Home Blog Page 162

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే రామారావ్ పటేల్

0

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రామారావ్ పటేల్

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా సాగు నీటిని మంగళవారం ఎమ్మెల్యే పీ.రామారావ్ పటేల్ విడుదల చేసారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో నిండక పోయినప్పటికీ ప్రస్తుతం వరి నాట్ల సమయం కావడం తో రైతుల సమస్య ను దృష్టిలో ఉంచుకోని నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. వాలేగాం, కుంసర్, కామోల్, పుస్పూర్ తో పాటు పలు గ్రామాల రైతులకు నీటి విడుదల వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్ట్ లు చెరువు లు నిండి పంటలు పండాలని అయన ఆకాంక్షించారు. కార్యక్రమం లో ప్రాజెక్ట్ ఈఈ అనిల్,మాజీ ఎంపీపీ రజాక్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్ రావ్ పటేల్ , పీఏసీఎస్  డైరెక్టర్ వడ్నపు శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, నాయకులు రావుల పోశెట్టి, పండిత్ రావ్ పటేల్, తుమొల్ల దత్తాత్రి, అనిల్ తో పాటు ముధోల్, లోకేశ్వరం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్కూటీ డిక్కీ నుంచి రూ.5 లక్షల అపహరణ

0

స్కూటీ డిక్కీ నుంచి రూ.5 లక్షల అపహరణ

*అమెరికా నుంచి తండ్రికి డబ్బులు పంపిన కూతురు

*బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తండ్రి

*స్కూటీ డిక్కీలో పెట్టుకొని ఇంటికి పయనం

*మధ్యలో భోజనం కోసం స్కూటీ నిలిపివేత

*హోటల్ వెళ్లి వచ్చే లోప డబ్బులు చోరీ

*బాధితుడు  ముథోల్ మండలం ఎడ్ బిడ్ నివాసి

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం పట్టపగలు చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. ముథోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉంటున్న తన కూతురు పంపిన డబ్బులను బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని వెళ్తుండగా ఘటన జరిగింది. ఉదయం వేళలో ఎడ్ బిడ్ నుంచి స్కూటీపై బైంసాకు వచ్చిన ఆనంద్ స్థానిక యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. అనంతరం వాటిని స్కూటీ డిక్కిలో పెట్టుకొని ఇంటికి బయలు దేరారు. ఇదే సమయంలో ఆకలి వేయడంతో పట్టణ సరిహద్దులోనున్న ఓ బార్ వద్ద తన స్కూటీని నిలిపి భోజనం కోసం లోనికి వెళ్ళాడు. ఇదే సమయంలో ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై బార్ వద్దకు చేరుకున్నారు. ఇందులో నుంచి ఒకరు స్కూటీ వద్దకు చేరుకొని డిక్కి తెరిచి అందులో నుంచి డబ్బులు ఆపహరించుకపోయాడు. భోజనం ముగించుకొని తిరిగి తన వాహనం వద్దకు రాగా స్కూటీ డిక్కీ తెరిచిఉండగా చూసి కంగారు చెందిన ఆనంద్ పూర్తిగా డిక్కీని తెరిచి చూడగా అందులో బ్యాంక్ నుంచి డ్రా చేసి పెట్టిన డబ్బులు కనిపించకుండా పోయాయి. డబ్బులు చోరికి గురయినట్లుగా గుర్తించిన బాధితుడు వెంటనే బార్ నిర్వాహకులకు సంబంధిత చోరి విషయాన్ని వివరించారు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి సంబంధిత విషయాన్ని వివరించారు. టౌన్ సీఐ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు చోరి ఘటన చేదించేందుకు గాను సీసీ పుటేజీ పరిశీలించారు.అయితే దుండగులు బాసర మార్గం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో  దృశ్యాలు రికార్డ్ అయ్యింది.

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

0

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

చిత్రం న్యూస్, బోథ్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ఐటీ లో సీటు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన మునిమల వెంకటమ్మ కూతురు శైలజ (15) పదో తరగతిలో 563 మార్కులు సాధించి ట్రిబుల్ ఐటీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నెల జరిగిన కౌన్సిలింగ్ లో సీటు లభించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయింది. ఇదే క్రమంలో పట్టణంలోని అటెండర్స్ కాలనీలో గల తన బాబాయ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యే  పాయల్ శంకర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ఆలయ అర్చకుడు

0

రక్తదానం చేస్తున్న ఆలయ అర్చకుడు గుడిపాటి రామాంజనేయులు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  జన్మదినం సందర్బంగా జైనథ్ మండలం లోని కూర గ్రామంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు గుడిపాటి రామాంజనేయులు స్వచ్చందంగా  రక్తదానం చేశారు. కూర గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అర్చకునికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి,  గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు సిడం రాకేష్ , యువ నాయకులు సాయిప్రసాద్, సూర్య రెడ్డి, సాయి కుమార్, బిట్టులు పాల్గొన్నారు. 

శ్రీ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

తిరుపతిలో కుటుంబ సభ్యులతో  ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  తన జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం  దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఆదిలాబాద్ ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని  ఆ ఏడుకొండలవాడిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చలో ఆదిలాబాద్ 

0

కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్తున్న  వీహెచ్ పీఎస్ సభ్యులు

చిత్రం న్యూస్, బోథ్:  వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం చలో ఆదిలాబాద్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద  నిర్వహించే దీక్షకు బోథ్ నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు  తరలివెళ్లారు. అనంతరం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ మాట్లాడుతూ.. వికలాంగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. రూ.4 వేల పెన్షన్  రూ.6 వేలు చేయాలని, వికలాంగులకు పూర్తిస్థాయిలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలన్నారు. వికలాంగులకు వ్యాపార నిమిత్తం సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని, వికలాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే వికలాంగులకు తగిన న్యాయం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ తో పాటు వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు మోతే రాజేశ్వర్, కార్యదర్శి భోగ శంకర్ ఉపాధ్యక్షులు రమేష్ , సంఘ సభ్యులు ఆసిఫ్, మాల్వే రామచందర్, అనిల్ అన్నారు.

ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు

0

ఘనంగా ఎమ్మెల్యే  పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు

రక్తదానం చేసిన బీజేపీ కార్యకర్తలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పేదల పెన్నిధి, అలుపెరగని నాయకుడు, రైతు బాంధవుడు,  రాజకీయ దురంధరుడు, స్థిత ప్రజ్ఞుడు, నిత్య కృషీవలుడు,  ప్రజా సేవకుడు, అన్న అని పిలిస్తే  వెన్నంటే ఉంటూ ప్రజల శ్రేయస్సుకు పరితపించే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా టైగర్, జైనథ్ మండలంలోని అడ గ్రామ నివాసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు నడుమ ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ కేకు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  బీజేపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి రక్తదానం చేశారు. జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో  ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా జైనథ్ మండల శ్రేణులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు చిలుకూరి లింగారెడ్డి ఆధ్వర్యంలో  గ్రామంలో పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామ రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నారకట్ల ప్రతాప్ యాదవ్, గౌకర్ విశాల్,  యువ మోర్చా మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నారకట్ల ప్రతాప్ యాదవ్, గౌకర్ విశాల్, యువ నాయకుడు ఏనుగు సూర్య రెడ్డి, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

నీరు వృధా..రైతులకు వ్యథ

0

కరత్వాడ ప్రాజెక్ట్ నుంచి వృధాగా పోతున్న నీరు

చిత్రం న్యూస్, బోథ్: ఒకవైపు వర్షాలు తక్కువ ఉండడంతో వర్షాకాలం రెండు నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు ప్రాజెక్టులు నిండలేదు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ కరత్వాడ ప్రాజెక్ట్ కుడి వైపు కెనాల్ గేట్ మొరాయించడంతో గత 10 రోజులుగా నీరు వృధాగా  పోతుంది. అసలే వర్షాలు లేక చిన్న చిన్న  ఒర్రెలలో, వాగులలో చుక్క నీరు కూడా లేదు. రాబోయే రబీ పంటలకి కరత్వాడ ప్రాజెక్ట్ నీరే రైతుల పంటలకు ఆధారం.  సంరంక్షించాల్సిన నీటిని ఇలా వృధా చేస్తే కరత్వాడ ప్రాజెక్ట్ లో నీరు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కరువు పరిస్థితులు రాకముందే అధికారులు వృధా నీటిని అరికట్టాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు

0

సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పలదారి గ్రామంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోడుసం బాబురావు ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి పెద్ద మంటలు వ్యాపించాయి . ఇంట్లో ఉన్న సభ్యులు గాయపడ్డారు. తొలుత వారిని బోథ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అదిలాబాద్ రిమ్స్  ఆసుపత్రికి తరలించారు.

ఔట్ సోర్సింగ్ సిబ్బంది మెమోరండం అందజేత 

0

బోథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనురాధకు మెమోరండం అందజేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న నలుగురు సిబ్బంది సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధకు మెమోరండం సమర్పించారు. గత (5) నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పైఅధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో విధులను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు. మెమోరండం సమర్పించిన వారిలో కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ శృతి, ఆఫీస్ సబార్డినేటర్ సవిత, నైట్ వాచ్మెన్ రమేష్ ఉన్నారు.