పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోండి: బాసర ఎంపీడీవోకు వినతి పత్రంఅందజేత
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని దొడాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శి మమతపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సర్పంచ్ సతీష్ తో పాటు ఉపసర్పంచ్ విజయ్ వార్డు సభ్యులు, గ్రామస్తులు బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్న ప్రకారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి విధులపై అసమర్ధత చూపుతూ సమయానికి రాకుండా వచ్చిన సమయానికి ముందే ఇంటికి వెళ్లిపోవడం సర్పంచ్ తో పాటు పలువురులను గౌరవించకపోవడం విధి నిర్వహణలో భాగంగా గ్రామస్తులకు దురుసుగా మాట్లాడడం. తమ యొక్క పరివర్తనను మార్చుకోవాలని గ్రామస్తులు చెప్పిన పట్టించుకోకపోవడం, గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించగా నేను ఇక్కడ విధులు నిర్వహించను అంటూ సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో..వేరే పంచాయతీ కార్యదర్శి నియమించండి అంటూ గ్రామస్తులు బాసర మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.
-Advertisement-
