Home Blog Page 17

ఆర్టీసీ సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

ఆర్టీసీ సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో బుధవారం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది, డిపోలకే పరిమితమైన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ (JAC) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఆదిలాబాద్‌లోని ప్రధాన డిపోల వద్ద కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలుపారు. దీనివల్ల జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, రోగులు గమ్యస్థానాలకు చేరుకోలేక బస్టాండ్లలో పడిగాపులు కాశారు. సమ్మెను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

నూతన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం

నూతన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజర్షి షా అధ్యక్షత వహించారు.

అంతకుముందు, నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ, నిబంధనలు, ఇతర అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) ఇ. విష్ణువర్ధన్ తో పాటు కమిటీ సభ్యులు నూకల దేవేందర్, బేత రమేష్, బిర్కుర్వార్ వెంకటేష్, మహమ్మద్ హమీదుల్లా అన్వర్, పి.గజానన్, మెడపట్ల సురేష్, తోట్ల చిన్న అంజయ్య, బి.కిరణ్ కుమార్, జి.వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ బృందాలు, విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్ బృందాలను ఆదేశించారు. లైసెన్స్ లేని విత్తనాలను విక్రయించినా, అనుమతి లేని కంపెనీల విత్తనాలు విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..జిల్లాలో అక్రమ విత్తన రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీఓ జగదీశ్వర్ రావ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ బృంద సభ్యులు, వివిధ విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.

ఆదివాసీల కోసం ‘టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ప్రారంభించిన మంత్రి జూపల్లి

ఆదివాసీల కోసం ‘టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ప్రారంభించిన మంత్రి జూపల్లి

చిత్రం న్యూస్, ఉట్నూర్: ఆదివాసీ గూడాల ప్రజల్లో చైతన్యం నింపి, ఆధునిక సమాజంతో మమేకం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉట్నూర్ మండలం గోండు గూడలో బుధవారం రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ను జెండా ఊపి ప్రారంభించారు.

ముందుగా నాగోబగూడలో మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదివాసీ నాయకులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గిరిజన, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బస్సుల్లో సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరు శంషాబాద్ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, లుంబినీ పార్క్, శిల్పారామం, మ్యూజియంలు తదితర చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజు మర్మాట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

TGSRTC ఆదిలాబాద్ రీజియన్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

TGSRTC ఆదిలాబాద్ రీజియన్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: TGSRTC కార్మికులు ఏప్రిల్ 22, 2026 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అదిలాబాద్ రీజియన్ మేనేజర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె కాలంలో బస్సులను నడపడానికి తాత్కాలిక ప్రాతిపదికన అర్హత కలిగిన డ్రైవర్లు మరియు కండక్టర్ల నుండి దరఖాస్తులను కోరుతోంది.

డ్రైవర్ (Driver): హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ పొంది కనీసం 18 నెలల అనుభవం ఉండాలి. హెవీ లోడ్ వాహనాలను నడపడంలో నైపుణ్యం తప్పనిసరి. RTO మరియు RTC అధికారులు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

కండక్టర్ (Conductor): కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.ఈ నియామకాలు కేవలం సమ్మె కాలానికి మాత్రమే వర్తిస్తాయిని, ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు ధృవీకరణ పత్రాలతో (Original Certificates) సంబంధిత డిపో మేనేజర్లను వెంటనే సంప్రదించాలని ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సాంగిడి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయండి: మంత్రి జూపల్లికి సామ రూపేష్ రెడ్డి విజ్ఞప్తి

సాంగిడి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయండి: మంత్రి జూపల్లికి సామ రూపేష్ రెడ్డి విజ్ఞప్తి

చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామ శివారులో పెనుగంగ నది ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి కోరారు. బుధవారం ఉట్నూరు పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ. 5.40 కోట్ల భారీ వ్యయంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిందని, అయితే ప్రస్తుతం ఇది ఏమాత్రం వినియోగంలో లేక నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఒక్క ఎకరానికి కూడా నీరు అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఇందుకోసం అవసరమైన ఆనకట్ట నిర్మాణానికి సుమారు ఒక కోటి రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.

జైనథ్ లో హిందూ సమ్మేళనానికి ఘనంగా ఆహ్వానం – బెల్లూరిలో ప్రచారం

జైనథ్ లో హిందూ సమ్మేళనానికి ఘనంగా ఆహ్వానం – బెల్లూరిలో ప్రచారం

చిత్రం న్యూస్, జైనథ్: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈనెల 24వ తేదీ శుక్రవారం రోజు జైనథ్‌లో నిర్వహించతలపెట్టిన భారీ “హిందూ సమ్మేళనం” విజయవంతం చేయాలని కోరుతూ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం బెల్లూరి గ్రామస్తులను కలిసి సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏప్రిల్ 24న జరిగే ఈ సమ్మేళనానికి హిందూ బాంధవులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గ్రామంలోని యువత, భక్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్వరూప్,అఖిల్, రవి,సూరజ్, సుజిత్, ధర్ము, ధనుష్, సాత్విక్, శ్రీశాంత్ పాల్గొన్నారు.

శనగ రైతులను ఆదుకోవాలని మంత్రి జూపల్లికి కంది శ్రీనివాస్ రెడ్డి బృందం వినతి

శనగ రైతులను ఆదుకోవాలని మంత్రి జూపల్లికి కంది శ్రీనివాస్ రెడ్డి బృందం వినతి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని రైతుల వద్ద నిల్వ ఉన్న శనగలను వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తరపున జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజన్ ముగుస్తున్నా ఇంకా చాలా మంది రైతుల వద్ద శనగ పంట నిల్వ ఉండిపోయిందని, మార్కెట్‌లో మద్దతు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల ద్వారా మిగిలిన శనగలను సేకరించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఆత్మ చైర్మన్  సంతోష్ రావు, బండారి సతీష్, డేరా కృష్ణ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

గుండెపోటుతో  ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి  

0

గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బైంసా కేంద్రంలో గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి చెందారు. కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ బుధవారం గుండెపోటుతో మరణించడంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ఆయన వైద్యుడిగా చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటూ ఆయన మృతి చెందాడన్నా విషయాన్ని విని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం నర్సాపూర్ (జి ) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆయన బైంసాలో సొంతంగా ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తన ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తుండగా డా.సురేందర్ కు ఒక్కసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది నిర్మల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు.  ఆయనకు చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతి చెందడంతో ఆయా గ్రామ ప్రజలు, భైంసా ఏరియా హాస్పిటల్ ఉద్యోగులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, స్నేహితులు దిగ్బ్రాంతి చెందారు.

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

చిత్రం న్యూస్, బేల:  ప్రభుత్వం నుండి వచ్చిన కొత్త స్మార్ట్ పోన్ లను ఆయా గ్రామ సర్పంచుల చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు  బుధవారం పంపిణీచేశారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఎంపీఓ మహేష్ కుమార్ మట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల హాజరు శాతాన్ని మొదలుకొని రోజు వారికి అందిస్తున్న పోషకాహారంతో పాటు రోజు వారి కార్యక్రమాలను నమోదు చేస్తే నేరుగా అవి కమిషనర్ కార్యాలయానికి వెళ్తుందని దీన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలని అన్నారు. సూపర్ వైజర్లు సుజాత, ఆయేషా, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఠాక్రె అశోక్ వివిధ గ్రామ సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.