-Advertisement-

నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఫ్లోరోసెంట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్ లతో నిజామా బాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్, నిజామా బాద్,ఆర్మూర్ డివిజన్ పరిధిలోగల 55 బ్లాక్ స్పాట్లను పోలీసులు సమగ్రంగా గుర్తించి పర్యవేక్షించారు.ఎస్ఐలు,సీఐలు, ఏసీపీలు,అదనపు డీసీపీ(అడ్మిన్)తో పాటు పోలీస్ కమిషనర్ స్వయంగా ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, అశోక్ సాగర్ దర్గా వద్ద నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,శనివారం పర్యవే క్షించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు ప్రధాన కారణా లైన అధిక వేగం, రోడ్డు వంపులు,స్పష్టమైన సూచిక బోర్డుల లేమి, రాత్రివేళలలో తగిన లైటింగ్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించడం జరిగింది.వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులకు సిపి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలు గా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం,ఫ్లోరోసెంట్ పెయింటింగ్ మరియు రేడియం స్టిక్కర్ తో కూడినటు వంటి పోలీస్ కటౌట్ లను ఏర్పాటు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం,రోడ్డు మార్కింగ్లు స్పష్టంగా వేయడం, స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచడం వంటి పనులు చేప ట్టాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల పర్య వేక్షణను పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదనం గా, డ్రైవర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని,హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి పాటించడం వంటి అంశాలపై కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణలో పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments