బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన బీజేపీ బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్
చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుని నిర్మల్ జిల్లా బాసర బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం బాసరలో నెలకొన్న సమస్యలపై వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామచంద్ర రావుకు పుట్నాల సాయినాథ్ అభినందనలు తెలిపారు. ఆయన వెంట జాదవ్ గణేష్ తదితరులు ఉన్నారు

