విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
చిత్రం న్యూస్, బాసర: విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.బుధవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహ కళ్యాణమండపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలోఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా నిరంతరం సర్పంచుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన వసతి తో పాటు, మెరుగైన సౌకర్యాలు కల్పించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు పూనుకుందని, ముథోల్ లో రూ.225 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, సర్పంచులు కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావ్ పటేల్ తో పాటు, మండల అధికారులు పాల్గొన్నారు.

