అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
చిత్రం న్యూస్, బేల: ప్రభుత్వం నుండి వచ్చిన కొత్త స్మార్ట్ పోన్ లను ఆయా గ్రామ సర్పంచుల చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు బుధవారం పంపిణీచేశారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీఓ మహేష్ కుమార్ మట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల హాజరు శాతాన్ని మొదలుకొని రోజు వారికి అందిస్తున్న పోషకాహారంతో పాటు రోజు వారి కార్యక్రమాలను నమోదు చేస్తే నేరుగా అవి కమిషనర్ కార్యాలయానికి వెళ్తుందని దీన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలని అన్నారు. సూపర్ వైజర్లు సుజాత, ఆయేషా, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఠాక్రె అశోక్ వివిధ గ్రామ సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

