శివాజీ మహారాజ్ విగ్రహం కోసం రూ.5 వేలు అందజేసిన ఇట్టడి సుశాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: మండలంలోని కొబ్బయి గ్రామంలో ప్రతిష్టాపించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కోసం జై హనుమాన్ పర్టిలైజర్స్ బేల యజమాని ఇట్టడి సుశాంత్ రెడ్డి తమ వంతు సహాయంగా రూ.5 వేలు గ్రామ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహావీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయడం ఎంతో సంతోషకరమని, శివాజీ మహారాజ్ ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు. బేల మండలంలోని ఏ గ్రామంలో ఐన శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు ముందుకొస్తే తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

