Home Blog Page 38

మన ఊరు – మన భద్రత – మన బాధ్యత : పోలీస్ కమిషనర్ వెల్లడి

గ్రామ సర్పంచులకు అవగాహన కార్యక్రమం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని కామాక్షి కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యవసాయదారులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలన్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి మాట్లాడారు. అనంతరం అరైవ్ అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాటిపల్లి గంగారెడ్డి , ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ , ఆర్మూర్ రూరల్ సీఐ జి. జాన్ రెడ్డి, ఐ-రాడ్ మేనేజర్ వర్ష , ఆర్మూర్ డివిజన్ ఎస్ఐ లు రజనీకాంత్, సంజీవ్ , అనిల్ , రాము , శ్యామ్ రాజ్ , శైలేందర్ , కిరణ్ పాల్ , రాజేశ్వర్, ఎన్ ఎస్ సి కౌన్సిల్ మెంబర్స్ సుందర్ , క్రాంతి గంగారెడ్డి , నిజంసాగర్ మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వై.సాయ రెడ్డి , సాగర్ రెడ్డి , గ్రామ సర్పంచులు ,వార్డ్ కౌన్సిలర్లు, ప్రజలు, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఆర్మూర్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

ఆర్మూర్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని భక్త ఆంజనేయ మందిరంలో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని , ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని , సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆర్మూర్ ఎస్ హెచ్ వో సత్యనారాయణ, కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ (దియా) , జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులు రాజేందర్ గౌడ్ , సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ ప్రవీణ్ చారి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

సమాజ సేవలో ముందుండాలి

*ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.  ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పీఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగా అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామన్నారు. ఎండ దెబ్బ, వేడి నుంచి అంబలి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేంద్రాన్ని గత 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని, నాలుగేళ్లుగా తమ ట్రస్ట్ సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామీణులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అంబలి పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబలి కేంద్ర ప్రతినిధి పార్శి రమేష్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీ నారాయణ, బట్టు రాఘవేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మల్కాయి మహేందర్, మఠం పవన్, మల్లేష్ యాదవ్, కల్పె అర్చన చిరంజీవి, ఎర్రం ప్రభాకర్, గజవాడ ఆగమయ్య, మంచొల్ల రామస్వామి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

సమష్టి కృషితో ‘అరైవ్ – అలైవ్’ను విజయవంతం చేయండి 

*స్థానిక ప్రజాప్రతినిధులతో సహా అందరినీ భాగస్వాములు చేయాలి

*అధికారులతో సమీక్షలో కలెక్టర్, సీపీ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమం అమలు తీరు గురించి రాష్ట్ర సచివాలయం నుండి గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , డీజీపీ శివధర్ రెడ్డిలు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీలు, సీ.పీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనూ నానాటికీ రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరుతున్న నేపధ్యంలో వీటి నియంత్రణ కోసం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు వీలుగా, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు.

ఈ సందర్భంగా వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచ్ లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. 13వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అదేవిధంగా రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఈ కమిటీలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అన్నారు. ఎక్కడైనా రోడ్ల పక్కన పాడుబడిన బావులు ఉంటే పూడ్చివేయించాలని, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.

14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. 15వ తేదీన చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డేగా జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్ళే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. స్కూల్ బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉండేలా చూడాలన్నారు. 16 తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. అలాగే, వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, క్షతగాత్రులను సత్వరమే సమీప ఆసుపత్రికి తరలించడం, రహ్ వీర్ కింద ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం గురించి 17వ తేదీన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు.

ప్రమాదాల నివారణకు కృషి చేసిన వారిని గుర్తించి సన్మానించాలని సూచించారు. 18వ తేదీన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిని గుర్తిస్తూ, వారికి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 16న మండల స్థాయిలో నిర్వహించే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సభల్లోనూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రధాన కూడళ్ళలో మానవహారాలు జరపాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

డీసీసీ కార్యాలయంలో ఘనంగా రాంజీ గోండ్ వర్ధంతి

డీసీసీ కార్యాలయంలో ఘనంగా రాంజీ గోండ్ వర్ధంతి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో : ఆదివాసీ వీరుడు  మర్సుకోల రాంజీ గోండ్ వర్ధంతి సందర్భంగ జిల్లా కాంగ్రెస్ కమిటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో రాంజీ గోండ్ చేసిన త్యాగాలు అపారమని పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, ఆయన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన రాంజీ గోండ్ చరిత్రను యువత తెలుసుకోవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి,మందగూడ సర్పంచ్ గోపాల్,రప్ అహ్మద్,కనక నాగోరావ్, హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాంజీ గోండ్ సేవలను స్మరించుకున్నారు.

మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత 

0

మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత 

చిత్రం న్యూస్, ఏలూరు: ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు రేంజ్ ఐజీ జి వి జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. తొలుత ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన అభయ షీ బాక్స్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి అనితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో గ్రూప్ ఫొటోలు దిగారు. మహిళా కానిస్టేబుల్ ను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కూడా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, టీడీపీ టౌన్ సెక్రటరీ రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు ఆర్నెపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ 

0

జంగారెడ్డిగూడెం లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ 

చిత్రం న్యూస్, జంగారెడ్డిగూడెం: మండే ఎండలు, వడగాలుల నేపథ్యంలో  మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో గురువారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ మండల కూటమి నాయకులతోపాటు అధికారులు పాల్గొన్నారు.

రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకం: సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకం: సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీ వీరుడు రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి రాంజీ గోండ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, జల్-జంగిల్-జమీన్ కోసం ప్రాణాలర్పించిన గొప్ప యోధుడు రాంజీ గోండ్ అని కొనియాడారు. ఆయన సాగించిన పోరాటం, చూపిన ధైర్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన ఇటువంటి వీరుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, బండారి దేవన్న, పలువురు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.

ప్రజల పక్షాన నిలిచే పార్టీ సీపీఐ: జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి 

ప్రజల పక్షాన నిలిచే పార్టీ సీపీఐ: జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి 

చిత్రం న్యూస్, ఆదిలారెడ్డిబాద్ టౌన్: సమాజ స్థాపనే ధ్యేయంగా, అణగారిన వర్గాల న్యాయం కోసం నిరంతరం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని హమీద్ పుర, మార్కెట్ ప్రాంతాల్లో ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికీ తిరుగుతూ పార్టీ లక్ష్యాలను వివరిస్తూనే, ప్రజల నుండి స్వచ్ఛందంగా విరాళాలను సేకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో సీపీఐ చేసిన త్యాగాలను, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మైక్ ద్వారా ప్రజలకు వివరించారు. పార్టీ చేపడుతున్న ప్రజా పోరాటాలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్న తీరును వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడమే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజలు తమకు అండగా నిలిచి, పోరాటాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, గిరిజన సంఘం నాయకులు కడప సురేష్, రైతు సంఘం నాయకులు సోమపురి జగన్నాథ్, లక్ష్మణ్, ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం:అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

* గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం:అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

* ఈ నెల 27న తహసీల్దార్ కార్యాలయాల్లో వినతుల అందజేత

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జాతీయస్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కొరకు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా దేశంలో సంపూర్ణ గోహత్య నివారణ చేయడం, గోవును దేశమాతగా ఆరాధ్యనీయ దేశదేవతగా గుర్తించాలన్నారు. అలాగే గో పరిరక్షణ చట్టం, బోర్డును తీసుకురావాలని అన్నారు. వీటిని సాధించేందుకు ఈ నెల 27న జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గో సమ్మాన్ అభియాన్ ప్రతినిధులు అనిల్ గోపాల్, కుషాల్ దాస్, భూపాల్ సింగ్, వీహెచ్ పీ గో రక్ష విభాగం తెలంగాణ ప్రాంత కృషి ప్రముఖ్ ధాత్రిక రమేష్, ఇందూరు గో సేవా సమితి అధ్యక్షుడు వీరమల్లి రమేష్, లక్ష్మీ కాంతం, యాదగిరి, రజినీకాంత్, వెంకటరమణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.