రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు ఏప్రిల్ 29న మధ్యాహ్నం 02:00 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ సలహాదారు శ్రీ కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.
ఫలితాలను ఇలా చూసుకోండి: విద్యార్థులు తమ ఫలితాలను కింద పేర్కొన్న అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు:
results.bsetelangana.org
results.bse.telangana.gov.in
bse.telangana.gov.in
school.edu.telangana.gov.in
వాట్సాప్ ద్వారా ఫలితాలు:
ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులు మీసేవ (MeeSeva) వాట్సాప్ నంబర్ 8096958096 కు “Hi” అని సందేశం పంపి, తమ హాల్ టికెట్ వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.

