-Advertisement-

భైంసా ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ 

భైంసా ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బి )గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పరామర్శించారు.  శ్రావణమాసం పురస్కరించుకొని పార్డి (బి )గ్రామానికి చెందిన 10 మంది కలిసి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సమీపంలోని కైలాస్ టేక్డి ఆలయానికి  ఒకే జీపులో దర్శనానికి వెళ్లారు.  మళ్ళీ అక్కడినుంచి మహారాష్ట్రలోని సాసర్ కుండ్ వద్ద ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శించుకొని వస్తుండగా తోటుంబ సమీపంలో జీపు ముందు టైరు పేలి వాహనం బోల్తా పడి నలుగురు మృతిచెందారు.  క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పోస్టుమార్టం గదిలో మృతదేహాలను పరిశీలించి, జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని బాధితులను ఓదార్చారు. అనంతరం డాక్టర్ ప్రీతం ఆసుపత్రి, జీడీఆర్ హాస్పిటల్, వెంకటేశ్వర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఓకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిందిగా డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments