Home Blog Page 11

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు ఏప్రిల్ 29న మధ్యాహ్నం 02:00 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ సలహాదారు శ్రీ కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

ఫలితాలను ఇలా చూసుకోండి: విద్యార్థులు తమ ఫలితాలను కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు:

results.bsetelangana.org

results.bse.telangana.gov.in

bse.telangana.gov.in

school.edu.telangana.gov.in

వాట్సాప్ ద్వారా ఫలితాలు:

ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులు మీసేవ (MeeSeva) వాట్సాప్ నంబర్ 8096958096 కు “Hi” అని సందేశం పంపి, తమ హాల్ టికెట్ వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.

మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

0

మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: బాసర సీఐ కిరణ్ కుమార్ 

చిత్రం న్యూస్, బాసర : గంజాయి వినియోగం, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని సీఐ కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో విస్తృతంగా, అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. గంజాయి వాడకం వల్ల కలిగే అనర్థాలపై బాసర ప్రజలకు, యువత, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్టాలు వినియోగించిన, విక్రయించిన సమాచారం తెలుపాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని బాసర సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

చిత్రం న్యూస్ సైదాపూర్:  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. సైదాపూర్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలు, ప్లాంటేషన్, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు వేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల దత్తత ద్వారా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఓట్ల తొలగింపుపై బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవాన్ని పెంచుతున్నానని మంత్రి స్పష్టం చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వినతి పత్రం అందజేత 

0

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వినతి పత్రం అందజేత 

చిత్రం న్యూస్, బాసర : అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని బాసర  బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డికి సీ.హెచ్ సాయినాథ్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. అర్హులైన లబ్ధిదారులు గత ఎనిమిది నెలల నుండి ఇంటిని మొత్తం కూల్చివేసి అద్దె ఇంట్లో ఉంటున్నారన్నారు. అటువంటి వారికి వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీడీఓ పెండింగ్ లో ఏమీ లేవన్నారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే మంజూరు చేస్తామన్నారు.

 

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ..బాల్య వివాహం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ దురాచారాన్ని అరికట్టడం మనందరి బాధ్యతని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. “ఆడపిల్లల చదువు మధ్యలో ఆగకూడదు. చిన్న వయసులో పెళ్లి వద్దు – వారి పెద్ద కలలకు ఊపిరి పోద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ టీచర్ సునీత పాల్గొని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో ఇకపై ఎలాంటి బాల్య వివాహాలు జరగనివ్వమని ఈ సందర్భంగా గ్రామస్థులందరూ కలిసి నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దినేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన గిమ్మ సంతోష్ రావు, అడ్డి భోజా రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాజ్ గోండు సమితి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు సోయం బాపూరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు అడ్డి భోజా రెడ్డి, నాయకులు డేరా కృష్ణారెడ్డి, నరేష్ రెడ్డి, ఎం.ఏ. ఖయ్యుమ్ తదితరులు సోయం బాపూరావ్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని వారు ఈ సందర్భంగా కొనియాడారు. మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొని బాపూరావ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

మూగజీవాల దాహార్తి కోసం నీటి తొట్టె ఏర్పాటు చేయిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి 

మూగజీవాల దాహార్తి కోసం నీటి తొట్టె ఏర్పాటు చేయిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి 

చిత్రం న్యూస్, మావల:  భానుడు భగ భగమంటూ ప్రతాపం చూపిస్తున్నాడు.  ఆ మండే ఎండలతో మూగజీవాలు సైతం నీటి కోసం వెంపర్లాడుతున్నాయి. మూగజీవాల దాహార్తి తీర్చేందుకు బట్టి సావర్గాం గ్రామ సర్పంచ్ నీటి తొట్టెను ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గ్రామ శివారులో పశువుల కోసం పంచాయతీ నిధులతో తొట్టెను నిర్మాణం చేయిస్తున్నాడు. ఉదయం పూట అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నాడు. తొందరగా నిర్మాణం పూర్తి చేయించి పశువులకు నీటి తొట్టెను అందుబాటులోకి తీసుకొస్తానని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి: మంత్రుల ఆదేశం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి: మంత్రుల ఆదేశం

చిత్రం న్యూస్, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు నియోజకవర్గాల వారీగా జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు.

ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, బేస్‌మెంట్, రూఫ్ లెవెల్ పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, నాణ్యతను జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని, జాప్యం చేస్తే చర్యలు ఉంటాయని మంత్రులు హెచ్చరించారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందేలా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎంపీలు గోడం నగేష్‌, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్‌, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్‌ సాగర్‌ రావు, గడ్డం వినోద్‌, రామారావు పటేల్‌, పాయల్ శంకర్‌, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్‌ బాబు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్‌ కుమార్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌, జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, హరిత, భవేశ్‌ మిశ్రా, కుమార్‌ దీపక్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ అఖిల్ మహాజన్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి తక్షణ పరిష్కారం చూపేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘గ్రీవెన్స్ డే’ (ప్రజావాణి) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 36 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని, బాధితులకు భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించాలనుకునే వారు 8712659973 అనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, మీ వివరాలు రహస్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీసు యంత్రాంగం తెలిపింది.

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక రోగికి రక్తదానం చేసి ఒక యువకుడు తన ఉదారతను చాటుకున్నాడు. జైనూర్ మండలానికి చెందిన జ్యోతి లక్ష్మి అనే పేషెంట్ శరీరంలో రక్తం స్థాయి 6.6 కి పడిపోయింది. ఆమెకు అత్యవసరంగా ‘A పాజిటివ్’ (A+ve) రక్తం అవసరమైంది. రక్తం దొరక్క కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న సమయంలో, ఈ విషయం శ్రీ వాసుకేదశ్వర ధామ్ ట్రస్ట్ సభ్యుడు ‘సాయి సనాతని’ కి తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన, ఆదిలాబాద్‌లోని కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. సమయానికి స్పందించి ప్రాణదాతగా నిలిచిన సాయి సనాతనిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ వాసుకేదశ్వర ధామ్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు.