రాష్ట్రస్థాయిలో మెరిసిన జైనథ్ విద్యార్థిని గతాడే వైష్ణవికి ఘన సన్మానం
చిత్రం న్యూస్, జైనథ్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జైనథ్ గ్రామానికి చెందిన గతాడే వైష్ణవి అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించి తమ గ్రామానికి పేరు తెచ్చిన వైష్ణవిని స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గ్రామ అధ్యక్షుడు చిలుకూరి లింగారెడ్డి, నాయకులు కోవ సారథి, అన్నెల అశోక్, కొడిచర్ల స్వామి, శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆమె నివాసానికి చేరుకుని, శాలువాతో ఆమెను గౌరవించి అభినందనలు తెలిపారు. వైష్ణవి పట్టుదలతో చదివి సాధించిన ఈ విజయం ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

