Home Blog Page 2

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్

0

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్

చిత్రం న్యూస్, హైదారాబాద్: రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొని, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ని దుర్గం శేఖర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి:జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ 

0

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ 

చిత్రం న్యూస్, జైనథ్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ అన్నారు. జైనథ్ మండలం నిరాల గ్రామంలో పేదరిక నిర్మూలనపై బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులకు సోషల్‌ మీడియా, విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌, చైల్డ్‌ మ్యారేజ్‌, రైతులకు నకిలీ విత్తనాలు ,మందులపై వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, చంద్రకాంత్ చౌదరి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే, సర్పంచ్ సునంద ప్రభాకర్,పంచాయతీ కార్యదర్శి రేఖ, గ్రామస్తులు,రైతులు పాల్గొన్నారు.

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అరెస్ట్

0

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అరెస్ట్

చిత్రం న్యూస్,గజ్వేల్‌: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సోమవారం గజ్వేల్‌లోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్, ఎస్సీ డిపార్ట్‌మెంట్ నాయకులు భారీగా తరలివచ్చి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఖండించారు. ఈ నిరసనలో పాల్గొన్న టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరికొందరు నాయకులు, కార్యకర్తలను ప్రజ్ఞాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి హెచ్.ఆర్. మోహన్, రాష్ట్ర నాయకులు సమతా సుదర్శన్, శ్రీనివాస్, భద్రయ్య, కపిలేశ్వర్, హైమావతి, జీవన్ జ్యోతి, సంగారెడ్డి ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

BRS పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి – DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్

0

BRS పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి – DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ DCC వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్,ఆధ్వర్యంలో BRS పార్టీ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మమ్మాయి రమేష్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో BRS ప్రజలకు చేసిందేమి లేదని, మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి KTR, హరీష్ రావులు జిమ్మిక్కులు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి పోలీసుల చొక్కాలు పట్టుకోవడం, దళిత శాసనసభ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు.

వేయి రోజులకు పైగా ప్రతిపక్ష నేతగా ఉంటూ  అసెంబ్లీకి రాకుండా ఉండటం KCR రాచరిక పాలనకు నిదర్శనమని అన్నారు. KCR అసెంబ్లీకి రావాలని ఒత్తిడి తెస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సబబు కాదన్నారు. BRS పార్టీ చేస్తున్న ఇటువంటి చర్యలను బాసర మండల కాంగ్రెస్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరావు దేశముఖ్, శ్రీను పటేల్, జంగం రాజేందర్, ఖలీల్, బాశెట్టి శ్యామ్, నానం నర్సయ్య, జలీల్, హైమద్, మూస, శంకర్, అల్లం అనిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బాసరలో బీజేపి దళిత మోర్చా ధర్నా: BRS ఎమ్మెల్సీలపై చర్యలకు డిమాండ్

0

బాసరలో బీజేపి దళిత మోర్చా ధర్నా: BRS ఎమ్మెల్సీలపై చర్యలకు డిమాండ్

చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసర మండలంలో భారతీయ జనతా పార్టీ (బీజేపి) దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ​స్థానిక బస్టాండ్ ఆవరణలో బహుజన, దళిత నాయకులతో కలిసి బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేతపై అహంకారపూరితంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడం BRS నాయకుల దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు.

​ఈ సందర్భంగా బాసర మండల బీజేపి నాయకులు మాట్లాడుతూ..కేవలం పోలీసు అరెస్టులతో ఈ అంశాన్ని ముగించకుండా, రాజ్యాంగ స్థానాన్ని కించపరిచిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను BRS పార్టీ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులను అవమానించేలా మాట్లాడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాసర మండల బీజేపి అధ్యక్షులు పుట్నాల సాయినాథ్, సతీష్ రావు, పోగుల రాజేశ్వర్, బీద్ధుర్ రమేష్, సాకలి సాయినాథ్, దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెస్రం నాగేశ్వర్ రావుకు సన్మానం 

0

 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెస్రం నాగేశ్వర్ రావుకు సన్మానం 

చిత్రం న్యూస్, జైనథ్: విద్యాబోధనలో విశేష సేవలు అందిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పురోగతికి కృషి చేస్తున్న జైనథ్ గ్రామానికి చెందిన మెస్రం నాగేశ్వర్ రావు కు ‘ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ లభించింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీవైఎస్ఓ దయానంద్ రెడ్డి తదితరులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. వారి సేవలను కొనియాడారు.  సామజిక సమరసత జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రమేష్ రెడ్డి, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు

 

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి 

0

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి 

చిత్రం న్యూస్, భోరజ్ :  ఆదిలాబాద్ జిల్లా భోరజ్  మండలం పెందల్వాడ గ్రామంలో  పావడే సునీత-రాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, వార్డు సభ్యుడు చుక్కబొట్ల సతీష్, మాజీ ఉప సర్పంచి నాగుల సంపూర్ణ నరేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్టి అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ చొరవతో పేదవాడి  సొంతింటి కల నెరవేరిందన్నారు. మున్ముందు మరిన్ని ఇండ్లు మంజూరు చేసి నిరుపేదలందరికీ గూడు కట్టిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారు సునీత రాజు దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  వార్డు సభ్యులు బావునే రవి, జక్కుల స్వామి, చుక్కబొట్ల ఆకాష్, అందె మార్కొండి, నాయకులు  సామ ఉల్లాస్ రెడ్డి, పందిరి అశోక్, బోర్కర్ అనిల్, తకిట్ సుభాష్, పాద్రే రాజు, వైద్య సంజయ్, మెస్రం పవన్, ద్యావర్తి అశోక్, ఏడేడ్ల శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి – సీఐటీయూ ధర్నా

0

స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి – సీఐటీయూ ధర్నా

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: స్కూల్ స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. స్కావెంజర్లకు ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్, పదవీ విరమణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. స్కావెంజర్ల సమస్యలపై ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో ఓం గణేష్, మైకుల్కర్ కిషన్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.

భారత్ జోడో యాత్రకు 4 ఏళ్లు 

0

భారత్ జోడో యాత్రకు 4 ఏళ్లు 

గాంధీభవన్‌లో జరిగిన సంబరాలలో పాల్గొన్న దుర్గం శేఖర్, నరేష్  జాదవ్

చిత్రం న్యూస్, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా గాంధీభవన్‌లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, ఏఐసీసీ ఆదివాసీ విభాగం ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్, పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు అని, ఇది రాజకీయ యాత్ర కాదు దేశాన్ని ఐక్యం చేసే ఉద్యమమని అన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.

జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌  రాముకు ఘన సన్మానం 

0

జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌  రాముకు ఘన సన్మానం

చిత్రం న్యూస్, జైనథ్: విద్యాబోధనలో విశేష సేవలు అందిస్తూ, పాఠశాల పురోగతికి కృషి చేస్తున్న జైనథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ రాము కు రాష్ట్రస్థాయి ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ లభించింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాము ను శాలువాతో ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జైనథ్ గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి, ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, స్థానిక నాయకులు అల్లూరి  అశోక్ రెడ్డి, అడ్డి రూకేష్ రెడ్డి, సారథి, చిలుకూరి లింగారెడ్డి, పరశురామ్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.