Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad దీపాయిగూడ వాసి ఉదారత: తహసీల్దార్ కార్యాలయానికి 15 కుర్చీల వితరణ

దీపాయిగూడ వాసి ఉదారత: తహసీల్దార్ కార్యాలయానికి 15 కుర్చీల వితరణ

0
56

దీపాయిగూడ వాసి ఉదారత: తహసీల్దార్ కార్యాలయానికి 15 కుర్చీల వితరణ

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామానికి చెందిన గణపతి అయ్య తన ఉదారతను చాటుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, వారికి సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో తన వంతు సహాయంగా15 కుర్చీలను వితరణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వృద్ధులు, మహిళలు కుర్చీలు లేక నిలబడటం చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నారాయణ, ఆర్ఐ ఉల్లాస్ తో పాటు బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ గ్రామ బీజేపి పార్టీ అధ్యక్షుడు లింగా రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్,స్థానిక నాయకులు వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, సూర్య రెడ్డి, పొచ్చన్న, అశోక్,  ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గణపతి అయ్య చేసిన ఈ సామాజిక సేవను రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజలు అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp