-Advertisement-

సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యం: సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ 

సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యం: సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ 

చిత్రం న్యూస్, నిజామాబాద్:  సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాలలో భాగంగా సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సమరసత శిక్షణా తరగతుల కార్యక్రమం ఉత్తర తిరుపతి దేవస్థానం, గంగస్థాన్, ఫేజ్-2 నిజామాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరై సామాజిక సమరసత ఆవశ్యకత, హిందూ సమాజంలో సమైక్యత గురించి వివరించారు. సమాజంలో వివక్షత, అసమానతలు లేకుండా సమరసతతో కూడిన సమాజ నిర్మాణమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బెండ లచ్చన్న, ఇందూర్ విభాగ్ సహ సంయోజక్ రావుత్ రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రమేష్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు అశోక్ భోయర్, జిల్లా ఉపాధ్యక్షులు చాట్ల స్వామి, జిల్లా సంయోజక్ మేస్రం రాజేష్, జిల్లా కోశాధికారి నాగరాజు, వేణుగోపాల్, సర్వేశ్ రెడ్డి, దుర్వ పరమేశ్వర్, శ్రీనివాస్, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments