Home Blog Page 27

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహన్ రావు పాటిల్

0

 కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహన్ రావు పాటిల్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన జాదవ్ సావిత్రి బాయి భర్త బాబురావు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ ఆ కుటుంబానికి  అండగా నిలిచారు. నిత్యవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ  పల్లె పల్లెకు..  గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమం విజయవంతం చేయడంలో జాదవ్ సావిత్రి బాయి కుమారుడు గణేష్ కృషి ఉందన్నారు. మా ప్రజా ట్రస్ట్ పేద, మధ్య తరగతి కుటుంబాలకు సహాయపడటంలో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

నర్సంపేట లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధీమా

నర్సంపేట లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధీమా

చిత్రం న్యూస్,వరంగల్:  భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.

జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ నాయకులతో కలిసి జరిగిన ఈ భేటీలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాంచందర్ రావు గారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు మరియు వివిధ మోర్చాల బాధ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఈ పర్యటన కొత్త ఉత్సాహాన్ని నింపింది

వృద్ధురాలికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

వృద్ధురాలికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

చిత్రం న్యూస్,వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమార్థంగా భావించే ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది.  ఈ సంస్థ తన 175వ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన పేర్ణ ఎల్లమ్మ అనే వృద్ధురాలు, ఎటువంటి ఆధారం లేక ఆరోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గుతోంది. ఆమె దీనస్థితిని గమనించిన సనాతన హిందూ సేవా సమితి సభ్యులు, మానవత్వంతో స్పందించి ఆమెకు రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని, ఇప్పటివరకు 175 కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సాయం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు ప్రతాపగిరి గణేష్‌తో పాటు సభ్యులు బడుగు రాము, గంగిడి ధర్మారెడ్డి, పేర్ణ భరత్, దీకొండ అమర్నాథ్, పెరుమాండ్ల శ్రవణ్, దిడ్డి మోహన్, బండారి సంపత్, ఓదెల తిరుపతి తదితరులు పాల్గొని వృద్ధురాలికి సాయం అందించారు. తమ వంతు సాయం అందినందుకు వృద్ధురాలు ఎల్లమ్మ కన్నీటి పర్యంతమవుతూ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆదిలాబాద్: 44 దొంగతనాల కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

ఆదిలాబాద్: 44 దొంగతనాల కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ పాత నేరస్థుడిపై పోలీసులు పీడీ (Preventive Detention) యాక్ట్ ప్రయోగించారు. ఉట్నూర్ ప్రాంతానికి చెందిన టేకం తుకారం (40) అనే వ్యక్తిపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. టేకం తుకారం గత 10 ఏళ్లకు పైగా వరుస నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 44 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎస్పీ సిఫార్సు మేరకు పీడీ యాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్ నమోదైన అనంతరం నిందితుడిని నిన్న చంచల్‌గూడ/చర్లపల్లి జైలుకు తరలించారు. వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీపీ, జిల్లా అధికారులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ నగర పర్యటనకు బుధవారం విచ్చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిజామాబాద్ చేరుకున్న మంత్రిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, ఇతర జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి పోలీసు బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా మంత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకోగా, అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా అధికారులతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తద్వారా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఎన్ని చట్టాలు నిబంధనలు అమలు చేసినా, ప్రజలలో మార్పు రానంత వరకు ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అన్నారు. దీనిని గుర్తిస్తూ పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అరైవ్ అలైవ్ పేరుతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించాలని, అలా కృషి చేసిన వారిని రహ్ వీర్ కింద రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ కంది రైతులకు ఊరట.. రూ.10 కోట్ల బకాయిలు విడుదల

ఆదిలాబాద్ కంది రైతులకు ఊరట.. రూ.10 కోట్ల బకాయిలు విడుదల!

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని కంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల మార్క్‌ఫెడ్ ద్వారా రైతులు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన రూ. 10 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ వరకు జరిగిన కొనుగోళ్లకు సంబంధించి ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 27 వరకు ప్రభుత్వం సేకరించిన 18,194 క్వింటాళ్ల కంది పంటకు గానూ మొత్తం రూ. 14.52 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే రూ. 3.5 కోట్లు విడుదల చేయగా, రూ. 2.50 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

తాజాగా విడుదలైన రూ. 10 కోట్లతో మార్చి 17 లోపు పంట అమ్ముకున్న రైతులందరికీ లబ్ధి చేకూరనుంది. ఈ నిధులు త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జిల్లా కంది రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

దీపాయిగూడ వాసి ఉదారత: తహసీల్దార్ కార్యాలయానికి 15 కుర్చీల వితరణ

దీపాయిగూడ వాసి ఉదారత: తహసీల్దార్ కార్యాలయానికి 15 కుర్చీల వితరణ

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామానికి చెందిన గణపతి అయ్య తన ఉదారతను చాటుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, వారికి సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో తన వంతు సహాయంగా15 కుర్చీలను వితరణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వృద్ధులు, మహిళలు కుర్చీలు లేక నిలబడటం చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నారాయణ, ఆర్ఐ ఉల్లాస్ తో పాటు బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ గ్రామ బీజేపి పార్టీ అధ్యక్షుడు లింగా రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్,స్థానిక నాయకులు వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, సూర్య రెడ్డి, పొచ్చన్న, అశోక్,  ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గణపతి అయ్య చేసిన ఈ సామాజిక సేవను రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజలు అభినందించారు.

రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రాణరక్షణ: ఎమ్మెల్యే పాయల్ శంకర్

రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రాణరక్షణ: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రజా పాలనలో 99 రోజుల వేడుకల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఓ పాఠశాలలో ‘Arrive – Alive’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే మేలని సూచించారు. ప్రమాదాల వల్ల బాధితులే కాకుండా వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ వివరాలను తనిఖీ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ రవాణా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్ 

0

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ ( కె) గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, బాసర మండల అధ్యక్షుడు కోర్వ శ్యాం  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాసర మండలంలోని ఆయా గ్రామాలలో మొక్కజొన్న పంటను రైతులు విస్తారంగా పండించారని, పంటను అమ్ముకునేందుకు మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు లేక పంటను దళారీ చేతిలో అమ్మి మోసపోతున్నారన్నారు. ఆరుగాలం పంట పండించి పంటను ప్రయివేట్  దళారులకు తక్కువ రేట్లలో అమ్ముకోవాల్సి వస్తుందన్నారు.ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ప్రభుత్వంపై ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్, గంగాధర్, మంతెన పోశెట్టి, పెద్దకప్ రవి,మలేగాం గోపాల్, అగుల్ల శివన్న, జాజోళ్ల అశోక్, జాజోళ్ల రాజు, నరడి మహేష్, పల్లె రాజేశ్వర్, గుడాల లక్ష్మణ్, యోగేష్, మలేష్ పాల్గొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓ లు ఇతర అధికారులతో కలెక్టర్ తాగునీరు సరఫరా తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు.

జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నందున హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఆవాసంలో ఒక్కో నివాస గృహం వారీగా శుద్ధి జలాలు అందేలా నీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలని, కుళాయిల బిగింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయించాలన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలన్నారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీఓలు, ఏఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, మిషన్ భగీరథ ఈఈ రాకేష్, నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు

అన్ని అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మాణ తలపెట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీంగల్ మండలం  గోన్ గొప్పుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి అనువైన పరిస్థితులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు తరగతి గదులతో పాటు, ల్యాబ్ రూమ్ లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్ఓ ప్లాంట్, బోర్ వెల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ తదితరులు ఉన్నారు.