Home Blog Page 15

డీసీసీబీ సీఈఓ ఎంపికకు ఇంటర్వ్యూలు: అభ్యర్థుల నైపుణ్యాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

డీసీసీబీ సీఈఓ ఎంపికకు ఇంటర్వ్యూలు: అభ్యర్థుల నైపుణ్యాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, అదిలాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈ నియామకంలో భాగంగా శుక్రవారం డీసీసీబీ కార్యాలయంలో అర్హులైన అభ్యర్థులకు ముఖాముఖి పరీక్షలు (ఇంటర్వ్యూలు) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలోని ఎంపిక కమిటీ అభ్యర్థుల అర్హతలను, పనితీరును క్షుణ్ణంగా పరిశీలించింది.

ఈ కీలక ఎంపిక ప్రక్రియలో రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వై.కె. రావు, నాబార్డ్ (NABARD) ప్రతినిధులు ముఖ్య భూమిక పోషించారు. నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే, చీఫ్ జనరల్ మేనేజర్ పి. మోహనయ్య తదితరులు పాల్గొని అభ్యర్థుల బ్యాంకింగ్ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. పారదర్శకంగా జరుగుతున్న ఈ ప్రక్రియ ద్వారా త్వరలోనే సమర్థుడైన అధికారిని సీఈఓగా నియమించనున్నారు.

ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, అదిలాబాద్: పట్టణంలోని టీటీడీసీ (TTDC) కేంద్రంలో శుక్రవారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండో దశ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ పొందుతున్న వారికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జనగణన ప్రక్రియలో ఎన్యుమరేటర్లు,  సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం, జనగణన విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి అవసరమైన కిట్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, శిక్షణార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి సదస్సు.. యువతకు ఉజ్వల భవిష్యత్తుపై దిశానిర్దేశం

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి సదస్సు.. యువతకు ఉజ్వల భవిష్యత్తుపై దిశానిర్దేశం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్  రిమ్స్ (RIMS) ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ఆధునిక నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో రిమ్స్ డైరెక్టర్ డా.జై సింగ్ రాథోడ్, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గణేష్ జాదవ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.మనోహర్ రావు, మైనార్టీ సంక్షేమ అధికారి కలీం, యువజన క్రీడల అధికారి జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

యువతకు నైపుణ్యాల ఆవశ్యకతపై అధికారుల పిలుపు:

సదస్సులో పాల్గొన్న జిల్లా అధికారులు మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ పోకడలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంటర్మీడియెట్, కళాశాల విద్యార్థులు, యువత తమ నైపుణ్యాలను (Skills) పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి (Modern Skill Development) ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని, కేవలం డిగ్రీలే కాకుండా నైపుణ్యం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.

99 రోజుల కార్యక్రమంలో ప్రత్యేక చొరవ:

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగే ఈ 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు, విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జైనథ్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం: భక్తులతో పోటెత్తిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం

జైనథ్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం: భక్తులతో పోటెత్తిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం

చిత్రం న్యూస్, జైనథ్:  ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో శుక్రవారం ‘హిందూ సమ్మేళనం’ అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిర ప్రాంగణంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి హిందూ బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సమ్మేళనానికి గౌరవ అతిథిగా గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి విచ్చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రాంత ప్రముఖ్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణ, సామాజిక సమరసత, ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, దేశాభివృద్ధిలో హిందూ సమాజం పోషించాల్సిన పాత్రను వారు నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, వందేమాతరం గీతం పఠనం చేశారు. ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమ్మేళనానికి విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, నారాయణ స్వామి ఆలయ చైర్మన్ రుకేష్ రెడ్డి, పలు పార్టీల నాయకులు జగదీష్ రెడ్డి, పిడుగు సంతోష్ యాదవ్, సర్సన్ లింగారెడ్డి, కట్కం రాందాస్, వెంకట్ రెడ్డి, చిలుకూరి లింగారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాంరెడ్డి, రాకేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పిడుగు స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.  హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కులాలు, ప్రాంతాలు మరియు పార్టీలకు అతీతంగా “మనమంతా హిందువులం” అనే ఏకైక భావనతో ఈ సమ్మేళనం నిర్వహించబడింది. మన దేశాన్ని, ధర్మాన్ని మరియు ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు కుమ్మరిపెళ్లి సాయితేజ (సన్నీ సాయి తేజ) నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామ్ చందర్ రావు ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.

పార్టీ బలోపేతానికి సాయితేజ అందిస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం, రాష్ట్ర స్థాయిలో ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించింది. తన నియామకం పట్ల సాయి తేజ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానందం లకు సాయితేజ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కిసాన్ మోర్చా ద్వారా రైతు సమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సాయితేజ నియామకం పట్ల జిల్లా బీజేపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధి కూలీలకు సర్పంచ్ అనిల్ బాసట: తాగునీరు, ఓఆర్ఎస్ పంపిణీ

ఉపాధి కూలీలకు సర్పంచ్ అనిల్ బాసట: తాగునీరు, ఓఆర్ఎస్ పంపిణీఉపాధి కూలీలకు సర్పంచ్ అనిల్ బాసట: తాగునీరు, ఓఆర్ఎస్ పంపిణీ

చిత్రం న్యూస్, బేల: పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా అవాల్పూర్ సర్పంచ్ అనిల్ ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. శుక్రవారం పనుల ప్రదేశానికి స్వయంగా వెళ్లిన సర్పంచ్ అనిల్ అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కూలీలు అలసటకు గురికాకుండా ఉండటానికి వారికి స్వచ్ఛమైన తాగునీటిని, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల వద్ద నీడ సౌకర్యం కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ చేసిన ఈ పనిపై ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భాది గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం: లబ్ధిదారులకు ‘సారె’ పెట్టిన సర్పంచ్ దంపతులు

భాది గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం: లబ్ధిదారులకు ‘సారె’ పెట్టిన సర్పంచ్ దంపతులు

చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని భాది గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం అత్యంత వేడుకగా జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు కొండల సునీత-సంతోష్ దంపతులు తమ నూతన గృహంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంతెల వినోద్ దంపతులు పంచాయతీ పాలక వర్గం తరపున లబ్ధిదారులకు మర్యాదపూర్వకంగా ‘సారె’ (బట్టలు) అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్, ఉప సర్పంచ్ జె. శంకర్, వార్డు సభ్యులు షేక్ వాహబ్, జోడే గణేష్, సుంకరి శ్రీనివాస్, పటేల్ మానిక్ రావు పాల్గొన్నారు. తుడుందెబ్బ అధ్యక్షులు సిడం నందు, అర్జున్గ

మస్తులు హాజరై సందడి చేశారు. తమకు సొంతింటి కలను నిజం చేసినందుకు లబ్ధిదారులు ప్రభుత్వానికి మరియు సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

భైంసాలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

0

భైంసాలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల 

*బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం 

చిత్రం న్యూస్, బాసర :  నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల శుక్రవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. ఫిర్యాదుదారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కుటుంబ వివాదాల పరిష్కారంలో ‘షీ టీం’ పాత్ర:

ఈ కార్యక్రమంలో వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకున్నారు. ప్రజలు నిర్మల్ వరకు రావడం కష్టంగా ఉండగా, భైంసాలోనే కౌన్సిలింగ్ కల్పించడం పై ఎస్పీ గారు చూపిన ఆలోచనను బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష:

గతంలో గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్ లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

0

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి 

మిగతా కూలీలకు గాయాలు, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు 

చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి సమీపంలో జరిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఓ వ్య‌క్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ముథోల్ నుంచి బాసరకు కూలీలను ఎక్కించుకొని ఆటోలో వెళ్తున్నారు. బాసర – బైంసా రహదారిపై టాక్లి సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీ మలపడంతో ఆటోను ఢీకొంది. ముథోల్ కు చెందిన రుమోళ్ల పోతన్న (28) అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా కూలీలు గాయపడ్డారు. చికిత్స కోసం బైంసా ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బాసర సీఐ కిరణ్ కుమార్, ఏఎస్ఐ గంగాధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

పొన్నారిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

పొన్నారిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

చిత్రం న్యూస్, తాంసి: తాంసి మండలం పొన్నారి గ్రామంలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పూడికతీత పనులను స్వయంగా పరిశీలించిన ఆయన కూలీల మస్టర్ రోల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఉపాధి హామీ కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి పని ప్రదేశంలోనూ తప్పనిసరిగా నీడ సౌకర్యం, స్వచ్ఛమైన మంచినీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) రవీందర్, మండల అభివృద్ధి అధికారి (MPDO) మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ, సర్పంచ్ భీమన్న, ఏపీఓ విజయ, టెక్నికల్ అసిస్టెంట్ పుష్ప, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.