-Advertisement-

ఇంటర్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ విద్యార్థులు

* విద్యార్థులను సన్మానించిన యజమాన్యం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ లో గల ఎస్ ఆర్ కళాశాల యజమాన్యం మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎస్. చందన, అస్మిత్ గౌడ్, సరియన్ స్పందన, అఖిలేష్ 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి జిల్లా టాపర్స్ గా నిలిచారు. కళాశాలకు చెందిన 205 మంది విద్యార్థులు 467 నుంచి 460 మార్కులకు సాధించారని కళాశాల డీజీఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బైపీసీలో ఆసియా అంజుమా, మను శ్రీ,, అనూష, స్నేహ 440 మార్కులకు 438 మార్కులు సాధించినట్టు గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 78 మంది విద్యార్థులు 437 నుండి 4:30 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. సి ఈ సి లో హనీ యాసిద్దిన్, 500 మార్కులకు 482 మార్కులు సాధించారని, అదేవిధంగా శ్రీ చందన 481 మార్కులు సాధించి సత్తా చాటాలని తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ శ్రేణి ఎంపీసీ ఫలితాలలో దినేష్ 995/1000 అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్ గానిలిచారు. మరో 27 మంది విద్యార్థులు నుండి 990 వరకు మార్కులు. సాధించినట్లు తెలిపారు. బైపీసీ లో ఉపాజఫీన్, హన్మిత, తిరుమల అనే విద్యార్థులు 991/1000 మార్కులతో ప్రతిభ చాటారు. ఏడుగురు విద్యార్థులు 990/1000 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో జడల దీపికకు 995 /1000 మార్కులు రావడం జరిగిందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చాటిన కళాశాల విద్యార్థులను ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి లు అభినందించారు. అనంతరం కళాశాల ఆవరణలో బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు తినిపించుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments