Home Blog Page 22

ఆదిలాబాద్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కు ఘన స్వాగతం

ఆదిలాబాద్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కు ఘన స్వాగతం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా ను ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులు, అత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా, కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులను కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలి

 ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలి

*పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  2023లో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో జరిపిన డిప్యూటేషన్లలోనే ఉపాధ్యాయులు నేటికీ కొనసాగుతున్నారని ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో సర్దుబాటు ప్రక్రియ అవసరం లేనప్పటికీ ఉపాధ్యాయుల్ని మరో పాఠశాలకు తరలించారనే ఆరోపణలు ప్రస్తుత డీఈఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సిందని దాటవేశారన్నారు. అప్పటి కలెక్టర్ కి  పీఆర్టీయూ తెలంగాణ ప్రాతినిధ్యం చేసినప్పటికీ డీఈఓ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా దాటవేశారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు పక్కకు పెట్టి ఉపాధ్యాయులు, సంఘాల ప్రయోజనాల మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసి నూతన డీఎస్సీతో కొత్త ఉపాధ్యాయులను నియమించినప్పటికీ అయినా సర్దుబాటు చేసిన వారు యథాస్థానాలకు రాకుండా అక్కడే కొనసాగుతున్నారన్నారు. తక్షణమే ఈ విద్యా సంవత్సరం ఆఖరి నాటికి ఉపాధ్యాయులను వారి సొంత పోస్టింగ్ లో పంపాలని, అన్ని కేటగిరీల డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు

ఘనంగా అగ్నిమాపక శాఖ వాహన ర్యాలీ

ఘనంగా అగ్నిమాపక శాఖ వాహన ర్యాలీ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన ర్యాలీ ఘనంగా జరిగింది. ఫైర్ స్టేషన్ నిజామాబాద్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పులాంగ్ చౌరస్తా, ఆర్‌ఆర్ చౌరస్తా, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, దేవి రోడ్, ఆర్టీసీ డిపో-1, రైల్వే స్టేషన్, ఎన్‌టీఆర్ సర్కిల్, జిల్లా కోర్టు మార్గంగా కొనసాగి తిరిగి ఫైర్ స్టేషన్‌కు చేరుకుంది. ప్రజల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ర్యాలీ సజావుగా సాగింది.

మహిళా బిల్లు విషయంలో మోదీ సర్కార్‌ది కుట్ర: డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్

మహిళా బిల్లు విషయంలో మోదీ సర్కార్‌ది కుట్ర: డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లు చట్టం ముసుగులో 131 సవరణలతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ అసలు లక్ష్యమని ఆయన ఆరోపించారు. కులగణన చేయకుండా డీలిమిటేషన్ చట్టాన్ని ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, మోదీ మరియు బీజేపీ నాయకులు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించిందని, మహిళలను దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్‌గా గౌరవించిందని గుర్తుచేశారు. నిజంగా మోదీకి చిత్తశుద్ధి ఉంటే, కేవలం మహిళా రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలి. డెలిమిటేషన్‌తో ముడిపెడితే కాంగ్రెస్ పార్టీ సహకరించదాని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముందుగానే వికసించిన మే పుష్పం

ముందుగానే వికసించిన మే పుష్పం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: పత్రి సంవత్సరం మే లో వికసించే మే పుష్పం ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఏప్రిల్ నెలలోనే వికసించింది. నగరంలోని ఎల్లమ్మ గుట్టలో నివాసముండే రిటైర్డ్ ప్రభుత్వ హెడ్ మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ స్వగృహంలోని పూల కుండీ లో ఆదివారం రెండు మే పుష్పాలు వికసించాయని ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసిన కాలనీ వాసులు పుష్పాలను ఉత్సాహంగా తిలకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా వాసులంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన  తెలిపారు.

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఇమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రోచ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై సహకారంతో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలొ ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా హీమోఫిలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్:గంగారం మరియు ఇన్నమురీ రవితేజ,డాక్టర్:రఘు, డాక్టర్:సంతోష్ దంత వైద్యులు డాక్టర్: జగదీష్ ఫిజియోథెరపిస్ట్ , స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య హిమఫిలియా సొసైటీ అధ్యక్షులు దాసరి విజయనందరావు లు పాల్గొని హిమోఫిలియా వ్యాధి గురించి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. అయితే హిమోఫిలియా వ్యాధి అనేది ఒక రాజవంశపు వ్యాధిగా పేర్కొంటారన్నారు. కొందరికి జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. ఇది అన్ని వ్యాధుల మాదిరిగానే ఈ వ్యాధి కూడా ఒకటని సూచించారు. అయితే ఏ వ్యాధికైనా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చు అన్నారు.అలాగే వ్యాధి వచ్చిందని మానసిక కుంగుబాటుకు గురైనట్లయితే శారీరక దృఢత్వం కోల్పోవడం జరుగుతుందని దాంతోపాటు అనారోగ్యం బారిన మరింత ఎక్కువ పడతారని సూచించారు.మీరు ఎప్పుడైతే మానసిక దృఢత్వంతో ఉంటారో వ్యాధిని అధిగమించవచ్చని హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు మరియు వారి తల్లిదండ్రుల్లో మానసిక ధైర్యాన్ని నింపారు.అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అలాగే దంత వైద్య నిపుణులు మాట్లాడుతూ హిమోఫిలియా బారిన పడ్డవారు దంతాలు, చిగురుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా బ్రష్ చేయాలి. ఎప్పుడు రక్తస్రావం జరుగుతుంది అలా జరగకుండా ఎలా ఉండాలని క్లుప్తంగా వివరించారు.అలాగే ఫిజియోథెరపీ వైద్యుడు జగదీష్ మాట్లాడుతూ.. దినచర్యలో భాగంగా వ్యాయామం ఏ విధంగా చేయాలి ఆటలు ఏ విధంగా ఆడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన వైద్యులను హిమోఫిలియా సొసైటీ చాప్టర్ నిజామాబాద్ అధ్యక్షులు దాసరి విజయ్ నంద రావు మరియు చాప్టర్ సభ్యులు అంబరీష్, యజాస్ హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శాలువలు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.

జైనథ్ లో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరస

జైనథ్ లో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిర

చిత్రం న్యూస్, జైనథ్: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ జైనథ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా సాధికారతకు కీలకమైన మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని వారు విమర్శించారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ధి కోసం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో జైనత్ బీజేపీ మండల అధ్యక్షుడులోక కరుణాకర్ రెడ్డి, బోరాజ్ మండల బీజేపి అధ్యకుడు గాజుల సన్నీ, స్థానిక బీజేపీ నాయకులు, చిలుకూరి లింగారెడ్డి, పిడుగు సంతోష్ యాదవ్, పొచ్చన్న,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శ 

0

ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శ 

చిత్రం న్యూస్, బాసర:  నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పలువురిని పరామర్శించారు.ముథోల్ మాజీ సర్పంచ్ గంట శ్రీనివాస్ అతని మనుమరాలు రోడు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరగడంతో వారిని పరామర్శించారు. అదే విధంగా అంబకంటి గ్రామానికి చెందిన అరుంధతి అనే మహిళ కు ఆపరేషన్ జరుగగా, దౌనెల్లి గ్రామానికి చెందిన ఖాదీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు ప్రముఖ వైద్యులు దామోదర్ రెడ్డి, ముథోల్ మాజీ సర్పంచ్ అనిల్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్ తో పాటు పలువురు ఉన్నారు.

మాదిగ కులస్తుల జనాభా శాతానికి తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయించాలి

 మాదిగ కులస్తుల జనాభా శాతానికి తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయించాలి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఏకైక కులం మాదిగ కులస్తులు మాత్రమే అని గత 12 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటన సత్యమని కుల గణన రిపోర్ట్ రుజువు చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ..జనాభా  11% ఉందని, ఎస్సీ వర్గీకరణలో కూడా అంతే వాటా కేటాయించాలని మంద కృష్ణ మాదిగ గతంలో లేవనెత్తిన ప్రశ్నలు సంపూర్ణ న్యాయమని కుల గణన రిపోర్ట్ తో స్పష్టం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన నివేదికలో మాదిగల జనాభా 10.3 % గా తేలిందని దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో 10 నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చే సమయంలోనే 9% రిజర్వేషన్ వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. అయినా రేవంత్ రెడ్డి ఆనాడు న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చిన కుల గణన రిపోర్ట్ ద్వారా మాదిగల జనాభా శాతం గణంకాలతో సహా ఋజువైందని,ఇప్పుడైనా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు తెచ్చుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. సందర్భం వచ్చినప్పుడు న్యాయం చేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ సందర్భం ఇప్పుడు వచ్చిందని గుర్తించాలని అన్నారు.

మంద కృష్ణ మాదిగ జనాభా ప్రకారం మాదిగలకు 11% శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంత జాతి ద్రోహులు మాదిగ మేధావుల ముసుగులో 9% రిజర్వేషన్లను స్వాగతించి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అలాంటి ద్రోహులకు కుల గణన రిపోర్ట్ చెంప పెట్టు లాంటిదని అన్నారు. మాదిగల జనాభా శాతానికి కన్న తక్కువ శాతం రిజర్వేషన్లు రావడాన్ని స్వాగతించిన ద్రోహులు ఇప్పుడు మాదిగ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కీలక ఘట్టంలో జాతికి వెన్నుపోటు పొడిచి తీరని ద్రోహం చేసిన వాళ్లకు జాతి గురించే మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. ద్రోహం ఎప్పటికైనా ఓడిపోతుందని సత్యమే ఎప్పటికైనా గెలిచి తీరుతుందని అన్నారు. జాతికి ద్రోహం చేసిన వాళ్లకు జాతి గురించి మాట్లాడే అర్హత ఇకపై లేదని అన్నారు.ఇక ప్రభుత్వం బహిరంగపరిచిన కుల గణన రిపోర్ట్ లో జనాభాలో మాదిగలు ప్రథమ స్థానంలో ఉన్నట్లుగానే దినసరి కూలీ పని చేసుకునే వారిలో,అలాగే భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్న వారిలో కూడా మాదిగలే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇది మాదిగల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటుతనాన్ని సూచిస్తుందని అన్నారు.గత 80 ఏళ్ల కాలంలో మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పని చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి తగిన సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టాలని,ప్రభుత్వ భూములను మాదిగలకు పంచాలని డిమాండ్ చేశారు.అన్ని రకాల ప్రభుత్వరంగ నియామకాల్లో 11% వాటా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలు శాసనమండలిలో , లోక్ సభ, రాజ్యసభలో, నామినేటెడ్ పోస్టులో ఒక్కరు కూడా లేరని, ఈ అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో బలమైన నిర్మాణాత్మక శక్తిగా ఎదగడానికి మరింత సంఘటితం కావాలని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు ఫులే ద్విశత జయంతి ఉత్సవాలను రెండు సంవత్సరాల పాటు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుందని, అందుకోసం ప్రధానమంత్రి చైర్మన్ గా 126 మందితో కమిటీ ఏర్పాటు చేసిందని,ఆ కమిటీలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను సభ్యుడిగా నియమించడం జరిగిందని,అందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి యావత్తు మాదిగ జాతి తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇది మాదిగలు ఇచ్చిన గుర్తింపు,గౌరవంగా భావిస్తామని అన్నారు.ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, దేశంలో మొదటిగా మహాత్ముడిగా నిలిచిన మహాత్మా ఫులే సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, మందర్న మారుతి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చెవురి సంజీవయ్య మాదిగ, MRPS నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, టౌన్ నాయకులు రాహుల్ మాదిగ, ఎల్లన్న మాదిగ, సత్యం మాదిగ తదితరులు పాల్గొన్నారు.