Home Blog Page 46

ముఖ్యమంత్రి బాసర పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జానకీ షర్మిల

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం బాసర ఈఓ కార్యాలయంలో భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు అందించారు. ప్రతి అధికారి తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈఓ విజయరామారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో బాసరలో మహాయజ్ఞం

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా, ఆయన రాక విజయవంతం కావాలని కోరుతూ నాగభూషణం స్కూల్ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అనంతపురంలో ఘనంగా ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ శిబిరం

0

చిత్రం న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాప్తాడు రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం’ అట్టహాసంగా జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య వక్తలుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, బీజేపీ సీనియర్ నాయకురాలు  ఎఫ్.సి.ఐ (FCI) స్టేట్ డైరెక్టర్ వనగొంది విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ‘మన్ కీ బాత్’ (మనసులో మాట), ‘మన ఊరు-మన జెండా’, ‘చేరువ’ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. భారతీయ జనతా పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు ‘వారధి’లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో వక్తగా బీజేపీ సీనియర్ నాయకులు ఓలేటి రత్నమయ్య, జిల్లా కార్యదర్శి చైతన్య కిషోర్ పాల్గొని పార్టీ సిద్ధాంతాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు రూరల్ మండల అధ్యక్షులు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి వెంకటరాముడు, రాప్తాడు ఆత్మకూరు మండల అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మాసాయిపేట మండలంలో పలువురు బీజేపీలో చేరిక

చిత్రం న్యూస్,మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు.

మాసాయిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి, ఓబీసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. డాక్టర్ వంటేరు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు పరశురామ్ చారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామంతాపూర్ తండా సర్పంచ్ చందర్ నాయక్ తో పాటు కార్యకర్తలు బానోత్ రాజు, బానోత్ నర్సిములు, జానీ నాయక్, కేతావత్ రమణ నాయక్ తదితరులకు ఎంపీ రఘునందన్ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, ప్రధాని మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు పాప్పన్నగారి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ నవీన్ యాదవ్, బూత్ అధ్యక్షులు పల్లపు సురేష్, మల్లాపురం సాయి, పల్లపు అశోక్, కేతావత్ శ్రీను నాయక్, పార్టీ కార్యకర్త తుడుం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ పండగ వేడుకలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ కంటేశ్వర్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చర్చి పాస్టర్, జీడీసీసీ ఛైర్మన్ సీఎచ్. జార్జ్ పాల్గొని యేసు క్రీస్తు యొక్క వాగ్దానాలు భక్తులకు తెలుపుతూ ఈస్టర్ పండగను వివరించారు. క్రైస్తవులు యేసుక్రీస్తు పునరుత్థానానికి(మరణం నుంచి తిరిగి లేవడం) ప్రతీకగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ ఆదివారం వరకు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు, సేవా కార్యక్రమాలతో ఈ పండగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే సమాధుల వద్ద కొవ్వొత్తులతో ప్రార్థనలు, చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు, కుటుంబ సమేతంగా ఆనందాన్ని పంచుకుంటారు. ఈస్టర్ వేడుకల్లో గ్రామ ప్రజలు, పిల్లలు,పెద్దలు,సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు అధైర్యపడొద్దని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ శాసనసభ్యులు డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షం కారణంగా సంభవించిన నష్టనివారణ తక్షణ చర్యల నిమిత్తం ఇప్పటికే రెవెన్యూ,విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అకాల వర్షం,గాలివాన బీభత్సం కారణంగా ఆయా ప్రాంతాల్లో గుడిసెలు కోల్పోయిన వారిని సైతం గుర్తించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అటు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు,నేలకొరిగిన చెట్ల తొలగింపు ఇతరత్ర నష్టాలను సైతం గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వమని రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటామని,ఎవరు కూడా అధైర్యపడకుండా ఉండాలని అభయమిచ్చారు. కాగా ఇప్పటికే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో  మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు.త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు.

ఖానాపూర్ మున్సిపల్ బీజేపీ కైవసం 

0

* మున్సిపల్ ఛైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్ 

చిత్రం న్యూస్, ఖానాపూర్ :  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్ లు ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు.. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిల్లర్లు  తమ చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు వేశారు. ఎన్నిక అనంతరం చైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయా హుస్సేన్ లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులు వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మెన్ ఎన్నిక సందర్భంగా బందోబస్తు ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా అదన కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ప్రత్యేక అధికారి (సిపిఓ) జీవరత్నం, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

108లో  మహిళ ప్రసవం: తల్లీ బిడ్డ క్షేమం 

చిత్రం న్యూస్, జైనూర్,: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జెండగూడ గ్రామానికి చెందిన మహిళ సవిత 108లో ఆదివారం ప్రసవించినట్లు 108 దత్తాత్రేయ, పైలట్ మడావి బాపురావు తెలిపారు. గర్భిణి సవితకు పురిటినొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి ఉట్నూర్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయగా మహిళా కడుపులో బిడ్డ మోషన్స్ చేస్తుందని కాన్పు కష్టమవుతుందని వైద్య అధికారుల సూచన మేరకు 108లో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో సీతగొంది సమీపంలో నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ఈఎంటీ దత్తాత్రేయ అంబులెన్సు రోడ్డు పక్కన నిలిపారని, సవిత మగ బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించామని ఈఎంటీ దత్తాత్రేయ, పైలట్ మడావి బాపూరావులు తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ ఆకుల ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ఆ శయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రభుత్వం అధికారకంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, ఫూలే వంటి మహనీయుల కృషి ఫలితంగానే నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నామని కలెక్టర్ అన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన ఓ మేధావిగానే కాకుండా మంచి వక్తగా, మానవతా దృక్పథం కలిగిన నాయకుడిగా ప్రజాదరణ పొందారని అన్నారు. బీహార్ రాష్ట్రం పాట్నాలోని పది ఎకరాల విస్తీర్ణంతో కూడిన గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రాం సభకు ఆదరణ దక్కకుండా చేసేందుకు ఆనాడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయడం బాబు జగ్జీవన్ రాం కు ఉన్న ఆదరణకు నిదర్శనం అని అన్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలను స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ ప్రతిభను మెరుగు పర్చుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల జీవిత విశేషాల గురించి తెలుసుకొని, వారి అడుగుజాడల్లో పయనించాలని సూచించారు. జిల్లాలో వివిధ కుల సంఘాల వారు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అంకిత భావంతో కృషి చేస్తుందని అన్నారు.

ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మాట్లాడుతూ.. దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ బడుగు, బలహీన వర్గాలు రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనించాలనే సంకల్పంతో అహరహం శ్రమించారని అన్నారు. జగ్జీవన్ రాం సమాజంలో సమానత్వం కోసం పరితపించిన మహనీయుడని కొనియాడారు.  జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రాజ్ గంగారాం, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సుమన్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవలే మృతి చెందిన ప్రముఖ దళిత నేత సిద్ధిరాములును ఈ కార్యక్రమం సందర్భంగా స్మరిస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఆదిలాబాద్ అభివృద్ధికి అంతా ఐక్యంగా కృషి చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా మహనీయుడు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. “మహనీయులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి జీవితాల్లోని కనీసం 10 శాతం ఆశయాలను మనం ఆచరించినా సమాజంలో గొప్ప మార్పు వస్తుంది” అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా సమాజంలో ఇంకా కొన్ని సమస్యలు పీడిస్తున్నాయని, వాటిపై బహిరంగ చర్చలు జరిపి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి:

ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా తనకు వచ్చిన అవకాశాన్ని జిల్లా సమగ్ర అభివృద్ధికి వినియోగిస్తున్నానని పాయల్ శంకర్ తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా, వర్గ విభేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు