Home Blog Page 162

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టాం

0

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టాం

*పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు

*ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం

*పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాం

*మొట్టమొదటి సారిగా 4 వేల మందికి స్కూల్ అస్సిటెంట్లుగా పదోన్నతి

*విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష

చిత్రం న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టామని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో 4 గంటలకు పైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డిఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. డిఎస్సీ పరీక్షకు తొలిరోజు ఉదయం 88శాతం, సాయంత్రం సెషన్ లో 86శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్, లీప్ యాప్ కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. అంతిమంగా రాబోయే నాలుగేళ్లలో  ఏ పీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే తమ లక్ష్యమని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కూడా విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు. 27 వేలమందికిపైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టాం. ఇదివరకెన్నడూ లేనివిధంగా 4వేలమందికి పైగా టీచర్లకు స్కూల్ అస్సిటెంట్లు గా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఎటువంటి రాజకీయజోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమం

రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో 15 – 59 సంవత్సరాల వయస్సు గలవారిలో ఇప్పటికీ 81 లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై మంత్రి విస్మయం వ్యక్తంచేశారు. భారదేశంలోనే వయోజన విద్యలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉన్న నేపథ్యంలో ఇకపై మిషన్ మోడ్ లో వయోజన విద్యా కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ఉల్లాస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3.95 లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా, 3.53 లక్షలమంది (90.12%) మంది పాసయ్యారని తెలిపారు. వయోజన విద్యా విభాగంలో 247 పోస్టులకుగాను 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా మంత్రి దృష్టికి తేగా, నూరుశాతం లక్ష్యాన్ని సాధించగలిగే అంకితభావం కలిగిన వారిని మాత్రమే పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో అక్షరాస్యతలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.  సప్లయ్ – డిమాండ్ కు అనుగుణంగా స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ ను ఏర్పాటుచేయాలని, నైపుణ్యం యాప్ ను అప్ గ్రేడ్ చేయాలని స్కిల్ డెవలప్ మెంట్ అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. నైపుణ్యం పోర్టల్ లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్ధ్య పరీక్ష, సర్టిఫికేషన్, ఉద్యోగ కల్పన, పరిశ్రమల అనుసంధానం, పరిశ్రమల్లో ఖాళీల వివరాలు మొదలైన వాటిని పొందుపర్చాలని అన్నారు. సెక్టార్ వైజ్ ప్లేస్ మెంట్స్, జాబ్ మేళాల వివరాలను కూడా ఇందులో పొందుపర్చాలన్నారు. నైపుణ్యం యాప్ ద్వారా ఈ ఏడాది 6,83,052మంది దరఖాస్తు చేసుకోగా, 6,45,163మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, వారిలో 77,703మందికి ఉద్యోగాలు లభించాయని ఎపిఎస్ఎస్డిసి సిఇఓ గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆటిజం తో బాధపడుతున్న వారి తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఈ సెంటర్లలో నిపుణులను ఎంపిక చెయ్యాలని ఆదేశించారు. ఆటిజం పై ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల కమిటీ సలహాలు తీసుకోవాలని సూచించారు. స్కూల్ కిట్స్ అన్ని త్వరితగతిన విద్యార్థులకు అందేలా చూడాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాస్ ను ఆదేశించారు

ఉన్నత విద్య పై సమీక్ష

ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తూ… యూనివర్సిటీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేటప్పటికే సరైన నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగం సాధించే దశకు చేరుకోవాలని అన్నారు. ఇందుకు అవసరమైన నైపుణ్యశిక్షణ కార్యక్రమాలను కాలేజ్ స్థాయిలోనే పెద్దఎత్తున చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ యూనివర్సిటీల విసి పదవులకు సెర్చి కమిటీల ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తిని కోరారు. చైర్మన్ స్పందిస్తూ… ఈనెలాఖరులోగా ఆయా వర్సిటీలకు సెర్చికమిటీ సిఫారసులను పంపిస్తామని తెలియజేసారు. వివిధ యూనివర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇందులో గవర్నింగ్ బోర్డ్ , ఎగ్జిక్యూటివ్ కమిటీ, అకడమిక్ కౌన్సిల్ మొదలగు విభాగాలు ఉంటాయని మధుమూర్తి మంత్రికి వివరించారు. ఎప్ సెట్, లా సెట్, పిజి సెట్ వంటి ప్రవేక్ష పరీక్షలను నిర్ణీత క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్నామని, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కాలేజీలు ప్రారంభం అవుతాయని తెలియజేసారు. విద్యార్థుల నమోదు కై అపార్ ఐడి 98శాతం పూర్తిచేశామని, త్వరలో నూరుశాతం పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఐఎస్ బి, ట్రిపుల్ ఐటి, ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చి (నైపర్) ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఫారిన్ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులపై మంత్రి సమీక్షించారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కు అడ్డంకిగా ఉన్న జాయింట్ సిర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ (జేసిడి) నిబంధనలను సడలించే అంశం పై చర్చించారు. నాణ్యత పై ఎటువంటి రాజీ లేకుండా ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చే ఎన్ఓసి లు మరింత సులభతరంగా అందజేయాలని ఆదేశించారు. అలాగే త్రిపుల్ ఐటి కనిగిరి ఏర్పాటు పై సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, కళాశాల విద్య డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిఇఓ గణేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు

0

ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు

*కుటుంబసభ్యులు, అభిమానుల నడుమ ప్రత్యేక పూజలు

*బాధ్యతల స్వీకరణ

చిత్రం న్యూస్, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు గారిని నియమించడంతో శుక్రవారం ఉదయం 7.55 నిమిషాలకు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అభిమానులు తోడురాగా అప్కాబ్ సిబ్బంది సమక్షంలో పదవీ భాద్యతలు స్వీకరించారు. వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు అభిమానులూ, అధికారుల నడుమ గన్ని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సంధర్భంగా అప్కాబ్ సిబ్బంది ఎం.డి.ఎస్ఆర్.రెడ్డి, సిజిఎం, డిజిఎం,ఎజిఎం లతో పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అభివృద్ధికి తోడ్పడదాం.. మనందరం కలిసికట్టుగా పనిచేసి అప్కాబ్ అభివృద్దికి తోడ్పడదామని అన్నారు. ముందుగా అప్కాబ్ ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  పదవీ భాద్యతల అనంతరం సెంట్రల్ మానిటరింగ్ యూనిట్(సి సి కెమేరా యూనిట్)ను ప్రారంభించారు. అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరం సంధర్భంగా ఆవరణలో మొక్క నాటారు.


 

రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి 

రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి 

*పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి  చేస్తున్నానని ఎమ్మెల్యే పాయల్  శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో శ్రీ రమ మందిరంలో రూ. 50 లక్షల నిధుల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మాకోడ గ్రామంలో రూ.20 లక్షలతో  నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను  ఆయన ప్రారంభించారు . అనంతరం ఆకుర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా గ్రామంలో 30 ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. ఒక మంచి ఆలోచనతో నీతితో ,విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ముందుకు వెళుతున్నానని అన్నారు.

నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశం వల్లనే అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. అధికారమనేది సొంతం కాదని.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. దీపాయిగూడలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏ రోజు కూడా గ్రామానికి వచ్చిన దీపాయిగూడ గ్రామస్తులు తనకు మనస్ఫూర్తితో ఆశీర్వాదం అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రనాథ్, బీజేపీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి , మాజీ ఉప సర్పంచి తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, ఎల్టి అశోక్ రెడ్డి, విశాల్, విజయ్, గంగాధర్  భూమన్న వేద వ్యాస్, భూమన్న, సింగడి రమేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దత్త తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ 

0

ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ 

*ప్రజల నుంచి వినతుల స్వీకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

చిత్రం న్యూస్, వినుకొండ:  గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఆయనతో విన్నవించుకున్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా

సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా

*పాల్గొన్న మాజీ హోం మంత్రి , పెద్దాపురం ఎంఎల్ఏ నిమ్మకాయల చిన రాజప్ప

చిత్రం న్యూస్,సామర్లకోట:

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా-2025 కార్యక్రమం నిర్వహించారు. మాజీ హోం మంత్రి, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు, DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ,పిఠాపురం డెవలప్మెంట్ అధికారిణి చైత్ర వర్షిణి , సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య , ఎంపిడిఓ హిమమహేశ్వరి, సామర్లకోట టౌన్ ప్రెసిడెంట్ దొమ్మేటి సరోజ్ వసు, అడబల కుమార్ స్వామి, మడగల శ్యామ్ కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు

సామర్లకోట నుండి కాకినాడ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు

0

సామర్లకోట నుండి కాకినాడ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు

చిత్రం న్యూస్,కాకినాడ: సామర్లకోట నుండి అచ్చంపేట వెళ్లే భారత్ మాల రోడ్డుకు బ్రిడ్జిలు నిర్మాణంలో భాగంగా గడ్డర్లు లేపుతున్నందున ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఓవర్ బ్రిడ్జి గడ్డర్ లాంచ్ కోసం సామర్లకోట నుండి కాకినాడ కలెక్టరేట్ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు ఈనెల 7 నుండి 10 వరకు (పూర్తి 4 రోజులు) నిలుపుదల చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. అదేవిధంగా అచ్చంపేట జంక్షన్ లో రోడ్డు పై గడ్డర్లు లేపుతున్నందున జూన్ 11 నుండి 13 తేదీ వరకు మూడు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించి పోలీసు వారు సూచించిన మార్గాలలో తమ వాహనాలను మళ్లించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి సూచించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కూటమి నాయకులు.

0

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కూటమి నాయకులు.

చిత్రం న్యూస్,అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి పొంగూరు నారాయణ ఇతర మంత్రులు, పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప , ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

0

Njసీఎం సహాయ నిధి చెక్కు అందజేత

చిత్రం న్యూస్, పెద్దాపురం : పారాలసిస్ వ్యాధికి చికిత్స పొందుతున్న నవర గ్రామ నివాసి కొండపల్లి వీరాజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.25,500 విలువైన చెక్కును పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాగ్ అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప రంగనాగ్ కు తోట నాగ భూషణం (నాగబాబు) కృతజ్ఞతలు తెలిపారు.

పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్ర గాయాలు

0

పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్రగాయాలు

*సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

చిత్రం న్యూస్, సామర్లకోట: పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్ర గాయాలు
పిచ్చికుక్క దాడి చేసిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సామర్లకోట వీర రాఘవపురం డైలీ మార్కెట్ వద్ద గురువారం రాత్రి పిచ్చికుక్క దాడి చేసింది. దాడి చేసిన వారిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సామర్లకోట లో ప్రతి రోజు కుక్కలు ఎవరో ఒకరి ఇద్దరి మీద దాడి చేస్తూనే ఉన్నాయి .అధికారులు స్పందించి కుక్కల నుండి కాపాడాలి అని స్థానికులు కోరుతున్నారు.

ఘనంగా శ్రీ మాడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

ఘనంగా శ్రీ మాడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

చిత్రం న్యూస్, శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో రజకుల కులదైవం శ్రీ మాడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పూజారులు శ్రీమాన్ కలకుంట్ల మధుసూదనాచార్యులు, యజ్ఞచార్యులు శ్రీ కలకుంట్ల మురళికృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని రజక సంఘం నాయకులు,వివిధ కుల సంఘాల పెద్దలు,మండల రజక సంఘం నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.