Home Blog Page 12

ఆదిలాబాద్ హత్య కేసు ఛేదించిన పోలీసులు: 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్ హత్య కేసు ఛేదించిన పోలీసులు: 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో సంచలనం సృష్టించిన అనిత అనే మహిళ హత్య కేసును వన్ టౌన్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఏప్రిల్ 24న హల్దీరాం ప్రాంతంలోని పంజాబ్ చౌక్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో అనిత మృతదేహం లభ్యమైంది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, పోలీసుల విచారణలో ఇది దారుణ హత్యగా తేలింది.

మృతురాలి సోదరుడు జనగం వార్ సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన నర్సింగ సంతోబా గంపల్వాడ్ (25) అనే కూలీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏప్రిల్ 27న ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు వెల్లడైంది. నిర్మానుష్య ప్రాంతంలో అనితపై దాడి చేయగా ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని డ్రైనేజీ కాలువలో పడవేసి పరారయ్యాడు.

అత్యంత వేగంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులను ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

చెన్నూరి వర్షిణికి సనాతన హిందూ సేవా సమితి అండ

 చెన్నూరి వర్షిణికి సనాతన హిందూ సేవా సమితి అండ

చిత్రం న్యూస్, వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా భావించే ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సమితి ఆధ్వర్యంలో ఈరోజు 180వ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

వరంగల్‌లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన చెన్నూరి వర్షిణి అనే యువతి తీవ్ర ఆరోగ్య సమస్యలతో పాటు, ఎటువంటి ఆధారం లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సనాతన హిందూ సేవా సమితి సభ్యులు మానవత్వంతో స్పందించారు. ఆమెకు బాసటగా నిలుస్తూ, రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు ప్రతాపగిరి గణేష్ పాల్గొన్నారు. వీరితో పాటు గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, పెరుమాండ్ల శ్రవణ్, మేరుగు కరుణాకర్, పేర్ణ భరత్, బండారి సంపత్, దిడ్డి మోహన్, గుండేటి రజిని కుమార్, నాగుల మోహన్, నోముల రాజేశ్వర్ తదితరులు పాల్గొని వర్షిణి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. కష్టకాలంలో తమను ఆదుకున్న సేవా సమితి సభ్యులకు వర్షిణి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఏప్రిల్ 27న ‘గోమాత గౌరవ దినోత్సవం’ జరపాలి: భీంపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

ఏప్రిల్ 27న ‘గోమాత గౌరవ దినోత్సవం’ జరపాలి: భీంపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

చిత్రం న్యూస్, భీంపూర్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీని ‘గోమాత గౌరవ దినోత్సవం’గా అధికారికంగా ప్రకటించి, ఘనంగా నిర్వహించాలని కోరుతూ భీంపూర్ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. గో సంరక్షకులు, గోశాల నిర్వాహకుల పిలుపు మేరకు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ వేదిక ఉపాధ్యక్షులు ఏనుగు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో గోమాతను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆవుకు ‘రాష్ట్ర మాత’ లేదా ‘రాజ్యాంగ మాత’ హోదా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గోశాలల్లో ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు నిర్వహించి, గోరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

హిందూ సంస్కృతిలో గోవును సకల దేవతా స్వరూపంగా భావిస్తామని, ఆవు ద్వారా లభించే పంచగవ్యాలు మానవాళికి ఎంతో మేలు చేస్తాయని వారు వివరించారు. గో రక్షణే ధర్మమని, దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు రవీందర్ జాదవ్, కాల్చప్ యాదవ్, లింబాద్రి, అర్లి (టి) గో సంరక్షణ కమిటీ సభ్యులు, గో సేవకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మేడే’ వేడుకలను జయప్రదం చేయండి: సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి

మేడే’ వేడుకలను జయప్రదం చేయండి: సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సీపీఐ కార్యాలయంలో సోమవారం సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 1న జరగనున్న 141వ మేడే వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1886కు ముందు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు వెట్టిచాకిరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటాన్ని గుర్తుచేశారు. ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడిన కార్మికులను అప్పటి అమెరికా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిందని, లక్షలాది మంది రక్తం చిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రక్తపు ధారల్లో తడిసిన కార్మికుడి చొక్కాయే నేడు ఎర్రజెండాగా మారి ప్రపంచ కార్మిక వర్గానికి స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు.

బానిసత్వం నుండి విముక్తి పొందేందుకు, హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో కార్మికులు మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నలినీ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్. అరుణ్, షేక్ పాషా, బెజ్జంకి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 

 విద్యుత్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 

* మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఏఈలు వినోద్, సదానందం, మున్సిపల్ డీఈ కార్తీక్, ఏఈలు నితిన్, కిరణ్‌లతో కలిసి ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గత పది రోజులుగా 49 వార్డుల్లో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన నివేదికలను విద్యుత్ అధికారులకు అందజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో స్ట్రీట్ లైట్ థర్డ్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా విలీన గ్రామపంచాయతీల్లో థర్డ్ వైర్ నిర్వహణకు అవసరమైన నిధులను మున్సిపాలిటీ నుంచి చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలు, వంకరగా ఉన్న పోల్స్, దెబ్బతిన్న పోల్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు, లో-వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను (లూజ్ వైర్లు) వెంటనే సరిచేసి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు శాఖల అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

సింహాచల క్షేత్రంలో భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ

0

సింహాచల క్షేత్రంలో భక్తులకు ‘చందన ప్రసాదం’ పంపిణీ

చిత్రం న్యూస్, సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి  దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు విశేషమైన “చందన ప్రసాదం” పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు తెలిపారు.

చందన ప్రసాదం విక్రయం  ఈ నెల 28 ఉదయం 8  గంటల నుండి దేవస్థానం ప్రసాద కౌంటర్ల వద్ద ప్రారంభమవుతుందన్నారు. ప్రతి చందన ప్రసాదం ప్యాకెట్ ధర రూ.10 మాత్రమే నిర్ణయించడం జరిగిందన్నారు.

ప్రతి భక్తుడికి ఒక్క టికెట్ (ఒక ప్యాకెట్) మాత్రమే జారీ చేస్తామని, ప్రసాదం పొందదలచిన భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు (అసలు లేదా జిరాక్స్ ప్రతిని) వెంట తీసుకురావలసిందిగా సూచించారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కోరారు.

దుశ్చర్లను పరామర్శించిన సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

దుశ్చర్లను పరామర్శించిన సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

చిత్రం న్యూస్, సూర్యాపేట: ఇటీవల దాడిలో గాయపడి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణను మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. సోమవారం ఆసువత్రికి వెళ్లిన ఆయన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలన్నారు. ధైర్యంగా ఉండాలని దుశ్చర్లకు సూచించారు.

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన దహిగావ్ గ్రామ సర్పంచ్ భోక్రె శంకర్

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన దహిగావ్ గ్రామ సర్పంచ్ భోక్రె శంకర్

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దహిగావ్ గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ భోక్రె శంకర్ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా మూతబడిన పాడైపోయిన వాటర్ ప్లాంట్ ను పునఃరుద్దరించామన్నారు. ఈ ఎండాకాలంలో ప్రజల దాహార్తి కోసం ప్లాంటును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మినరల్ వాటర్‌ తాగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్‌ తాగే వారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మినరల్ వాటర్‌ తాగుతున్నారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని  ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించానన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి, ఫీల్డ్ కోఆర్డినేటర్ నరేందర్ బోయర్, గ్రామస్తులు రాందాస్ నాక్లే, హులేకే బాపూరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

బేలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

బేలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం లో సోమవారం ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ కళ్లెం ప్రమోద్ రెడ్డి తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ శక్తి బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన ఈ మహత్తర ప్రయాణం ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితం. గ్రామం నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణవాడికి గర్వకారణమన్నారు.

తెలంగాణ కోసం పుట్టి, తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ కోసం నిరంతరం సేవలందిస్తున్న ఈ పార్టీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఒల్లప్ వార్ దేవన్న, ఠాక్రె గంభీర్, అడాణేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, సర్పంచులు విపిన్ ఖోడె,కుడ్మెత శతృఘన్,వైద్య కిషన్ రావు, ఠాక్రే మంగేష్, మస్కె తేజరావు, పవార్ ప్రకాష్,కొడాపే అరుణ్, ధోటె ప్రఫుల్, చవాన్ సుధాకర్, సోడెం సురేష్,గోడె విశాల్,రాథోడ్ మాధవ్, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 27 ఏప్రిల్ 2001న జలదృశ్యంలో కేసీఆర్ నేతృత్వంలో స్థాపించబడిన ఈ పార్టీ, నేటికి 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట (రజతోత్సవ ఏడాది) అడుగుపెడుతోందని తెలిపారు.తెలంగాణ ఆత్మగౌరవం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో మిఠాయిలు పంపిణీ చేశారు, జై తెలంగాణ నినాదాలతో కార్యాలయం మారుమోగింది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బీఆర్‌ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.