Home Blog Page 145

విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన ఎంపీ గోడం నగేష్

విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన ఎంపీ గోడం నగేష్

చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో  సీఎస్ఆర్, ఓఎన్జీసీ కలిసి అదిలాబాద్  ఎంపీ గోడo నగేష్ గారి సమక్షంలో  పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు దాదాపుగా 40 ట్యాబ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు నగేష్  మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విద్యార్థులకు సోషల్ మీడియా , ఏ ఐ ద్వారా ట్యాబ్లెట్స్ తో పిల్లలకు చదువు నేర్పించడం జరుగుతుంద న్నారు. ప్రైవేట్ పాఠశాలకుదీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చెందాలని పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు అన్ని రంగాల్లో  ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల సభ్యులు మృత్యుంజయ, అంజని, ప్రధానోపాధ్యాయులు సచిన్, అధ్యాపక బృందం, బీజేపీ రాష్ట్ర నాయకులు. మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

14 లక్షల LOC అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

14 లక్షల LOC అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

చిత్రం న్యూస్, బోథ్ :  బోథ్ మండలంలోని మర్లపెళ్లి గ్రామానికి చెందిన లాడేవార్  పార్వతికి బోన్ మ్యారో సర్జరీ కోసం రూ.14 లక్షల LOC ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్  నేరడిగొండ మండల కేంద్రంలో అందజేశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె చేరగా చికిత్స నిమిత్తం అందజేసినట్లు తెలిపారు.

అ ‘పూర్వ’ విద్యార్థుల సమ్మేళనం

బోథ్ లో విద్యార్థుల అ’పూర్వ’ సమ్మేళనం

చిత్రం న్యూస్, బోథ్:  బోథ్ మండల కేంద్రంలో 1981_82  బ్యాచ్ కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల1983_84 బ్యాచ్ కు చెందిన  ప్రభుత్వ జూనియర్ కళాశాల  పూర్వ విద్యార్టుల సమ్మేళనం ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు 45 సంవత్సరాల క్రితం 16 ఏళ్ల వయసులో  పదో తరగతిలో విడిపోయి 60 ఏండ్ల వయసులో కలిసిన పూర్వ  విద్యార్థుల కలయికకు బోథ్ వేదికయ్యింది. తమకు చదువు చెప్పిన ఆనాటి గురువులు ఏ.నర్సింగ్ రెడ్డి (95),  నర్సారెడ్డి (76),  రమేష్ (72) లని శాలువా కప్పి,  పూలమాలలతో సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే చోట చేరి అంతా సందడి చేశారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొందరి కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి. విద్యార్థులు భూమారెడ్డి, విజయ్, కాశీనాథ్, రమాకాంత్, దేవిధాస్, సదానందం, రమేష్, విలాస్,సునీల్, అనూరాధ, పద్మ, సునీత, ఎస్ ఎస్ ఖాన్, మహేంద్ర, శివాజీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్  శంకర్

చిత్రం న్యూస్, బేల: బేలలోని అశోక్ నగర్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే శంకర్ ను కాలనీవాసులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..  పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. కాలనీవాసులకు, మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాలనీలో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రేసు అమ్రేష్ రెడ్డి, కట్కార్ల స్వామి,ఉషాన్న, కన్నె శ్రీనివాస్ రెడ్డి,రేసు అనిల్ రెడ్డి,పొత్ రాజ్ నవీన్,మాడవార్ హరీష్ రెడ్డి,అగార్కర్ ఆకాష్, కుర్మా సాయి రెడ్డి, గుంజేవార్ నరేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం- కంది శ్రీ‌నివాస రెడ్డి 

ఆదివాసీల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం- కంది శ్రీ‌నివాస రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీలకు ప్ర‌భుత్వం ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటుంద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఆదివారం క‌లెక్ట‌ర్ చౌక్ స‌మీపంలో ఆదివాసీ భ‌వ‌న నిర్మాణానికి ఆయ‌న డీసీసీబీచైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూ రావుల‌తో క‌లిసి భూమిపూజ నిర్వ‌హించారు.నియోజ‌క వ‌ర్గానికి మంజూరైన ప్ర‌త్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఈ భ‌వ‌న నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు. వీలైనంత త్వ‌ర‌గా భ‌వ‌న నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేస్తామ‌న్నారు. నియోజ‌క వ‌ర్గ అభివృద్ధికి నిధులిచ్చి ప్రోత్స‌హిస్తున్న ప్ర‌భుత్వానికి మంజూరు చేయించ‌డంలో కృషి చేస్తున్న మంత్రి సీత‌క్క‌, జిల్లా ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఇత‌ర మంత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంత్రుల స‌హ‌కారంతో నియోజ‌కవ‌ర్గానికి మ‌రిన్నినిధులు తీసుకురావ‌డంలో త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు గిమ్మ సంతోష్ ,బాలూరి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, సెడ్మ‌కే ఆనంద రావు, కొడ‌ప సోనేరావు, మ‌డావి రాజు,సిడాం రాంకిష‌న్, చిత్రు ప‌టేల్, గంటూబాయి ,రాజేశ్వ‌ర్ ,ర‌ఫీఖ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏడాది పాలనలో ఎన్నో విజయాలు

0

కరపత్రం అందజేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

చిత్రం న్యూస్, కొత్తపేట: కూటమి ఏడాది పాలనలోనే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే రెండు అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆత్రేయపురం మండలంలో   నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ విధ్వంసం, అరాచక పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, అయినా కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది ఏడాది పాలనలోనే పింఛన్‌ మొత్తాన్ని రూ.4 వేలకు పెంపు, తల్లికి వందనం, దీపం, మెగా డీఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు కసరత్తు పూర్తయిందని, పీఎం కిసాన్ పథకం తో పాటు నగదు జమవుతుందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు జరుగుతుందన్నారు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం శతధా కృషి చేస్తుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సైతం పరుగులు పెట్టిస్తుందని తెలిపారు. పల్లెల్లో ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటి

0

గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటి

చిత్రం న్యూస్, విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను గవర్నర్ కు సీఎం చంద్రబాబు వివరించారు. త్వరలో సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ ను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం

బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం

చిత్రం న్యూస్, బోథ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మండలి బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకువస్తామని తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ బోథ్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల హామీ ప్రకారం దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు జనాభా దామాషా ప్రకారం ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని, చట్టసభల్లో బీసీ స్థానాలు పెంచే విధంగా దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ ఎంపీటీసీలు చట్ల ఉమేష్, షేక్ రజియా బేగం, నాజర్ అహ్మద్, యాల్ల ఇంద్రారెడ్డి, సుద్ధుల అరుణ్ రెడ్డి, చెట్లపల్లి అనిల్, కసిరే పోతన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహమ్మద్ అబ్రాహార, షేక్ షాకీర్, దయాకర్, భోజన్న, రాజశేఖర్, హసిబ్, మహమ్మద్ అబుద్, రహీముద్దీన్ ,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బత్తుల రమేష్, తదితరులు పాల్గొన్నారు*

పొచ్చర సబ్‌సెంటర్ తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

పొచ్చర సబ్‌సెంటర్ తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

*అర్హతకి మించి వైద్యం చేసిన ఆర్ఎంపీ క్లినిక్  సీజ్ 

చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర గ్రామ సబ్‌సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం. శ్రీధర్, స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. సబ్‌సెంటర్‌లో రికార్డులను పరిశీలించిన అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధులకు కచ్చితంగా సమయానికి హాజరుకావాలన్నారు. అన్ని రికార్డులను సరిగ్గా నిర్వహించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించడం వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాలని  సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలతో మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణపై వివరించారు. ప్రభుత్వ దవాఖానలను వినియోగించుకోవాలని, అర్హత కలిగిన వైద్యుల వద్దే వైద్యం పొందాలని సూచించారు. అనధికారంగా పనిచేస్తున్న ఓ ఆర్ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేశారు. అనధికార వైద్యులు ఎక్కువగా నొప్పి ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ వంటి మందులు వినియోగించటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తున్నాయ ని అధికారులు తెలిపారు. ఆర్ఎంపీలకు కేవలం ప్రాథమిక వైద్యం (ఫస్ట్ ఎయిడ్) మాత్రమే అనుమతించబడిందని, ఆ దాటితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

బైక్ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగింత

బైక్ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగింత

చిత్రం న్యూస్, బేల : బేల మండలంలోని పాఠన్ గ్రామ శివారులో బైక్ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్ర లోని తడేగావ్ గ్రామంలో ఉమేష్ అనే రైతు రోడ్డు పైన బైక్ పెట్టి వ్యవసాయ పొలం పనులు చేస్తుండగా బేల మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ ని గమనించి దొంగిలించారు. వెంటనే బైక్ యజమాని దొంగిలించిన దొంగల వెంట బైక్ తో వెంబడించి వాహనాన్ని బేల మండలంలోని పాఠన్ శివారులో ఇద్దరు దొంగలను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఏ.ఎస్ఐ సురేందర్ తెలిపారు.