సామర్లకోటలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం
*యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్
*మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో యోగా శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎంపీడీఓ హిమ మహేశ్వరి
చిత్రం న్యూస్, సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో యోగా శిక్షణా తరగతులను ఎంపీడీవో హిమామహేశ్వరి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21 వ తారీఖున 11వ అంతర్జాతీయ యోగాంధ్ర నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగా ట్రైనర్స్ చేత వివిధ రకాల యోగాసనాల సాధన చేయించారు. ఎంపీడీఓ హిమ మహేశ్వరిమాట్లాడుతూ.. ఈ నెల 31 వ తారీకు వరకు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.