Home Blog Page 2

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన 90 రోజుల హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు. గురువారం అక్షరాభ్యాస మండపంలో హుండీ ఆదాయం లెక్కించారు. ఇందులో 1 కోటి 03 లక్షల 75 వేల 308 రూపాయల ఆదాయం సమకూరగా..మిశ్రమ బంగారం 40.గ్రా.200మిల్లీ గ్రా, మిశ్రమ వెండి 02కిలోల 550గ్రాములు, విదేశీ కరెన్సీ 24 nos నోట్లు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఈఓ గంగ ప్రసాద్, ఆలయ అధికారులు, బ్యాంకు సిబ్బంది, స్వచ్ఛంద సేవ భక్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

చిత్రం న్యూస్, బాసర: విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.బుధవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహ కళ్యాణమండపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలోఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా నిరంతరం సర్పంచుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన వసతి తో పాటు, మెరుగైన సౌకర్యాలు కల్పించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు పూనుకుందని, ముథోల్ లో రూ.225 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, సర్పంచులు కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావ్ పటేల్ తో పాటు, మండల అధికారులు పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

పదో తరగతి విద్యార్థులకు అభ్యసన మెరుగుదల తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గెజిటెడ్ నెంబర్-1)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక అభ్యసన మెరుగుదల తరగతులను (Learning Improvement Classes) జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఈ ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, డీసీఈబీ సెక్రటరీ గజేందర్, ఏఏంఓలు లక్ష్మణ్, అజయ్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

నిబద్ధతతో సేవలందించి రోగుల నమ్మకాన్ని పొందాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

నిబద్ధతతో సేవలందించి రోగుల నమ్మకాన్ని పొందాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సేవా దృక్పథంతో పనిచేస్తూ రోగుల ప్రాణాలు కాపాడే నర్సులు, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించి ప్రజల నమ్మకాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవ’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం నర్సులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిదని, రోగుల కోలుకోవడంలో వారి సేవలు అత్యంత కీలకమని కొనియాడారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు నర్సులను కలెక్టర్ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ వేడుకల్లో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్, నర్సింగ్ సూపరిండెంట్లు కల్పన, రమాదేవి, ఉమతో పాటు ఇతర వైద్య అధికారులు, పెద్ద సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

బండి సంజయ్ ను బద్నాం చేయొద్దు:ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

బండి సంజయ్ ను బద్నాం చేయొద్దు:ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసును తెరపైకి తెచ్చి బీజేపీని, బండి సంజయ్‌ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.

*మహిళల పక్షపాతి బీజేపీ: బీజేపీ ఎల్లప్పుడూ మహిళలను గౌరవించే పార్టీ అని, పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత తమదేనని పాయల్ శంకర్ గుర్తు చేశారు. ఆ బిల్లు వీగిపోవడానికి కారణమైన పార్టీలే నేడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.

*విచారణకు సిద్ధం: “తప్పు ఎవరు చేసినా తప్పే. చట్టం ముందు అందరూ సమానమే. ఈ కేసుపై ప్రభుత్వం సిట్ వేసింది. విచారణకు తాము సిద్ధమని బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. కానీ నిజానిజాలు తేలకముందే ఒక బీసీ బిడ్డను దోషిగా చిత్రీకరించడం సరికాదు” అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి సూచించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు జోగు రవి, రఘుపతి, కుంచెట్టి సంతోష్, దారట్ల జీవన్, దయాకర్, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

బేలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

బేలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

చిత్రం న్యూస్, బేల: ఈ నెల 13 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా వహీద్ ఖాన్, డిపార్ట్‌మెంటల్ అధికారిగా సంతోష్‌ను నియమించారు. ఫస్టియర్ జనరల్ 141 మంది, ఒకేషనల్ 10 మంది, సెకండియర్ జనరల్ 63 మంది, ఒకేషనల్ ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, సీటింగ్ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం

జైనథ్ మార్కెట్ యార్డులో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం

చిత్రం న్యూస్,జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు జొన్న పంట విక్రయించేందుకు వచ్చిన రైతులకు మంగళవారం పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మార్కెట్‌కు వచ్చే రైతులు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పాయల్ ఫౌండేషన్ చైర్మన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మార్గదర్శకత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయల్ శంకర్ ఫౌండేషన్ సభ్యులు, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, నాయకులు చిలుకూరి లింగారెడ్డి, అశోక్, సురేష్, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

యాపల్‌గూడ పీఎంశ్రీ పాఠశాలలో విద్యా వారోత్సవాలు: తబలా, హార్మోనియం వాయించిన కలెక్టర్ రాజర్షి షా

యాపల్‌గూడ పీఎంశ్రీ పాఠశాలలో విద్యా వారోత్సవాలు: తబలా, హార్మోనియం వాయించిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ‘విద్యా వారోత్సవాల’ సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్‌గూడలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్, బడి బాట కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా సమ్మర్ క్యాంపులో స్వయంగా తబలా, హార్మోనియం వాయించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వినోద్ రెడ్డి, సర్పంచ్ నీరోష్, ఉప సర్పంచ్ దత్తు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మామిళ్ల పార్వతి, ఎంఈఓ రమేష్ రెడ్డి, ఏఏమో లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారి రఘు రమణ, సంతోష్, లింగు, ఇతర అధికారులు, విద్యార్థులు, సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.

ఉట్నూరులో ఈ నెల 15న మెగా జాబ్ డ్రైవ్: కలెక్టర్ రాజర్షి షా పోస్టర్ ఆవిష్కరణ

ఉట్నూరులో ఈ నెల 15న మెగా జాబ్ డ్రైవ్: కలెక్టర్ రాజర్షి షా పోస్టర్ ఆవిష్కరణ 

చిత్రం న్యూస్, ఉట్నూర్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 15వ తేదీ శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మెగా జాబ్ డ్రైవ్-2026’ నిర్వహించనున్నారు. జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ ఉట్నూర్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ ఉపాధి మేళా వాల్ పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. టెక్ మహీంద్రా, హెటెరో, అపోలో ఫార్మసీ సహా 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్‌లో మేళా ప్రారంభమవుతుంది. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, రెజ్యూమ్ లతో హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  సంప్రదించాల్సిన నంబర్లు:* 9989717139, 9494559027, 9553141962.

బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ స్క్రీన్ ప్రారంభం

బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ స్క్రీన్ ప్రారంభం

చిత్రం న్యూస్, బేల: తెలంగాణ విద్యా వారోత్సవాలు, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన డిజిటల్ స్క్రీన్‌ను ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భగవాండ్లు మాట్లాడుతూ విద్యార్థులకు కీలక మార్గదర్శకత్వం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాలలో అంకితభావం, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉత్తమ అధ్యాపకులచే బోధన అందుతోందని గుర్తుచేశారు. విద్యార్థులకు అవసరమైన స్కాలర్‌షిప్‌లు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రక్షిత మంచినీటి సౌకర్యం, అత్యాధునిక ప్రయోగశాలలు వంటి అన్ని వసతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని వివరించారు.అకడమిక్ చదువులతో పాటు రాబోయే పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధునిక దృశ్య శ్రవణ పరికరాలను (డిజిటల్ స్క్రీన్లు) ఉపయోగించుకోవాలని సూచించారు. వీటి ద్వారా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును అందుకోవడమే కాకుండా, సమాజంలో ఉత్తమ పౌరులుగా పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు నరేందర్, రూపేందర్ రెడ్డి, మొహమ్మద్ వైద్ ఖాన్, వినోద్, ఎబివిపి నాయకుడు హరీష్ మడావార్, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.