సామర్లకోట నుండి కాకినాడ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు
చిత్రం న్యూస్,కాకినాడ: సామర్లకోట నుండి అచ్చంపేట వెళ్లే భారత్ మాల రోడ్డుకు బ్రిడ్జిలు నిర్మాణంలో భాగంగా గడ్డర్లు లేపుతున్నందున ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఓవర్ బ్రిడ్జి గడ్డర్ లాంచ్ కోసం సామర్లకోట నుండి కాకినాడ కలెక్టరేట్ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు ఈనెల 7 నుండి 10 వరకు (పూర్తి 4 రోజులు) నిలుపుదల చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. అదేవిధంగా అచ్చంపేట జంక్షన్ లో రోడ్డు పై గడ్డర్లు లేపుతున్నందున జూన్ 11 నుండి 13 తేదీ వరకు మూడు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించి పోలీసు వారు సూచించిన మార్గాలలో తమ వాహనాలను మళ్లించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి సూచించారు.