Home Blog Page 43

ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రజా పాలన ప్రగతి వేదిక

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ (RIMS) వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి వేదిక’ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ అనూష సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా ఈ వేదికలు దోహదపడతాయని పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, కళాశాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అనంతరం వైద్య విద్యార్థులతో ముచ్చటించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ప్రముఖ వైద్యులు, వైద్య కళాశాల విద్యార్థులు, ఇతర విభాగాల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో ( వాంకిడి ) : కళ్యాణ లక్ష్మీ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం వెంకట తహసీల్దార్ కార్యాలయంలో సర్పంచ్ చుర్కకార్ సతీష్, మాజీ  జడ్పీటీసీ అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ బండే తుకారం లతో కలిసి 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి  ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ  పథకాన్ని అమలు చేస్తుందని, అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.

కస్తూర్బా బాలికల విద్యాలయంను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

చిత్రం న్యూస్, నిజామాబాద్: వర్ని మండలం కోటయ్య క్యాంపులో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థుల మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనంతరం 7వ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ కేటాయిస్తామని అన్నారు. వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ విద్యాలయానికి నూతన భవనం మంజూరైనందున వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ సాయిలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సరస్వతి తదితరులు ఉన్నారు.

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ సీల్ లను , పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు.

రాజకీయాలకతీతంగా అభివృద్ధి: ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో ( బైంసా ):  రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు మంగళవారం కుభీర్ మండలంలోని మాలేగం గ్రామంలో బైంసా నుండి మిర్జాపూర్, లింగా, కుంబి, నిగువ మహారాష్ట్ర బార్డర్ వరకు రూ.20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత పది సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న రహదారి బాగు చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా గ్రామీణ రోడ్లను మెరుగుపరుస్తానని, అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు బాసర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే మంత్రి కొండా సురేఖ సమక్షంలో భిక్షాటన చేసైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి కోసం ప్రోటోకాల్ ప్రకారం అందరిని విన్నవిస్తూ దశలవారీగా నిధులు తెచ్చుకుంటున్నామని తెలిపారు.ప్రజాస్వామ్య బద్దంగా సర్పంచులు వ్యవహరించాల్సిందిగా సూచించారు, తప్పు చేస్తే తాను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అభివృద్ధి పనులు చేయడానికి ఎప్పుడూ స్వాగతిస్తానని, కానీ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన వద్ద ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని, రాజకీయాలకు అతీతంగా అందరి పనులు చేస్తానని తెలిపారు, బాసర సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం తనపై ఉందని, తన హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరగడం అదృష్టంగా భావిస్తున్నానాన్నారు. రెండున్నర సంవత్సరాలలో పార్టీలకు అతీతంగా నాలుగువేల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,ఆయా గ్రామ సర్పంచులు పాల్గొన్నారు

HRC కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

చిత్రం న్యూస్, డెస్క్:  నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మాహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కవాడిగూడ కు చెందిన శ్రావణి అనే మహిళ తనని గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకొని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. సదరు మహిళను హెచ్చార్సీ సిబ్బంది కమిషన్ చైర్మన్ వద్దకు తీసుకెళ్లారు.ఈ ఘటనతో హెచ్ఆర్సీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతోంది.

శనగ పంట కొనుగోలు చేయాలి: ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో గత రెండు రోజులుగా బర్దాన్ (గన్నీ బ్యాగుల) కొరత కారణంగా శనగ కొనుగోళ్లు నిలిచిపోవడంపై కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సంచులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తుండటం, మరోవైపు తెచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంట కొనుగోళ్లు ప్రారంభించిన కేవలం మూడు రోజులకే బర్దాన్ లేదనే సాకుతో రెండు రోజులుగా బంద్ చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

మరికొద్ది రోజుల్లో జొన్న పంట కూడా కోత దశకు వస్తుందని, ఈలోపే శనగ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన బర్దాన్ సరఫరా చేయాలని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా శనగలను కొనుగోలు చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎమ్మెల్యేను సన్మానించిన బాసర ఆలయ పూజరులు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కృషి అమోఘమని, ఆయన సేవలు నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆలయ పూజరులు, గ్రామస్తులు అన్నారు. మంగళవారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి భూమి పూజ చేయడం ఏంతో lసంతోషాన్ని కలిగించిందన్నారు. తన మనవడికి ఇక్కడే అక్షరాభ్యాసం చేయించి,, పెద్ద మొత్తం లో ఒకే సారి నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు మార్లు అసెంబ్లీలో బాసర సమస్యపై మాట్లాడటం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ పూజరులు, బీజేపీ కార్యకర్తలు పుట్నాల సాయినాథ్, సిహెచ్ సాయినాథ్, పోగుల రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.

అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

చిత్రం న్యూస్, కాగజ్ నగర్: మండలంలోని బసంతీ నగర్ గ్రామ పంచాయితీ పరిధిలో గల విలేజ్ నంబర్ – 7లో నూతనంగా రూ.12 లక్షల అంచనాతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రాతంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసెంబ్లీలో తాను ప్రస్తావించానని, దాని ఫలితంగా అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వడం జరుగుతోందని, భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలలో కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ భాస్కర్, సర్పంచులు రియా రాయ్, బికాస్ ఘరామీ, అంగన్వాడీ సూపర్ వైజర్లు చందన, భాగ్యలక్షి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజబాబు, గంగారాం, పాఠశాల చైర్మన్ జయదేవ్ దాస్, అంగన్వాడీ టీచర్ రంజిత, భాజపా జిల్లా కార్యదర్శి సమీర్ గుప్తా, అమిత్ బిశ్వాస్, రణ్వీర్ బిశ్వాస్, మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కుంటాల మండలంలో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో వనజ 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఎంపీడీవో అల్లాడి వనజ సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, పురోగతిపై ఆమె సమీక్షించారు.గ్రామంలో కొనసాగుతున్న పనుల నాణ్యతను ఎంపీడీవో అల్లాడి వనజ క్షుణ్ణంగా పరిశీలించారు. కూలీల హాజరు నమోదు, పని ప్రదేశంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇటీవల ప్రవేశపెట్టిన ముఖచిత్ర హాజరు విధానం గురించి ఎంపీడీవో ఉపాధి కూలీలకు వివరించారు. ఈ విధానం ద్వారా బినామీలకు తావులేదని, సాంకేతిక సహాయకులు జై సింగ్ కొలతలు తీసి, పనిచేసిన దానికి అనుగుణంగా చెల్లింపులు జరిగేలా చూస్తారని తెలిపారు. ఇది పారదర్శకతను పెంచుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కొత్త విధానం వల్ల పనుల పర్యవేక్షణ మరింత మెరుగుపడుతుందని, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయని ఎంపీడీవో భరోసా ఇచ్చారు. కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొండూరు భోజన్న, సీనియర్ మేట్ ముస్కు ముత్యం, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలపై కూలీల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు.