ఉట్నూర్ అటవీ వృక్ష జాతులపై గ్రంథం ఆవిష్కరణ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉట్నూర్ అటవీ ప్రాంతంలో ఉన్న వృక్ష జాతులపై బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వృక్ష శాస్త్రవేత్త డా. వేముగంటి వరప్రసాద్ రావు రచించిన _”Floristic Composition and Species Diversity of Utnoor Forest of Adilabad District, Telangana”_ అనే గ్రంథాన్ని రాష్ట్ర ఆదివాసీ నాయకులు పూసం సచిన్ కు మర్యాదపూర్వకంగా బహూకరించారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ.. డా. వరప్రసాద్ రావు చేస్తున్న వృక్ష శాస్త్ర పరిశోధనలు అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని గ్రంథాలు రాసి ఆదివాసీలతో పాటు సమాజానికి పర్యావరణ పరిరక్షణలో తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో అనికేత్, RTI మండల ఉపాధ్యక్షుడు ఉరాడే సాహిల్ తదితరులు పాల్గొన్నారు.
