Home Blog Page 41

ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలి 

* పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : వ్యక్తుల కోసం కాకుండా ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇందూరు అర్బన్ ప్రశిక్షణా తరగతులు మంగళవారం విజయలక్ష్మి గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కండువా వేసుకోవాలంటే అదృష్టం ఉండాలని, ఈ అదృష్టం మనందరికీ కలగడం పూర్వజన్మ సుకృతం అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు. జాతీయ వాదం హిందువుల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రధానంగా ఆత్మనిర్బర్ భారత్ ను ప్రారంభించి” వోకల్ ఫర్ లోకల్ ” అనే నినాదంతో దేశాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా.. సాంకేతికంగా.. ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధిగా మార్చేందుకు తీసుకున్న ముఖ్య కార్యక్రమం అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను పెంచుకోవడం స్థానిక పరిశ్రమలను అభివృద్ధి చేయడం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం అన్నారు. ఆత్మనిర్బార్ భారత్ ద్వారా దేశ ఆర్థికంగా బలపడుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ప్రపంచంలో భారత దేశ స్థానం మరింత మెరుగవుతుందని వివరించారు.

2014 ముందు కేవలం 16 ఐఐటీలు ఉంటే ప్రస్తుతం 23 కు పెరిగాయని అలాగే 7 ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉంటే ప్రస్తుతం 25 కు పెరిగాయని గుర్తు చేశారు. 60 ఏళ్లలో చేసిన అభివృద్ధికి రెట్టింపుగా ప్రధాని మోదీ ఈ 12 సంవత్సరాలలో చేశారన్నారు. “మేక్ ఇన్ ఇండియా” దిశగా అడుగులు వేస్తూ దేశాభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పని చేసినా ఎప్పటికప్పుడు ప్రశిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. శిక్షణలో వివరించే అనేక అంశాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పార్టీలో ప్రతి సంవత్సరం శిక్షణ తరగతులు ఉంటాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా అంశాలపై నిష్ణాతులు, రాష్ట్ర స్థాయి శిక్షణ పొందిన వారు విపులంగా తరగతులు చెప్పడం జరుగుతుందన్నారు. కావున ప్రతి కార్యకర్త ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, అర్బన్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

వెంకూరులో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : కుంటాల మండలం, వెంకూరు గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన  గ్రామపంచాయతీ  నూతన భవనాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన భవనం గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.భవన ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ సవిత బాజీరావు, ఉప సర్పంచ్ అశోక్ అధ్యక్షత వహించారు. గ్రామ సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జి.వి. రమణారావు, దిగంబర్ పాటిల్, అప్క గజ్జారాం, జక్కుల గజేందర్, వెంగళరావు, మగ్గిడి దిగంబర్, గంగాధర్, ఎస్. సాయినాథ్, పి. సాయినాథ్ వంటి స్థానిక నాయకులు, అలాగే తహసీల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ పాల్గొన్నారు.

మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఎన్నికలు: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం 

చిత్రం న్యూస్, మిర్యాలగూడ: మిర్యాలగూడ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలకు మొదటి రోజు పలువురు న్యాయవాదులు అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది గౌరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పదవికి జంగిలి ఎల్లయ్య, కోశాధికారి పదవికి రెడ్డిపల్లి సైదులు, క్రిడల కార్యదర్శి పదవికి భూక్యా రమేష్, గ్రంధాలయ కార్యదర్శి పదవికి రాయరపు భాస్కర్ నామినేషన్లు దాఖలు చేశారు. కార్యవర్గ సభ్యుల పదవులకు పెండ్యాల నర్సింహారావు, సకినాల వేలాద్రి, బంటు మహేష్ లు నామినేషన్లు సమర్పించారు.నామినేషన్ల దాఖలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. అనంతరం, 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరుగుతాయి. ఈ ప్రక్రియల అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 14న జరగనున్న ఎన్నికలలో సుమారు 167 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు

 

పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మౌనపోరాటానికి దిగిన యువతి

0

చిత్రం న్యూస్, మహబూబాబాద్: న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండె శివారు వాగ్య తండాలో చోటుచేసుకుంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం, కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన గూగులోత్ స్పందన గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా రఘురాం పెళ్లికి నిరాకరిస్తున్నాడు. ఈ విషయమై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆమె తెలిపింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రఘురాం ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది.విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్పందనను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించుకుని కూర్చుంది.

భైంసాలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించునున్న జిల్లా ఎస్పీ 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల బుధవారం భైంసా పట్టణంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు.  ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, భైంసా క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. జిల్లా ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలు, పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులు, లేదా ఇతర ఏవైనా పోలీసు సంబంధిత విషయాలను ఈ సమయంలో ఎస్పీ దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించబడిందన్నారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీకి తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

నష్ట పోయిన రైతులకు తక్షణమే పరిహారం అందజేయాలి,: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి డిమాండ్ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల లో ఇటీవల కురిసిన అధిక వడగళ్ల వాన కారణంగా రైతుల పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ముఖ్యంగా సాగులో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే అప్పుల బారిన పడిన రైతులు ఈ అనుకోని ప్రకృతి విపత్తు తో మరింత కష్టాల్లోకి నెట్టబడ్డారు. ఈ నేపథ్యంలో, నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరుతూ మంగళవారం నిజామాబాద్ లో జిల్లా కలెక్టర్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి(ఎంపిఆర్)మాట్లాడుతూ..ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదు ర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే, పంట నష్టం జరిగిన రైతులకు సరైన పరిహారం అందించకపోతే బీజేపీ పార్టీ రైతుల పక్షాన బలమైన ఉద్యమాన్ని చేపడుతుందని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు గంగాధర్, సరిన్, ఇంద్రకరణ్,జిల్లా ఉపా అధ్యక్షులు కందగట్ల రాంచందర్, సీనియర్నా నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు,పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు బీజేపీ ఎడపల్లి మండల శాఖ అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు గ్రామానికి చెందిన సంఘం సాయమ్మ, సంఘం లాస్య లు గత కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ని కలిసి దరఖాస్తు చేసుకున్నారని అయన తెలిపారు. ఈమేరకు ఎంపీ అరవింద్ సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని అన్నారు. మంగళవారం ధర్మారం గ్రామంలో బాధితులు సంఘం సాయమ్మకు రూ.49,500,సంఘం లాస్యకు రూ.15 వేలు చెక్కులను పార్టీ మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, ధర్మారం గ్రామ బీజేపీ నాయకులు కోటేష్ ల చేతుల మీదుగా పంపిణి చేశారు. సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన ఎంపీ అరవింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి లకు ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మోపాల్ మండలం బోర్గాం (పి) గ్రామంలోని సాక్రేడ్ హార్ట్ అకాడమీ పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్ రమేష్ కు సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించకూడదని, అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

థియేటర్‌లో “దూరంధర్ – 2” వీక్షించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు

చిత్రం న్యూస్, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ సినీ కేంద్రమైన ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ థియేటర్లో ‘దూరంధర్ – 2’ చిత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు పార్టీ ముఖ్య నేతలతో కలిసి వీక్షించారు. అనంతరం థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ గారితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. సినిమా విశేషాలను పంచుకున్నారు.దేశభక్తిని ఎంతో దృఢ విశ్వాసంతో ప్రదర్శించరాని, సినిమా అంతటా ఎన్నో ప్రశంసనీయమైన సన్నివేశాలు, నిజంగా ఎంతో ప్రభావవంతంగా, ఆకట్టుకునేలా ఉన్నాయిన్నారు. ప్రస్తుత పరిణామాలపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీత రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్, రాష్ట్ర కోశాధికారి వాసుదేవ రావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, BJYM రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు తాడూరి శ్రీనివాస్, రాహుల్, శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..పోలీస్ సిబ్బంది 24/7 విధులు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని అందుకోసం డాక్టర్ ల సూచనలు పాటించాలాన్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యనికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో వివిధ రకాల ఫ్రూట్స్ నుండి అన్ని రకాల జాగ్రతలు తీసుకొని వాటిని వాడాలని తెలిపారు. మన శరీరమునకు ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని, జీర్ణం కాని ఆహారము తీసుకొని బాధపడకూడదని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని, డాక్టర్ల సూచనలు, సలహాలు తప్పనిసరి పాటించాలని కోరారు. ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం ఎంతో శోభదాయకమని భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేకం నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జి.బస్వారెడ్డి , నిజామాబాద్ నగర మేయర్ కే.ఉమారాణి రమేష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్,  ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ పురంధాల, ఐఎంఏ జనరల్ సెక్రెటరీ డా. వి.అశోక్, నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈ. రవీందర్ రెడ్డి, ఐఎమ్ఏ  అధ్యక్షులు డాక్టర్ విశాల్ , మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్.నరసింహ కట్ట,( నరాలు, బ్రెయిన్ స్పెషలిస్ట్) తదితరులు పాల్గొన్నారు.