బోధన్ లోని రైస్ మిల్లుపై దాడి: పీడీఎస్ బియ్యం పట్టివేత
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో ఉన్న సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై సీసీఎస్ టీం, స్థానిక బోధన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఉంచుతునారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రైడ్ చేపట్టారు. రెండు ఆటోలు, ఒక లారీ నుండి పీడీఎస్ ధాన్యం అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 144. 2 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.సివిల్ సప్లై డీటీ హనుమాన్ పంచనామ నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ సీఐ వెంకటనారాయణ హెచ్చరించారు.

