Home Blog Page 51

బోర్డు తిప్పిన మిర్చి వ్యాపారి:రూ.5 కోట్లకు ఎగనామం !

చిత్రం న్యూస్, వరంగల్ : వరంగల్ లో మరో మిర్చి వ్యాపారి బోర్డు తిప్పేశాడు. భారీ మొత్తంలో బాకీ పడిన వారికి పంగనామాలు పెట్టాడు. జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కు చెందిన వ్యాపారి రూ.5కోట్లకు ఎగనామం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి మొత్తానికి ఐపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఆ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనే విషయం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. ఏనుమాముల మార్కెట్లో ఓ ట్రేడర్స్ పేరిట ఓ వ్యాపారి లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే, వారం రోజులుగా ఆయన మార్కెట్ కు రావడం లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఈ క్రమంలో ఆయన డబ్బు రూపేనా సంబంధాలు ఉన్న కొందరు వ్యాపారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆ వ్యక్తి బోర్డు తిప్పేసి ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. సుమారు రూ.5కోట్ల మేర బాకీలపై కోర్టులో ఐపీ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఆయన ఎవరెవరిపై ఐపీ పెట్టి ఉంటాడో వారికి నోటీసులు అందితే గానీ అసలు నిజం బయటకు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, చాంబర్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా..విషయం మాత్రం దావానలంలా వ్యాపార వర్గాల్లో వ్యాపించింది. బాధితుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొనగా వ్యాపారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఒకటీ, రెండు రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ బాకీల్లో రైతులు ఉన్నారా? కేవలం వ్యాపారులేనా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ రైతులు ఉంటే.. వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సంఘటనలు జరగకముందే అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే ఈ వ్యాపారి ఐదేళ్ల క్రితం జమ్మికుంటలో కూడా మోసం చేసి ఐపీ పెట్టీ ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడినుండి వరంగల్ కు వచ్చిన అతను ఓ ట్రేడర్స్ తో వ్యాపారం కొనసాగించాడు. అడ్తీ వ్యాపారులను మచ్చిగ చేసుకున్నాడు. అడ్తీ దారుల వద్ద భారీగా మిర్చిని కొనుగోలు చేసి ఇక్కడే అమ్ముకొని సొమ్ము చేసుకొని పక్క ప్లాన్ తో పారిపోయినట్లు తెలుస్తోంది.

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

చిత్రం న్యూస్, బాసర: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయానికి రానున్న నేపథ్యంలో, అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఆలయంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు, శంకుస్థాపన జరిగే ప్రాంతాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు అందించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణలో నిరుపేదల కోసం అపార్ట్‌మెంట్లు: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్త ప్రణాళిక

0

చిత్రం న్యూస్, డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ కింద కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఖాళీ స్థలాలున్న చోట్ల అపార్ట్‌మెంట్లు నిర్మించాలని యోచిస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇంటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద లక్షకు పైగా ఇళ్లు పూర్తయ్యాయి జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో, గృహనిర్మాణ శాఖ అధికారులు ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.ఈ అపార్ట్‌మెంట్లు స్టిల్ట్+9, స్టిల్ట్+5, మరియు జీ+3 అంతస్తుల వరకు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి యూనిట్ సుమారు 415-500 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు పడకల గదులతో నిర్మించబడనుంది. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, రాష్ట్రంలో గృహనిర్మాణ రంగంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు కానుంది

జోడాంజనేయ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్

చిత్రం న్యూస్, వేములవాడ: మండలంలోని అగ్రహారం గ్రామంలోని శ్రీ జోడాంజనేయ స్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ ఇంఛార్జి ఈఓ వెంకన్న, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్ కు ఆలయ విశిష్టతను వివరించారు. జిల్లా కలెక్టర్ శ్రీ జోడాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆమెను సన్మానించారు. స్వామివారి సన్నిధిలో కొంత సమయం గడిపి, భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు.

బాసర అమ్మవారిని దర్శించుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆలయ అధికారులతో ఆయన మాట్లాడారు. మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

డీసీసీ కార్యదర్శి ప్రణితకు ఘనంగా సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో డీసీసీ కార్యదర్శిగా నియమితులైన నార్నూర్ వాసి బానోత్ ప్రణిత సూరజ్‌కు లంబాడా జేఏసీ జిల్లా నాయకులు ఆత్మరాం బానోత్ సన్మానం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మరాం బానోత్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాధస్తు మహేందర్, కావేటి మోహన్, ఆడే రఘనాథ్, భగవాండ్లు, గజానంద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు: నిర్మల్, భైంసా ఇంఛార్జి ఏఎస్పీ సాయి కిరణ్

చిత్రం న్యూస్, బాసర: వ్యక్తుల మధ్య జరిగే చిన్నపాటి గొడవలు, చిల్లర తగాదాలు, సాధారణ రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలకు కావాలని కొంత మంది ఆకతాయిలు మత రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు.ఇటువంటి చర్యలు ప్రజల మధ్య అనవసరమైన ఉద్రిక్తతలు, విద్వేషాలను సృష్టించ డానికి ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని నిర్మల్, భైంసా ఇంఛార్జి ఏఎస్పీ సాయి కిరణ్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేయడం, సంఘటనలను వక్రీకరించి మతపరమైన కోణంలో చూపించడం వంటి చర్యలను కఠినంగా పరిగణిస్తామన్నారు. ఇటువంటి పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా  ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా నిజానిజాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు 

చిత్రం న్యూస్, పాల్వంచ: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా గురువారం పాల్వంచ మండలం పరిధిలోని నాగారం, బసవతారక కాలనీలలో జరిగిన గ్రామ సభలలో  కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి చేపడుతున్నదన్నారు. ఆరు గ్యారంటీలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సబ్సిడీ పథకం, సన్న రకం ధాన్యం కొనుగోలుకు క్వింటాకు రూ.500 బోనస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, త్వరలో కొత్త పెన్షన్ ల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ల మంజూరు వంటి పథకాలు ప్రజలకు అందిస్తుందన్నారు. త్వరలో  ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం పథకం, మధ్యాహ్న భోజన పథకం* వంటి పథకాలు చేపట్టబోతున్నదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ నారాయణ, సర్పంచ్ జర్పుల కాశమ్మ, ఉప సర్పంచ్ భాగ్యమ్మ, నాగారం సర్పంచ్ దారావత్ స్వప్న, ఉప సర్పంచ్ రంజిత్, స్పెషల్ ఆఫీసర్, మిషన్ భగీరథ ఏ ఈ మహేశ్వరీ, పంచాయతీ కార్యదర్శి అజ్మీరా రాంబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న గౌడ్, చల్లా వెంకన్న, జర్పుల వెంకన్న, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మందలపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సభ 

చిత్రం న్యూస్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలలో లబ్ధిదారుల వివరాలు, గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి పంచాయతీ పాలకమండలి సమక్షంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో ప్రభుత్వ అధికారుల తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎల్ఐ, ఎంఈఓ జగపతి, పంచాయతీ, పంచాయతీ సెక్రెటరీ గోపీనాథ్, సర్పంచ్ గుజ్జల శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ చింతలపాటి మురళి, పంచాయతీ కార్యవర్గ సభ్యులు, వార్డు మెంబర్లు,అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సాకీబండ తండలో ఘనంగా శోభాయాత్ర

0

చిత్రం న్యూస్, డెస్క్: సాకీబండ తండలో హనుమాన్ జయంతి సందర్భంగా రాముల వారి గుట్టపై భోగ్ బండార్ పూజా కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించగా, హిందూ బంధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు, తండా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ, యువత భక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో హిందువులు జనజాగృతి పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన హిందూ సాంప్రదాయాలు, సంస్కృతిని మన పిల్లలకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండు నాయక్, సక్రు నాయక్, బోడ్యి నాయక్, రమేష్ నాయక్, రవి రాథోడ్, దేవేందర్ నాయక్, శివరాం, గోపి, లాలు, జైపాల్, మణిపాల్, నరేష్, మోతిలాల్, హరిలాల్, శ్రీను, దుద్య, కుభ్యా, సుమన్, వినోద్, మురారి, కుమార్, రమేష్, బాస్కర్, నరేష్, సునీల్, మహిపాల్, హిందూ బంధువులు, హిందూ సంఘాలు, తండా వాసులు భారీ ఎత్తున పాల్గొన్నారు.