప్రాంగణంలోనే ఉండి,సంబంధిత శాఖల ఉన్నతా ధికారులతో పాటు పలువురు కీలక వ్యక్తులతో ఫోన్ ద్వారా సంప్ర దింపులు జరిపారు. సమస్యకు వెంటనే పరిష్కారం దొరకాలన్న లక్ష్యంతో ఆయన నిరంతరం ప్రయత్నించినప్పటికీ, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఫోన్లు ఎత్తకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. “ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం వస్తోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహార శైలి పై పోచారం తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల మాటకు విలువ లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులు చెప్పినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల కోసం తాను పలుమార్లు మంత్రిని సంప్రదించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. “మంత్రికి ఇరవై సార్లు చెప్పాను. అయినా పట్టించుకోలేదు. ఈ వయస్సులో నిధుల కోసం ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ వర్ని మండల రైతులకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. అయితే నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మెల్యే పోచారం స్వయంగా రంగంలోకి దిగడం, రాత్రివేళల వరకు అధికారులతో చర్చలు జరపడం ఈ సమస్య తీవ్రతను సూచిస్తోంది. స్థానిక రైతులు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోచారం వ్యాఖ్యలతో ఈ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న కఠిన వైఖరి, ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పేదింటి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్థులు

పేదింటి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్థులు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం మాలెబోరిగామ గ్రామ పంచాయతీ లోని కె బి కాలనీ గ్రామస్థులు. గ్రామానికి చెందిన మెస్రం రజిత వివాహం నిమిత్తం తమవంతు సాయంగా రూ.12,500 నగదును సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.మానవత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో గ్రామంలో కట్నకానుకలు, ఆర్భాటాలను నిషేధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మెస్రం నాగోరావ్, గ్రామ మహజన్ సెడ్మకి అనంద్ రావ్, గ్రామ దేవారీ మెస్రం గణపతి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌కు ‘జాతీయ రోడ్డు భద్రత’ పురస్కారం: అభినందించిన కలెక్టర్

ఆదిలాబాద్‌కు ‘జాతీయ రోడ్డు భద్రత’ పురస్కారం: అభినందించిన కలెక్టర్

చిత్రం, న్యూస్, ఆదిలాబాద్: బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖకు ‘2వ జాతీయ రోడ్డు భద్రతా ఎక్సలెన్స్ అవార్డు-2026’ లభించింది. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ రాజర్షి షా ను అధికారులు మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన వారిని అభినందించారు.  ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రవీందర్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం, డీఎం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జడ్పీ సీఈఓ బి.రవి

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జడ్పీ సీఈఓ బి.రవి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన బి.రవి సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు. శాఖాపరమైన కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, విధులను సమర్థవంతంగా నిర్వహించాలని నూతన సీఈఓకు సూచించారు.

ఇంటర్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ విద్యార్థులు

* విద్యార్థులను సన్మానించిన యజమాన్యం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ లో గల ఎస్ ఆర్ కళాశాల యజమాన్యం మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎస్. చందన, అస్మిత్ గౌడ్, సరియన్ స్పందన, అఖిలేష్ 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి జిల్లా టాపర్స్ గా నిలిచారు. కళాశాలకు చెందిన 205 మంది విద్యార్థులు 467 నుంచి 460 మార్కులకు సాధించారని కళాశాల డీజీఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బైపీసీలో ఆసియా అంజుమా, మను శ్రీ,, అనూష, స్నేహ 440 మార్కులకు 438 మార్కులు సాధించినట్టు గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 78 మంది విద్యార్థులు 437 నుండి 4:30 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. సి ఈ సి లో హనీ యాసిద్దిన్, 500 మార్కులకు 482 మార్కులు సాధించారని, అదేవిధంగా శ్రీ చందన 481 మార్కులు సాధించి సత్తా చాటాలని తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ శ్రేణి ఎంపీసీ ఫలితాలలో దినేష్ 995/1000 అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్ గానిలిచారు. మరో 27 మంది విద్యార్థులు నుండి 990 వరకు మార్కులు. సాధించినట్లు తెలిపారు. బైపీసీ లో ఉపాజఫీన్, హన్మిత, తిరుమల అనే విద్యార్థులు 991/1000 మార్కులతో ప్రతిభ చాటారు. ఏడుగురు విద్యార్థులు 990/1000 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో జడల దీపికకు 995 /1000 మార్కులు రావడం జరిగిందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చాటిన కళాశాల విద్యార్థులను ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి లు అభినందించారు. అనంతరం కళాశాల ఆవరణలో బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు తినిపించుకున్నారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

*జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జన గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ (ఇండ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్లికేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇండ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11వ తేదీ నుండి నిర్వహించే ఇండ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాక్ లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలని, ఇండ్ల గణన, జనగణన జాబితా ప్రకారం అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇండ్ల గణన కోసం ఆరు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సరిహద్దుల నిర్ధారణ పూర్తయ్యిందని, మిగిలిపోయిన మండలాల్లోనూ 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

*కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి

చిత్రంన్యూస్, నిజామాబాద్ బ్యూరో: పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరస్థుడిని అరెస్టుచేసి రిమాండ్ కి తరలించినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి సోమవారం తెలిపారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భిక్కనూరు గ్రామానికి చెందిన లక్ష్మి ఒంటరిగా నివసిస్తుండగా ఆమె ఇంట్లో అదే గ్రామానికి చెందిన గజ్ళే స్వామి చొరబడి ఆమెపై రోకలి తో దాడి చేసి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు 10 గ్రాముల గుండ్లను ఎత్తుకుని పారిపోయాడు.. కేసు నమోదు చేసుకుని భిక్కనూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన ఎస్పె ఆంజనేయులు కేవలం మూడు గంటలోనే కేసును ఛేదించి నేరస్తున్ని పట్టుకొని అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను, అతడు ఉపయోగించిన రోకలి, మొబైల్ ఫోను, బైకును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మూడు గంటలోనే కేసు చేదించిన భిక్కనూర్ సీఐ, ఎస్ఐలను సిబ్బందిని ఆమె అభినందించారు.

తాగునీటి కోసం పోరుబాట: కలెక్టరేట్ వద్ద సీపీఐ ధర్నా

తాగునీటి కోసం పోరుబాట: కలెక్టరేట్ వద్ద సీపీఐ ధర్నా

* కాలనీవాసుల కష్టాలపై అదనపు కలెక్టర్ హామీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డు న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ (సర్వే నంబర్ 170) నివాసితులు గత 12 ఏళ్లుగా తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పట్టాలు పొందిన సుమారు 200 కుటుంబాలకు కనీసం తాగునీరు కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విభాగంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్ కు ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఎండకాలం వస్తున్నా పేద ప్రజల దాహం తీర్చలేని ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఎందుకని ఆయన నిలదీశారు. గతంలో జిల్లా కలెక్టర్ రూ.5 లక్షలు మంజూరు చేయడంతో నీటి ట్యాంకులు, పైపులు, బోర్ వెల్ ఏర్పాటు చేశారని.. కేవలం రూ. 2.5 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన గుర్తు చేశారు.

మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు వివరించగా, ప్రజల ప్రాథమిక అవసరాల కంటే నిధులు ముఖ్యం కాదని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్, త్వరలోనే రెండు లక్షల రూపాయలు చెల్లించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ధర్నా సద్దుమణిగింది.

ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కామిలే రామదాస్, గిరిజన సంఘం జిల్లా నాయకులు కొడప సురేష్,  కాలనీవాసులు తారాబాయి, శాంతాబాయి, జంగు భాయ్, ముల్కల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..ఎమ్మెల్యే రామారావు పటేల్ 

0

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..ఎమ్మెల్యే రామారావు పటేల్

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోవద్దని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భరోసా ఇచ్చారు.గొల్లమాడ, తమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు తమ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొక్కజొన్నను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, అవసరమైన చోట్ల మరిన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో పాటు మంత్రికి కూడా సమాచారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ఆలస్యం చేస్తే, రైతుల తరపున ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ రాజేందర్, గొల్లమాడ మాజీ సర్పంచ్ చిన్న మహేష్, నాయకులు వినోద్ రెడ్డి, సత్యం, విజయ్ తదితరులు పాల్గొన్నారు