Home Blog Page 146

రాష్ట్ర లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి పరామర్శ

0

బాధిత కుటుంబీకులను  పరామర్శిస్తున్న బలిరాం జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పోతగంటి సురేందర్, రాకేష్ ల సోదరుడు లస్మన్న ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బలిరాం జాదవ్ మృతిని నివాసానికి వచ్చి వృత్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట నేరడిగొండ మండలం బీజేపీ కన్వీనర్ ఆకుల రాజశేఖర్, ప్రశాంత్,  భోజన్న, సీతన్న, పార్ల సాయన్న తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే. రామారావు పటేల్ ను సన్మానించిన గ్రామాభివృద్ధి కమిటీ

0

ఎమ్మెల్యే రామారావు పటేల్ ను సన్మానించిన గ్రామాభివృద్ధి కమిటీ

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం గ్రామ అభివృద్ధి కమిటీ నూతనంగా ఎన్నికైన వాలేగాం గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముథోల్  ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ని కలిసి శాలువా కప్పి పూలబొకేతో సభ్యులు సన్మానం చేశారు. అనంతరం గ్రామలోని హనుమాన్ మందిర్, పాఠశాల ప్రహరీ గోడ తదితర సమస్యలను చెప్పారు. దానికి ఎమ్మెల్యే సమస్యల పైన సానుకూలంగా స్పదించినారని  వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పుండలిక్ పటేల్,క్యాషియర్ మహేష్ పటేల్,బాలు పటేల్, బీజేవైఎం భైంసా మండల ఉపాధ్యక్షులు,ఎస్ గంగాప్రసాద్, కమిటీ సభ్యులు సతీష్, శీను, పోతన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

దేవిదాస్ ను సన్మానించిన మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు

0

దేవిదాస్ ను సన్మానిస్తున్న మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో:  స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు సేవా పథకం అవార్డు అందుకున్న ఆదిలాబాద్ పట్టణ ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ ను మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు సన్మానించారు. ఆదివారం దేవిదాస్ స్వగ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం చందా (టీ) గ్రామానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, కోశాధికారి దంతుల మధు, సభ్యులు బొల్లు ఈశ్వర్ దాస్, జిమ్మా అడెల్లు, వడ్డి రవికాంత్, గ్రామ మున్నూరుకాపు సంఘం నాయకులు, గ్రామస్తులు గౌరు రమేష్, లంక సుదర్శన్, చిందం పెద్ద పోశెట్టి, చిందం నడిపి పోశెట్టి, అవినాష్, సాయిరాం తదితరులు ఉన్నారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

0

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

         చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామానికి చెందిన రాథోడ్ రాజు కు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఇటీవలే హార్డ్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ రాథోడ్ రాజు  ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సజన్, దేవేందర్ రెడ్డి, సురేందర్ రాథోడ్, స్థానిక మాజీ సర్పంచ్ విలాస్, ఉత్తం, మహేందర్, జక్కశ్రీధర్ రెడ్డి, అనిల్ యాదవ్, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.

ఆదిలాబాద్ లో నామకరణ కార్యక్రమానికి హాజరైన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

0

*ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ కుమార్తె నామకరణ కార్యక్రమంలో  పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని మినీ తనీషా ఫంక్షన్ హాల్‌లో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్_ హిమబిందు దంపతుల కుమార్తె నామకరణం కార్యక్రమం ఆదివారం ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించి, తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యంతో కూడిన సుఖసంతోషమయ జీవితాన్ని కలగాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నలిమేల నవీన్ రెడ్డి, పలువురు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలి

0

పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలి

చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామపంచాయతీలో గల గాంధారి శివారంలో కడెం వాగు కింద పంట కోతకు గురైన పత్తి, సోయా, మొక్కజొన్న తదితర పంటలను అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ శివకుమార్ పంట నష్టపోయిన  రైతులతో కలిసి సర్వే చేశారు. కుమారి వీడీసీ చైర్మన్ బిక్క గంగాధర్ అసిస్టెంట్ టెక్నాలజీ శివకుమార్ తో మాట్లాడుతూ..పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వీరి వెంట రైతులు అగ్గు రమేష్. మండల ప్రవీణ్, వొర్స వివేక్, బిక్క అడేళ్ళు, జడల అభిలాష్, తుమ్మ రాకేష్, బిక్క అశోక్  తదితరులు పాల్గొన్నారు

 

రెడ్డి హాస్టల్లో ఘనంగా రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జయంతి వేడుకలు

0

రెడ్డి హాస్టల్లో రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న రెడ్డి సంఘం నేతలు

        చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో రాజా బహదూర్ వెంకట రాం రెడ్డి (rbvrr) జయంతి వేడుకలను సంఘం నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి  మాట్లాడుతూ.. వంద సంవత్సరాల క్రితమే చదువు యొక్క ఆవశ్యకతను గుర్తించి చదువుతోనే పేదరికం పోతుందని ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున హాస్టల్ నెలకొల్పి ఎందరో రెడ్డి బంధువులకు విద్యను అందించడం జరుగుతోందన్నారు. రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రెడ్డి హాస్టల్ ప్రారంభించి రెడ్డిలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా వసతి సౌకర్యంతో పాటు విద్యా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలోని రెడ్డి బంధువులు వచ్చే సంవత్సరం నుంచి మన రెడ్డి హాస్టల్ సేవలను రెడ్డి బంధువులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ..రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి గారి స్ఫూర్తితో ఈ సంవత్సరం ఆదిలాబాద్ లో కూడా రెడ్డి హాస్టల్ నెలకొల్పుకొని రెడ్డిలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను చేర్చుకొని వారందరికీ ఉచితంగా వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. దీనికి చేయూతనందిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని రెడ్డి బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ. వచ్చే సంవత్సరం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో గల రెడ్డి బంధువులు వారి వారి గ్రామాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను హాస్టల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి, ఆర్థిక కార్యదర్శి ఎల్టి కిష్టారెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు సామ స్వామి రెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వహణ కమిటీ సభ్యులు అల్లూరి భూమారెడ్డి, గోపిడి సతీష్ రెడ్డి, మినక జలంధర్ రెడ్డి, గోక సాగర్ రెడ్డి, బద్దం దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయం

0

పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయం *ఎమ్మెల్యే రామారావు పటేల్

             చిత్రం న్యూస్, ముథోల్:

బహుజన రాజ్య స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఆదివారం  ముథోల్ పట్టణంలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ పోరాట పటిమ, త్యాగం ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శనీయమని, ఆ మహనీయుని ఆలోచనలను అందరూ ఆచరణలో పెట్టాలని పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ్ కులస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలి

0

సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానిస్తున్న ముడుపు మౌనిష్  రెడ్డి

       చిత్రం న్యూస్, ఆదిలాబాద్

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదివారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల క్రితమే శ్రీ బాల గంగాధర్ తిలక్ హిందూ ఐక్యతకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే యువత పెద్ద ఎత్తున సంఘటితమై స్వాతంత్ర్య పోరాటంలో సైతం భాగస్వామ్యులయ్యారని తెలిపారు. అంతేకాకుండా వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడంతో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారన్నారు. ఆయన స్ఫూర్తితో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఐకమత్యంగా హిందూ ధర్మ పరిరక్షణకు పాటు పడుతూ, గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు.

ముఖ్యంగా వినాయక చవితి, కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయం అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని తమ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమితి ప్రతినిధులందరిని సన్మానించారు. వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు జిల్లా కేంద్రంలో ఈ నెల 26,27 తేదీలలో మట్టి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు బండారి వామన్, అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి ప్రధాన కార్యదర్శులు గేడం మాధవ్, పడకంటి సూర్యకాంత్, కార్య నిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, లోపు శ్రీనివాస్, మహిపాల్, సంజీవ్, రాజు, మేకల అశోక్, వెనుగంటి ప్రకాష్, సంతోష్ అగర్వాల్, సురేష్ పోడ్వాల్, పూసం ఆనందరావు,  మహిళా అధ్యక్షురాలు చౌహన్ శశికళ, ప్రధాన కార్యదర్శి మాలతి, తదితరులు పాల్గొన్నారు.

తక్కువ ఖర్చుతో మోకాలి మార్పిడి చికిత్స

0

* నిర్మల్ అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో  మోకాలి మార్పిడి చికిత్స (Knee Replacement Surgery)

*విజయవంతంగా ఆపరేషన్ చేసిన డా. అరుణ్ కుమార్ రెడ్డి

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లేన్ లో ఉన్న అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అరుదైన మోకాలి చిప్ప ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. హైదరాబాద్, నాగపూర్ లాంటి పెద్ద పట్టణాల్లో మాత్రమే జరిగే ఈ ఆపరేషన్ ను  డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా నిర్వహించారు.  లక్ష్మణచందా గ్రామానికి చెందిన శంకర్ కు గతంలో మోకాలి చిప్ప అరిగిపోయి నడవడానికి ఇబ్బంది పడడంతో హైదరాబాద్ లో కుడి మోకాలి మార్పిడి చికిత్స చేసుకున్నాడు. అక్కడ భారీ మొత్తంలో ఖర్చు అయ్యింది. ఆ తరువాత మళ్ళీ ఎడమ కాలు కూడా నొప్పితో నడవలేని స్థితికి రావడంతో హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్ లో ఉన్న అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అదే మోకాలి మార్పిడి ఆపరేషన్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్నారని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. మిత్రుడి సలహా మేరకు హైదరాబాద్ వెళ్లకుండా అక్కడ లభించే కార్పొరేట్ హాస్పిటల్ సేవలు నిర్మల్ లోని అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అందిస్తున్నారని తెలుసుకొని వైదున్ని కలిశారు. శంకర్ కు డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసి పేషెంట్ ను నడిపించారు. చాలా ఖర్చుతో కూడిన ఆపరేషన్ అయినప్పటికీ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్, నాగపూర్ లాంటి పట్టణాల్లో చేసే ఇలాంటి అరుదైన ఆపరేషన్లతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్ జిల్లాల పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని  ఆయన కోరారు.