Home Blog Page 147

శాంతి భద్రతలే  ప్రథమ కర్తవ్యం

మీ కోసం పోలీస్ అవగాహన కార్యక్రమంలో బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. వెంకటేశ్వరరావు,
ఎస్ఐ  ప్రవీణ్

చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని దన్నూరు (బి) గ్రామంలో మంగళవారం మీకోసం పోలీస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో బోథ్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ లు మాట్లాడుతూ.. శాంతి భద్రతలే మా ప్రథమ కర్తవ్యమని, మీకోసం పోలీస్ కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ చేయడానికేనని పేర్కొన్నారు. అలాగే పలు అంశాలపై గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా భూ తగాదాల విషయమై సమస్యలను, మత్తు మాదకద్రవ్యాలు వల్ల నష్టాలు, మద్యం సేవించడం వల్ల జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వీటి పైన గ్రామస్తులకు వివరిస్తూ తగు జాగ్రత్తలను సూచించారు. ముఖ్యంగా మానసికంగా ప్రతి సమస్య ఎదుర్కోవాలని, ఆత్మహత్యలే పరిష్కారం ఒకటే జీవితానికి కాదని, ఆలోచనతో ముందుకు సాగాలని తెలిపారు. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగిన తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కష్టపడి పని చేసుకొని బ్రతకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంత వారినైనా శిక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు పోలీస్ సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.

విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు 

విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు 

చిత్రం న్యూస్, బేల: విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు తీసుకుంటామని ఏడీ శ్రీధర్ అన్నారు. బేల మండలంలో హాకా సెంటర్ నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు పట్టుకోవడంతో వ్యవసాయ అధికారులు అప్రమత్తం అయి సదరు వ్యక్తి పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏడి శ్రీధర్ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న యూరియా ను రైతులు పట్టుకోవడంతో వెంటనే వ్యవసాయ అధికారులను పంపించడం జరిగిందని అన్నారు. విచారణ చేపట్టి హాకా సెంటర్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు.  హాకా సెంటర్లో 440 యూరియా బస్తాలు ఉన్నాయని, మిగితా 200 యూరియా బస్తాలు అక్రమంగా మహారాష్ట్ర కు తరలించారని అన్నారు. ఇందులో రెండు బండ్లు వంద చొప్పున యూరియా బస్తాలు తీసుకెళ్తున్నారని సిర్సన్న రైతులు ఒక బండిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారన్నారు. రెండవ బండి దహెగావ్ గ్రామంలోని బీజేపీ మాజీ మండల అధ్యక్షులు నిక్కం దత్త ఇంటి సమీపంలో లోడ్ చేశారు. దీని పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

బోథ్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

బోథ్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించిన ఆయన సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం లో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి సదరు గుత్తేదారుతో మాట్లాడి తొందరగా పనులు పూర్తి చేయాలని అదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్ ను ఆదేశించారు. అనంతరం ల్యాబ్ ను సందర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ల్యాబ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమయ పాలన పాటించాలని మూడు షిఫ్ట్ లుగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ విధానం అమర్చాలని సూచించారు. అంతే కాకుండా ఇంకా నూతన ల్యాబ్,బ్లడ్ బ్యాంకు సౌకర్యం కోసం, ఇతర సౌకర్యాలు కల్పన కోసం రూ.7కోట్లు నిధులు కేటాయించామని వాటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. ముఖ్యంగా గిరిజనులు ఉండే ప్రాంతం కావున వైద్యులు అప్రమత్తం గా ఉండాలని,మరియు వార్డులో బయట సీసీ కెమెరాలు అమర్చాలని స్థానిక ఎస్ఐకి సూచించారు. ఈ కార్యక్రమం లో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్,కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి తదితరులు పాల్గొన్నారు.

గుడుంబా అమ్మిన వారిపై కఠిన చర్యలు

దేశీదారు అమ్మిన వారిపై కఠిన చర్యలు

చిత్రం న్యూస్, సొనాల:  దేశీదారు అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జుల్ఫీకర్ అహ్మద్ అన్నారు. మండలంలోని గుట్టపక్క తండ గ్రామానికి చెందిన మట్ట చందర్ సింగ్ మహారాష్ట్రకు చెందిన దేశీధారు కేసులో పలుమార్లు పట్టుబడితే తహసీల్దార్ దగ్గర బైండోవర్ చేయించడం జరిగిందన్నారు. ళ్ళీ దేశీదారు అమ్ముతూ పట్టుపడ్డాడన్నాడు. బైండోవర్ ఉల్లంఘించినందుకు రూ.50 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. మంగళవారం మట్ట చందర్ సింగ్ రూ.50 వేలు చాలన్ కట్టించినట్టు ఆయన తెలిపారు. ఎవరైనా దేశీదారు, గుడుంబా కఅమ్మినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంతామన్నారు. పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జూల్ఫీకర్ అహ్మద్ హెచ్చరించారు.

 

 

మాజీ ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి  సందర్భంగా పండ్లు పంపిణీ

మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి  సందర్భంగా పండ్లు పంపిణీ

చిత్రం న్యూస్, బోథ్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ వీరాభిమాని అల్లం మనోహర్ సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవీన్ రెడ్డి, స్టాఫ్ ఆధ్వర్యంలో  రోగులకు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి  పేదవాడికి అనేక పథకాలు లబ్ది చేకూరాయని ,  గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు.  అలాంటి వ్యక్తిని మర్చిపోకూడదని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ రెడ్డి,అల్లం మనోహర్, లక్ష్మణ్ యశోద,లింగారెడ్డి, రేణుక, అనసూయ, జమున  తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి ఉదారత

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి ఉదారత

*పాఠశాలకు 60 ప్లేట్లు పంపిణీ

చిత్రం న్యూస్, బేల: బేల మండలం పొన్నాల ప్రాథమికోన్నత  పాఠశాల విద్యార్టులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి 60 ప్లేట్లు పంపిణీ చేసి ఉదారత చాటారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జన్మదినం సందర్భంగా ఇటీవల పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు మంగళవారం పొన్నాల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బేల మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి 60 ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహించండి -జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహించండి -జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, బోథ్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఉద్యమంలా చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయితీ, డీఆర్డీఏ, ఐకేపీ అధికారులతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలకు కళాశాలకు కావలసిన మొక్కలన్నింటిని సరఫరా చేయవలసిందిగా సంబంధ అధికారులకు ఆదేశించి, కళాశాల ఆవరణలో పెంచుతున్న కిచెన్ గార్డెన్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, కిచెన్ గార్డెన్ పెంపకం వల్ల విద్యార్థులకు వ్యవసాయ సామర్థ్యాలు మెరుగుపడతాయని భవిష్యత్తులో ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్, కళాశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మండల తహసీల్దార్ సుభాష్ చందర్, మండల అభివృద్ధి అధికారి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారి రవితేజ, ఎఫ్ఆర్వో ప్రణయ్, ఐకేపీ ఏపీఎం మాధవ్, డీఆర్డీఏ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది 

0

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది 

*ఒక రోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పీతల సుజాత , ఎమ్మేల్యే  పులపర్తి రామాంజనేయులు 

చిత్రం న్యూస్, భీమవరం: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామంలో  ఎన్ఆర్ఈజీఎస్ పధకంలో భాగంగా ఒక రోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని (వన మహోత్సవం) మాజీ మంత్రి పీతల సుజాత , స్థానిక ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతల సుజాత  మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని, అందుకు తమవంతుగా అందరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ పథకంలో భాగంగా రైతులందరికీ ఉచితంగా మొక్కలు అందించి వారిని ఆర్ధికంగా  పైకి తీసుకురావడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ..  ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని, ఎక్కడైతే మొక్కలను నాటామో వాటిని వదిలి వేయకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కూటమి సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ మెంటే పార్థసారథి, జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, కూటమిపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0

రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

చిత్రం న్యూస్, పాలకోడేరు: భీమవరం జిల్లా పాలకోడేరు మండలంలో రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.  డాక్టర్ కోసూరి ఆనంద రాజు ఆధ్వర్యంలో సాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వారం రోజులకు సరిపడా ఉచిత మందులను అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది కళ్యాణ్ పాల్గొన్నారు.

కుల సంఘాల భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించిన కాంగ్రెస్

కుల సంఘాల భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 

కుల సంఘాల భవన నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పది కుల సంఘ భవనాలకు రూ.50 లక్షల నిధులు కేటాయించారు. ప్రజాసేవ భవన్ లో ప్రొసీడింగ్ పత్రాలను సోమవారం వివిధ కుల సంఘాలకు అందజేశారు ‌.కంది శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ..గత ప్రభుత్వం కుల సంఘాలను ,చేతి వృత్తులను విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే చేతి వృత్తులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు.