Home Blog Page 18

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

0

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని తిమ్మాపూర్, గొల్లమాడ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తిమ్మాపూర్ గ్రామంలో రూ.90 లక్షల నిధులతో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే విధంగా గొల్లమాడ గ్రామంలో 24 లక్షల రూపాయల నిధులతో చెరువు మరమత్తు పనులు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. విద్య, వైద్యం, సాగునీరు అందించడమే లక్ష్యంగా తాను ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నానని, 28 ప్యాకేజీ పై పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ప్యాకేజీ పూర్తయితే కుంటాల నర్సాపూర్ మండలాలకు 13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.. తను శాసన సభ్యునిగా ఎన్నికైనప్పటినుంచి శాసనసభలో సమస్యలపై పలుమార్లు మాట్లాడడం జరిగిందని, అధికార పార్టీలో లేకున్నా అందరి సహకారంతో ప్రతి ఏట నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గత పది సంవత్సరాల కాలంలో లేని విధంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి రూ.25 కోట్ల నిధులు, ముథోల్  ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రూ.220 కోట్ల నిధులు ఒకేసారి మంజూరు కావడం సంతోషకరమన్నారు. గతంలో లేని విధంగా తన హయంలో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. గొల్లమడ చెరువు ప్రధాన కాలువ సీసీ లైనింగ్ కు నిధులు మంజూరు చేయిస్తానని, అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పారు. వ్యాపారుల దోపిడీని అరికట్టేందుకు రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు గతంలో లేని విధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దశల వారిగా సబ్ సెంటర్లను పెంచనున్నట్లు చెప్పారు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

పీవీటీజీలకు శాపంగా మారిన జన్ మన్ పథకం 

పీవీటీజీలకు శాపంగా మారిన జన్ మన్ పథకం 

* డబ్బులు పడక లబ్దిదారుల ఎదురుచూపులు 

చిత్రం న్యూస్, బేల: కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన గిరిజనులకు పీఎం జన్ మన్ పథకంలో ఇండ్లను మంజూరు చేస్తోంది. కానీ సాంకేతిక లోపల వల్ల జన్ మన్ ఇళ్ల లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఇళ్ళు వచ్చాయని సంతోష పడాలో..బాధ పడాలో లబ్ధిదారులకు అర్థం కావడం లేదు. బేల  మండలంలో మొత్తం 1,354 ఇళ్ళు మంజురు కాగా అందులో 593 ఇందిరమ్మ ఇళ్ళు. మిగతావి జన్ మన్ పథకం కింద PVTG లకు స్పెషల్ గ్రాంట్ కింద కోలాం కులానికి చెందిన వివిధ గ్రామాలలో లబ్ధిదారులకు 761 ఇళ్ళు మంజురయ్యాయి. కాగా చప్రాల గ్రామంలో మొత్తం 85 ఇందిరమ్మ మంజూరు కాగా, అందులో పీవీటిజీ(PVTG )స్పెషల్ గ్రాంట్ లో 43 ఇళ్ళు మంజురయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక్కో పని పూర్తి చేసిన వెంటనే పంచాయతీ సెక్రటరీ ఫోటో అప్ లోడ్ చేసిన వారం లోగా డబ్బులు పడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.3 లక్షలు అందిన తరువాత కేంద్ర ప్రభుత్వం నుండి రూ.1.40 లక్షలు మిగతా ఉపాధి హామీ అకౌంట్ లో రూ.60వేలు చెల్లిస్తున్నారు. అయితే PVTG లబ్ధిదారులకు మాత్రం కేంద్రం నుండి నేరుగా మొదట చెల్లించిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వ వాట చెల్లింపు నిబంధన పెట్టింది. ఇదే లబ్ధిదారులకు కొర్రిగా మారింది. కేంద్రం నుండి చెల్లించాలంటే లబ్ధిదారుల ఆధార్ కార్డు, జాబ్ కార్డు, అకౌంట్ నెంబర్ లో లోపాలు ఉండడంతో దాదాపు 90%మంది లబ్ధిదారులకు డబ్బులు అందడం లేదు. దీంతో బేస్ మెంట్ కట్టిన లబ్ధిదారుల పని ముందుకు సాగకుండా అవస్థలు పడుతున్నారు.

గుడిసెలో ఉంటున్నాం.. మాకు ఇళ్ళు వచ్చాయి కానీ ఇప్పటి వరకు డబ్బులు పడడం లేదని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదనిలబ్ధిదారులు పేర్కొన్నారు. మేము ఇళ్ళు కూలగొట్టి గుడిసెలో ఉంటున్నాము. వచ్చేది వర్షాకాలం ఎంతో ఇబ్బంది కలుగుతుందన్నారు. అధికారులు అర్థం చేసుకోని సకాలంలో బిల్లులు మంజూరు అయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు.

వెంటనే బిల్లులు మంజూరు చేయాలి.. లబ్దిదారులకు వెంటనే బిల్లులు మంజూరు చేయాలని చప్రాల గ్రామ ఉప సర్పంచ్ సాగర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు PVTG కింద కోలాం తెగకు 43 ఇళ్ళు కేంద్రం నుండి జన్ మన్ పథకంలో మంజురు కాగా ఇప్పటి వరకు ఒక్కరికి డబ్బులు పడలేదన్నారు. ఉన్న ఇండ్లను గిరిజనులు కూలగొట్టి గుడిసెల్లో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు బిల్లులు మంజూరు కాకపోతే లబ్ధిదారులతో కలిసి ఆందోళన చెప్పడతామన్నారు.

త్వరలో సమస్యకు పరిష్కారం:  హౌసింగ్ ఏఈ లింగం మాట్లాడుతూ.. బేల మండలంలో మొత్తం 761వరకు PVTG లో ఇళ్ళు మంజురయ్యాయని ఇందులో లబ్ధిదారులకు రూ.2లక్షలు కేంద్రం, మిగిలిన రూ.3లక్షలు రాష్టం ఇస్తుందన్నారు.అయితే ఇప్పటి వరకు మొదటి బిల్లు 340మందికి రూ.20  వేలు లబ్ధిదారులకు చెల్లించామని, మిగిలిన వారి డేటా ఇంట్రిలో తప్పులు ఉండడంతో జాప్యం జరుగుతుందని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లిందన్నారు. ప్రభుత్వాలు యాప్ ను సరిచేసి సమస్యలను తొలిగించే పనిలో ఉన్నారని త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

0

సర్కార్ బడిలో పిల్లల్ని చేర్పించాలి: సర్పంచ్ మధుప్రీతి 

* కీర్గుల్ (కె ) గ్రామంలో బడిబాట కార్యక్రమం 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ ( కె ) గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బుధవారం  సర్పంచ్ మధు ప్రీతి, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ప్రిన్సిపల్ ప్రవళిక , భవాని, అంగన్వాడీ టీచర్ ఈశ్వర బాయి, ఉపాధ్యాయులు కీర్గుల్ (కె ) గ్రామంలో పర్యటిస్తూ తల్లిదండ్రులను కలుసుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత విద్య, పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వివరించారు. అలాగే పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ తరగతులు, మెరుగైన బోధన విధానాల గురించి తల్లిదండ్రులకు తెలిపారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు. వార్డ్ మెంబర్స్. గ్రామ యువకులు తదితరులు ఉన్నారు.

రేకులపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ..హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు

రేకులపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ..హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు

* ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం పట్ల ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని స్థానిక సర్పంచ్ రాజేందర్, గ్రామాభివృద్ధి చైర్మన్ నారాయణ పలువురు గ్రామస్తులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలిపారు. అనంతరం గ్రామంలోని పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

పేదోడి కల సాకారం దిశగా కాంగ్రెస్ పాలన: రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

పేదోడి కల సాకారం దిశగా కాంగ్రెస్ పాలన: రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ఎల్లమ్మకుంట లో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభోత్సవం..పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగులు చేపడుతూ రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాడ్సి పీఏసీఏస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కాంటా వద్ద ప్రత్యేక పూజలు చేసి కొనుగోలును ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ను గ్రామస్థులు బంజారా సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అటు గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న సునీత- సుధాకర్ గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తండాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయాలని చేతులెత్తేస్తే రాష్ట్రం రైతు పక్షపాతిగా వ్యవహరించి రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొత్తం 739 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేపడుతుండగా, అందులో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఐకేపీ వారికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి చుక్క నీరందించిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ.. పేదోళ్ల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయరెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ మొప్ యాదగిరి , సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు అమృతాపూర్ గంగాధర్, ఉమ్మాజి నరేష్, ప్రతాప్ సింగ్, రాంచందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల, తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లో శనగల కొనుగోలు పునఃప్రారంభం: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

రెండు రోజుల్లో శనగల కొనుగోలు పునఃప్రారంభం: ఎమ్మెల్యే పాయల్ శంకర్ h

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: మార్కెట్ యార్డుల్లో నిలిచిపోయిన శనగల కొనుగోలు ప్రక్రియపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక ప్రకటన చేశారు. శనగల కొనుగోలు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు భరోసా కల్పించారు. మార్కెట్ యార్డుల్లో శనగల కొనుగోలు మధ్యంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో,ఎమ్మెల్యే వెంటనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపగా, మిగిలిన శనగలను కూడా తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన కోరగా, మంత్రులు సానుకూలంగా స్పందించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. మరో రెండు రోజుల్లో శనగల కొనుగోలు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఉత్సాహభరితంగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్

ఉత్సాహభరితంగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్

* నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ టోర్నమెంట్ లో రెండవ రోజైన మంగళవారం మొత్తం నాలుగు మ్యాచ్ లు విజయవంతంగా కొనసాగాయి.ప్రతి మ్యాచ్ లోనూ ఆటగాళ్లు తమ పత్రిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, టోర్నమెంట్ మరింత రసవత్తరంగా సాగుతుండగా, తదుపరి మ్యాచ్ లపై ఆసక్తి మరింత పెరుగుతోందని తెలిపారు. మొదటి మ్యాచ్ గజానన్ టీం, గుండారం లెవన్ మధ్య జరగగా గజానన్ టీం గెలుపొందింది. రెండవ మ్యాచ్ వేల్పూరు పీఎస్, ముప్కాల్ లెవన్ మద్య జరుగగా వేల్పూరు పీఎస్ విజేతగా నిలిచింది. మూడవ మ్యాచ్ చత్రపతి శివాజీ, అమాపర్ టీం మద్య జరుగగా చత్రపతి టీం గెలుపొందింది. నాల్గవ మ్యాచ్ మోహన్ లెవన్, వర్ని వారియర్స్ మద్య జరుగగా వర్ని వారియర్స్ వాక్ ఓవర్ చేయడంతో మోహన్ లెవన్ ని విన్నర్ గా పక్రటించారు.

హిందూ సంస్కృతిని కాపాడటం అందరి బాధ్యత

హిందూ సంస్కృతిని కాపాడటం అందరి బాధ్యత

* కంఠేశ్వర్ హిందూ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: హిందూ సంస్కృతిని కాపాడటం ప్రతి హిందువు బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్ ఆలయంలో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సమాజంలో కొన్నిసార్లు చిన్న విభేదాలతో కులం, ప్రాంతం, భాష మనల్ని విడదీస్తున్నాయన్నారు. ఇవి హిందూ సమాజానికి బలహీనతలు కాకూడదన్నారు. ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాల్లో వక్తలు చెబుతున్న మాటలను శ్రద్ధగా విని పాటించాలన్నారు. కార్యక్రమంలో వక్త కల్పగురి ప్రభుకుమార్, పలుగుట్ట ఆశ్రమ కేదారానంద స్వామీజీ, సేవికా సమితి బౌద్ధిక్ ప్రముఖ్ కల్పన, హిందూ సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగోళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

తొర్తి గ్రామాన్ని సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ

తొర్తి గ్రామాన్ని సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తొర్తి గ్రామ రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేసిన విషయం విచారణ కోసం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మమాల్వీయ మంగళవారం తొర్తి గ్రామాన్ని సందర్శించారు. తమ గ్రామానికి చెందిన మురుగు కాలువ (డ్రైనేజీ) నీళ్ళు తమ పంట పొలాలకు వచ్చి నష్టము జరుగుతుందని రైతులు సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణిలో విన్నవించిన ప్రకారం రైతుల పంట పొలాలను, మురుగు కాలువను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద భూమేశ్వర్, బాధిత రైతులు, గ్రామపెద్దలు, గ్రామస్తులతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ జె మల్లయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్ము ఇరిగేషన్ ఈ ఈ, ఎంపీఓ శివ చరణ్, ఏఈ ఇరిగేషన్, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, గామ పంచాయతీ కార్యదర్శి అనిల్, గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.6.33 కోట్ల నిధుల ఆమోదం: అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజా ప్రతినిధులు 

  1. రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.6.33 కోట్ల నిధుల ఆమోదం: అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజా ప్రతినిధులు 

చిత్రం న్యూస్ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ (RIMS) ఆసుపత్రి అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ, సుమారు  రూ.6.33 కోట్ల విలువైన అభివృద్ధి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అనంతరం రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీ.టీ.జీ (C.T.G) యంత్రాలను, ఇతర వైద్య పరికరాలను కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భొజ్జు పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, కొత్త పరికరాల అందుబాటుతో వైద్య సేవలు మరింత వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగుపరచవలసిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ పుష్కర్, వివిధ విభాగాల అధిపతులు రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.