-Advertisement-

యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు

యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు

పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ర్యాలీ

ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. యువత చెడు మార్గంలో కాకుండా తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సక్రమ మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ర్యాలీ శనివారం ఉదయం జిల్లా క్రీడా అథారిటీ మైదానం నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ లీగ్ ర్యాలీని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుండడం ఎంతో గర్వకారణమని, నిజామాబాద్ జిల్లా నుండి ఎంతోమంది క్రీడాకారులను దేశానికి అందించినటువంటి ఘనత జిల్లాకు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం అని, ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, యోగా మొదలగు క్రీడలు నిర్వహిస్తున్నారని సాయి చైతన్య అన్నారు. ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ క్రీడలలో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించాలని ఉద్దేశంతో యువతను ప్రోత్సహించే విధముగా ఈ యొక్క సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నరని, కోవిడ్ సమయంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయారని రోడ్డు ప్రమాదాల వలన నిజామాబాద్ జిల్లాలో 2025 సంవత్సరంలో 300 మంది మరణించారని వివరించారు.ప్రధానముగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించాలని సీపీ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారు క్షేమంగా తమ గమ్యానికి చేరుకుంటున్నారని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. ,

యువత డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరితో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టూ స్పోర్ట్స్ అనే నినాదం చేయించడం జరిగింది. యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారాలు ఉంటుందని యువత సన్మార్గంలో నడిచినప్పుడే అది సాధ్యమవుతుందని అందుకే ఈ యొక్క సమ్మర్ క్యాంపు ద్వారా ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.. అనంతరం కాగడాతో క్రీడా ర్యాలీని ప్రారంభించి, క్రీడా ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్, రైల్వే కమాన్, అయ్యప్ప దేవాలయం, మీ-సేవ, పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వా రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, ట్రెజరర్ సంతోష్ వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీలు శిరీష్, పితాని, శివప్రసాద్, గణేష్ గుప్తా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, నిజామాబాద్ యువత, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments