Home Blog Page 13

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 27 ఏప్రిల్ 2001న జలదృశ్యంలో కేసీఆర్ నేతృత్వంలో స్థాపించబడిన ఈ పార్టీ, నేటికి 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట (రజతోత్సవ ఏడాది) అడుగుపెడుతోందని తెలిపారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో మిఠాయిలు పంపిణీ చేశారు, జై తెలంగాణ నినాదాలతో కార్యాలయం మారుమోగింది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బీఆర్‌ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల రాస్తారోకో

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల రాస్తారోకో

చిత్రం న్యూస్, దండేపల్లి : వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండలంలో సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యాసంగి పంట కోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను ఇంట్లో నిల్వ ఉంచుకోవడం కష్టంగా మారిందని, మార్కెట్‌లో సరైన ధరలు లభించక నష్టపోతున్నామని తెలిపారు.

అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జన గణన స్వీయ నమోదును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

జన గణన స్వీయ నమోదును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

చిత్రం న్యూస్, సూర్యాపేట:  తెలంగాణ రాష్ట్రంలో జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు పోర్టల్ ను (Self-Enumeration) ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయ గణన పోర్టల్ ను ఉపయోగించడం వల్ల విలువైన సమయం ఆదా అవుతుందన్నారు. వివరాల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ కరీం, మున్సిపాలిటీ TPO సోమయ్య, రాజు,బిక్షం,  మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కడంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0

కడంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చిత్రం న్యూస్, కడెం: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కడం మండల అధ్యక్షులు నల్ల జీవన్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూ రావు, పార్టీ సీనియర్ నాయకులు పల్లె మల్లారెడ్డి, ముబారక్ బీన్ మొహమ్మద్, ఇస్లావత్ గంగన్న, వేణుగోపాల్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, నరసయ్య, మల్లేష్, హసీబ్, సపవాత్ రవి, కానగంటి మల్లేష్, జీల నాగ రాజు, బీఆర్ఎస్ పార్టీ కొండుకూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు కళ్లెం తిరుపతిరెడ్డి, పాండాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగాధర్, కడం గ్రామ కమిటీ అధ్యక్షులు కే రవి, నాయకులు కోల నరేష్, జాడి నరసయ్య, కోటయ్య ,చిట్టేటి గణేష్, సమ్మేటి రాజన్న, నవీద్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జైనథ్ లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

జైనథ్ లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

చిత్రం న్యూస్, జైనథ్: భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జైనథ్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలే ధ్యేయంగా పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పులవేణి గణేష్ యాదవ్,  లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, నితిన్ రెడ్డి, దీపాయిగుడ ఉప సర్పంచ్ స్వామి, మాదస్తు వెంకన్న, పిడుగు స్వామి యాదవ్, అశన్న,పార్టీ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

0

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గాన్నోరా గ్రామంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు గ్రామంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. గ్రామ సర్పంచ్. రాజు, ముథోల్ సబ్ ఇన్స్పెక్టర్ బిట్ల పెర్సిస్ పంచరంగి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆయన చూపిన మార్గంలో నడవాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సామాజిక న్యాయానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, మనోహర్, ఉప సర్పంచ్ పెంటన్న , ప్రముఖ జానపద గాయని, లక్ష్మి, అష్ట గంగాధర్, రాజేశ్వర్. గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వీయ జనగణన నమోదు

స్వీయ గణన పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న మొదటి విడత జనగణన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన (Self-Enumeration) పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డిజిటల్ జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

స్వీయ గణన పోర్టల్‌ను ఉపయోగించడం వల్ల ప్రజల విలువైన సమయం ఆదా అవుతుందని, వివరాల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సామాన్య ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ద్వారా ఎవరికి వారు తమ వివరాలను స్వయంగా వెబ్‌సైట్‌లో పొందుపరచవచ్చని ఆయన వివరించారు.

జనగణన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.

సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: హాజరైన యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి

సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: హాజరైన యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన బోరత్ వార్ అమ్మక్క-రాజు దంపతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ‘సారె’ అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. బేల మండలంలో అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్, సామ నర్సారెడ్డి, వార్డ్ మెంబర్ మంచికంటి ఉషన్న, మంచికంటి సాయి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, నల్ల వెంకట్ రెడ్డి, ప్రకాష్ నవగరే, రవీందర్ పటేల్, దేవన్న, సుధాకర్, సతీష్, సామ గణేష్ రెడ్డి, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులు

0

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులు

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా  కుటుంబీకులతో కలిసి ఆదివారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. కలెక్టర్ వెంట ఆలయ ఏఈఓ గంగ ప్రసాద్, ఆలయ అధికారులు, పండితులు తదితరులు ఉన్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ‘ప్రజాపాలన – ప్రత్యేక ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని బంగారిగూడ మైనార్టీ గురుకుల బాలికల కళాశాల-2లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, మావల ఇంచార్జ్ ఎంపీడీవో కృష్ణవేణి, మైనార్టీ బాలికల కళాశాల-1 ప్రిన్సిపల్ ఫర్హీన్ సుల్తానా, మైనార్టీ బాలికల కళాశాల-2 ప్రిన్సిపల్ రజిని, అధ్యాపకులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు.