Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Telangana Nizamabad దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

0
22

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

*కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి

చిత్రంన్యూస్, నిజామాబాద్ బ్యూరో: పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరస్థుడిని అరెస్టుచేసి రిమాండ్ కి తరలించినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి సోమవారం తెలిపారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భిక్కనూరు గ్రామానికి చెందిన లక్ష్మి ఒంటరిగా నివసిస్తుండగా ఆమె ఇంట్లో అదే గ్రామానికి చెందిన గజ్ళే స్వామి చొరబడి ఆమెపై రోకలి తో దాడి చేసి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు 10 గ్రాముల గుండ్లను ఎత్తుకుని పారిపోయాడు.. కేసు నమోదు చేసుకుని భిక్కనూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన ఎస్పె ఆంజనేయులు కేవలం మూడు గంటలోనే కేసును ఛేదించి నేరస్తున్ని పట్టుకొని అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను, అతడు ఉపయోగించిన రోకలి, మొబైల్ ఫోను, బైకును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మూడు గంటలోనే కేసు చేదించిన భిక్కనూర్ సీఐ, ఎస్ఐలను సిబ్బందిని ఆమె అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp