ఘనంగా అగ్నిమాపక శాఖ వాహన ర్యాలీ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన ర్యాలీ ఘనంగా జరిగింది. ఫైర్ స్టేషన్ నిజామాబాద్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, దేవి రోడ్, ఆర్టీసీ డిపో-1, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ సర్కిల్, జిల్లా కోర్టు మార్గంగా కొనసాగి తిరిగి ఫైర్ స్టేషన్కు చేరుకుంది. ప్రజల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ర్యాలీ సజావుగా సాగింది.




