-Advertisement-

శివయ్య ముదిరాజ్ ను పరామర్శించిన దుర్గం శేఖర్

శివయ్య ముదిరాజ్ ను పరామర్శించిన దుర్గం శేఖర్

చిత్రం న్యూస్, హైదరాబాద్: నెల రోజుల క్రితం హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్ర చేసుకొని హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విశ్రాంతి తీసుకుంటున్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు సలేంద్ర శివయ్య ముదిరాజును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్, దుర్గం ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ దుర్గం శేఖర్ పరామర్శించారు. ఈ మేరకు మంగళవారం రోజు ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లి శివయ్య ఆరోగ్య స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని దైనందిన జీవితంలో ప్రజా జీవితంలో మళ్లీ యధావిధిగా ప్రయాణం సాగించాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు శివయ్య మిత్రబృందం గడ్డం అశోక్ (రిటైర్డ్ ఆర్మీ),దీపక్ అగర్వాల్ LIC (జనరల్ సెక్రటరీ), బోయర్ విఠల్, జి. జలపాతి, చిక్కాల ఆశన్న,మహమ్మద్ అలీ (హైకోర్టు అడ్వకేట్) సభ్యులతో పాటు గోదావరి ఖనికి కి చెందిన ముదిరాజ్ సంఘం రాష్ట్ర సుంకరి పోతరాజు, జర్న లిస్ట్ సంఘం నాయకులు గువ్వ తిరుపతి ముదిరాజ్ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments