కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జడ్పీ సీఈఓ బి.రవి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన బి.రవి సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు. శాఖాపరమైన కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, విధులను సమర్థవంతంగా నిర్వహించాలని నూతన సీఈఓకు సూచించారు.




