ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా హుస్సేన్ బాధ్యతల స్వీకరణ
చిత్రం న్యూస్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హుస్సేన్ ను లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా సేవలందించి పదోన్నతిపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా వచ్చిన హుస్సేన్ కు పూల మొక్క అందజేసి మర్యాద పూర్యకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారం, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్,చంద్రకాంత్,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే,రూపేష్,తిలోత్తమ ఉన్నారు.
