-Advertisement-

సాగునీటి రంగం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం సస్యశ్యామలం

సాగునీటి రంగం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం సస్యశ్యామలం:ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రైతులంతా కలిసికట్టుగా ఉండి సాగునీటి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో రూ. 37 లక్షల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ లను రైతులందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. లోకేశ్వరం, ముథోల్, బాసర మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లకు తన హాయంలో పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.లోకేశ్వరం మండలంలో హమ్ పథకంలో రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం జరిగిందని, ఏడాది లోపు మండలంలో 60 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రూ.50 కోట్ల నిధులతో అర్లి వంతెన నిర్మాణం చేపడతామన్నారు. ఆర్లి వంతెన విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాల కాలంలో అప్పట్లో పెద్ద మొత్తంలో నిధులు ఉన్న పాలకుల నిర్లక్ష్య మూలంగా రోడ్ల నిర్మాణం జరగలేదన్నారు. రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, కాస్త ఓపిక పట్టాలని, రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అయ్యాయన్నారు. అదేవిధంగా 28 ప్యాకేజ్ పూర్తి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని, నిధులు మంజూరు అయితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశల వారీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments