సైదాపూర్లో మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
*పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్
చిత్రం న్యూస్, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్, దుద్దెనపల్లి, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు రేగుల సుమలత అశోక్, మేకల శిరీష ముకుంద రెడ్డి, యుగంధర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా, మాజీ సర్పంచ్లను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీలకు సంబంధించి 153 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన 9,990 బిల్లులు, అలాగే 85 కోట్ల రూపాయల ఎస్డీఎఫ్ గ్రాంట్ చెల్లించినట్లు పత్రికల ద్వారా ప్రకటించింది. అయితే, ఈ బిల్లులు కేవలం పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన చిన్న చిన్న పనులకు మాత్రమే చెల్లించారు. మాజీ సర్పంచ్లు చేసిన పనులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము గతంలో గ్రామాల్లో రోడ్లు, హైమాస్ట్ లైట్లు, గ్రామపంచాయతీ భవనాలు, మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాము. ఈ అభివృద్ధి సేవలను ప్రజలు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అయినా మా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు? అసలు బిల్లులు చెల్లిస్తారా? చెల్లించరా? అనే గందరగోళంలో మాజీ సర్పంచ్లు మానసిక ఆందోళనకు గురవుతున్నాం,” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు కమిషన్లతో సహా చెల్లిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గ్రామస్థాయిలో ప్రజల కోసం చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మాజీ సర్పంచ్లు చేసిన పనులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, మా పనులను గుర్తించి, పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేశారు.
I completed my Ma. JMC so i interest in this job