ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శ
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పలువురిని పరామర్శించారు.ముథోల్ మాజీ సర్పంచ్ గంట శ్రీనివాస్ అతని మనుమరాలు రోడు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరగడంతో వారిని పరామర్శించారు. అదే విధంగా అంబకంటి గ్రామానికి చెందిన అరుంధతి అనే మహిళ కు ఆపరేషన్ జరుగగా, దౌనెల్లి గ్రామానికి చెందిన ఖాదీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు ప్రముఖ వైద్యులు దామోదర్ రెడ్డి, ముథోల్ మాజీ సర్పంచ్ అనిల్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్ తో పాటు పలువురు ఉన్నారు.




