గ్రామాల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ కు బేల మండల సర్పంచుల వినతి
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: బేల మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ మండల సర్పంచులు శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేశారు. యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం తమ గ్రామాల్లో మురరుగు కాలువలు, అంతర్గత రోడ్లు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్యలపై విచారణ జరిపించి, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాందాస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆడే శంకర్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, సదల్ పూర్ సర్పంచ్ మర్సుకోల మంగేష్, చప్రాల సర్పంచ్ దౌలత్ రావు, మసాలా కె సర్పంచ్ జుగత్ రావు, సోన్ కాస్ సర్పంచ్ మెస్రం జనార్ధన్, బాది సర్పంచ్ దంతాల వినోద్, గణేష్ పూర్ సర్పంచ్ నాగారావు, పాటన్ సర్పంచ్ గులాబ్, కొబ్బయి సర్పంచ్ సత్యపాల్, వరూర్ సర్పంచ్ సంతోష్, గూడ సర్పంచ్ అవినాష్, కాప్సి సర్పంచ్ రాహుల్, టాక్లీ సర్పంచ్ రాము, ఉప సర్పంచులు సాగర్, శేఖర్, రాజేందర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఘన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
