Home Blog Page 144

నెరవేరనున్న సొనాల మండల ప్రజల కల

నెరవేరనున్న సొనాల మండల ప్రజల కల

*సొనాల రోడ్డు నిర్మాణానికి రూ.1.80 కోట్లు నిధులు మంజూరు

*ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో నేరవేరనున్న  కల 

చిత్రం న్యూస్, సొనాల : గత కొన్ని సంవత్సరాలుగా సొనాల రోడ్డు (ఇచ్చోడ వైపు వెళ్ళే ప్రధాన రహదారి) ప్రమాదకరంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రమాదాలు జరుగుతున్నా, నడవడానికి కూడా వీలు లేనంత పరిస్థితి ఏర్పడినా, మారుమూల ప్రాంతమైన మన గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేడు అనుకునే తరుణంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్  చొరవతో సొనాల రోడ్డుకు 1.80 కోట్లు మంజూరుకి సాధ్యమైంది. పట్టు వదలని విక్రమార్కుడిలా, తనపై సొనాల మండల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి మాజీ ఎంపీపీ రుజువు చేసుకున్నారు.

త్వరలో పనులు ప్రారంభం..

రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  వారం రోజుల్లో టెండర్ దాఖలు అయ్యేలా చూడాలని, తొందరలోనే పనులు ప్రారంభించాలని  సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, సొనాల మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ లకు సొనాల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

బేల ఎస్ఐ మధు కృష్ణను కలిసిన భజరంగ్ దళ్ నాయకులు

బేల ఎస్ఐ మధు కృష్ణను కలిసిన భజరంగ్ దళ్ నాయకులు

చిత్రం న్యూస్, బేలఆదిలాబాద్ జిల్లా బేల మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన యానకి మధుకృష్ణను భజరంగ్ దళ్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.  భజరంగ్ దళ్  అధ్యక్షుడు అగార్కర్ ఆకాష్ మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ బేల మండల  ఉపాధ్యక్షులు ముజుంధర్ ప్రీతమ్ సభ్యులు మనిష్,నీపూంగే, సచిన్, అనికేత్, సూరజ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు ఇచ్చిన మాట  నిలబెట్టుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే 

బీసీలకు ఇచ్చిన మాట  నిలబెట్టుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే

*బేల మండలంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

చిత్రం న్యూస్, బేల: గడిచిన ఎన్నో ఏళ్లుగా బీసీలకు సరైన రిజర్వేషన్ లేక కేవలం ఎన్నికల్లో హామీలిస్తూ వారిని ఓట్ల కోసమే గత ప్రభుత్వాలు వినియోగించుకుంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ లు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీసీ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్,  ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ల చిత్రపటానికి బేల మండల బీసీలు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గడచిన పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న ఇప్పటివరకు బీసీల రిజర్వేషన్ పై స్పందించలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగానే తాము అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు జనాభాకు అనుకూలంగా 42శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో దీనిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, మాజీ  జడ్పీటీసీ రాందాస్ నాక్లే,మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, యువజన కాంగ్రెస్ మండల కిసాన్ సెల్ మండల అధ్యక్షులు  ఘనం శ్యాం,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోడే అవినాష్,జైనాథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడవి చంద్రకాంత్,మాజీ సర్పంచ్ లు సుధాం రెడ్డి,రూప్ రావు,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శంకర్ బొక్రె,కరీం,గులాబ్,ప్రభాకర్ కృష్ణ రాందాస్,రమేష్ పటేల్,ఠాక్రే గంబీర్,కన్య రాజు,ఈశ్వర్,సోహాన్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత

సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత

*విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్ ఉచితంగా పంపిణీ

చిత్రం న్యూస్, భోరజ్:  ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం మాండగడ  ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్టులకు బ్యాగులు, నోట్ బుక్స్ లను ఉచితంగా పంపిణీ చేసి సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ తో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన వగాడే అమృత ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించడంతో ఆమెని గ్రామస్తులతో కలిసి సన్మానించారు. అంతకు ముందు తమ గ్రామానికి వచ్చిన ముడుపు మౌనిష్ రెడ్డి ని గ్రామస్తులు డప్పు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ , ప్రధానోపాధ్యాయులు అర్చన,  ఉపాధ్యాయులు మచ్చేందర్, సంతోష్, సునంద, అస్మా,  ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముక్కెర ప్రభాకర్, మాజీ సర్పంచ్ లు నర్రా నాందేవ్, మహేందర్ రావు, నాయకులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, కోరట్ల స్వామి, సురేష్ రెడ్డి, పాఠశాల కమిటీ ఛైర్మన్ సరిత, పంచాయితీ కార్యదర్శి ముగ్ద, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ 

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ 

లబ్ధిదారురాలికి ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేస్తున్న ఏఎంసీ చైర్మన్ బొడ్డుగంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ 

చిత్రం న్యూస్,  సొనాల:  సొనాల మండల కేంద్రంలో  సిరిపురం చిన్నమ్మకి ఇందిరమ్మ ఇల్లు  ప్రొసీడింగ్ కాపీని ఏఎంసీ  ఛైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ అందజేశారు. ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్లు మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి బిల్లులు అందుతున్నాయని మొదలుపెట్టని వారు మొదలుపెట్టాలని ప్రతి ఒక్కరికి బిల్లు ఇప్పించే బాధ్యత మాదన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి,ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఎంపీడీవో , పంచాయతీ కార్యదర్శి లను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కసిరే పోతన్న,  పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, ఆత్మ డైరెక్టర్ ముండే శ్రీధర్, మాజీ సర్పంచ్ దాసు, అధికారులు ఎంపీడీవో రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి, వెంకటరమణ, బిల్ కలెక్టర్ అజార్ తదితరులు పాల్గొన్నారు.

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

*మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ  ఛైర్మన్ మాసం అనిల్ కుమార్

చిత్రం న్యూస్, బోథ్ : 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్  అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యం లో మన బాధ్యత అని, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు.   ఓటు హక్కు లేని వారు సంబంధిత బీఎల్ఓలకు ఇవ్వాలని  లేకుంటే మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాయలంలో ఇచ్చిన ఉచితంగా నమోదు చేస్తామని తెలిపారు. ఓటు హక్కు నమోదుకు పదవ తరగతి మెమో (ఉంటే), ఆధార్ కార్డ్, ఫోటో, ఇంట్లో ఒకరి ఓటర్ ఐడి కార్డ్ మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం లో ఇస్తే ఉచితంగా అప్లై చేస్తాం అని తెలిపారు. ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు శివ, సిద్దు, నిఖిల్, సాయి గణేష్,లక్కి తదితరులు పాల్గొన్నారు..

రేషన్ కార్డులు పేదలకు వరం

రేషన్ కార్డులు పేదలకు వరం

*యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం, మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం

చిత్రం న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమనేని పరుశురాం, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ. ఇందిరమ్మ రాజ్యం లో పేదలు సుభిక్షంగా ఉండాలనే ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, రేషన్ కార్డు పేదవారి ఆత్మగౌరవం అని అన్నారు.  పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం చేయలేదని,  ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం కోసం రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారన్నారు. కొత్తగా 5.6 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు అయినవని, 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేసి, 3.10 కోట్లమందికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రైతులు సంతోషంగా ఉంటేనే సోనియమ్మ కల నెరవేరుతుందన్నారు.  ప్రజల ఆశీర్వాదాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు సీఎం, మంత్రులకు పాలాభిషేకం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పాతకాల రమేష్, రేవంత్, మండల ఉపాధ్యక్షులు అరుణ్, జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శులు వొల్లాల రవి, యేబుషి అజయ్, యూత్ నాయకులు రాచపల్లి రాజు, ఏరెడ్డి సతీష్, జావిద్, ఇటుకల గణేష్, పచ్చిమట్ల భాను, బండి పవన్, దీపక్, వెంకటేష్, అష్రఫ్, జాన్సన్, సాయి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవోకు బీజేపీ నాయకుల సన్మానం

జైనథ్  ఎంపీడీవో మహేశ్ కుమార్ ను సన్మానిస్తున్న బీజేపీ నాయకులు

చిత్రం న్యూస్, జైనథ్:  జైనథ్ మండల ఎంపీడీవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ ను జైనథ్  మండల బీజేపీ నాయకులు సన్మానించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో శాలువా కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు  తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్,  దళిత మోర్చ మండల అధ్యక్షుడు గొడుగుల సత్యనారాయణ, నాయకులు కుంట వెంకటరెడ్డి, గౌకర్ విశాల్, అన్నెల అశోక్, సూర్యరెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బుక్కులు, బ్యాగులు, అందిస్తున్నానని తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్  రూరల్ మండలంలోని రాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, పెన్నులను, బ్యాగులను అందజేశారు. అంతకు ముందు గ్రామానికి విచ్చేసిన మౌనిష్ రెడ్డిని గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు చేస్తున్న కృషిని కొనియాడారు. విద్యార్థులు మంచిగా చదివి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగారెడ్డి, ఉపాధ్యాయురాలు సునీత, గ్రామస్తులు కిష్టారెడ్డి, భోజరెడ్డి, లక్ష్మి బాయి, నగేష్ రెడ్డి, ప్రతాప్ యాదవ్, సంతోష్, రమేష్, వెంకట్,తదితరులు ఉన్నారు.

బోథ్ ఎస్ఐగా శ్రీ సాయి బాధ్యతలు

బోథ్ ఎస్ఐగా శ్రీ సాయి బాధ్యతలు

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ ఎస్ఐగా శ్రీసాయి బాధ్యతలు చేపట్టారు.  ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ప్రవీణ్ మావలకు బదిలీ అయ్యారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీసాయిని మండలంలోని పలువురు వేర్వేరుగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. బోథ్ వీడీసీ అధ్యక్షులు అల్లకొండ పోతన్న, ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్, కోశాధికారి రాయిపెళ్లి రమాకాంత్, ఉపాధ్యక్షులు ఎలుక రాజు, మెడిచేల్మ ప్రవీణ్, సయ్యద్, దయాకర్, సలహాదారులు కట్ట భూమేష్,  మాసం అనిల్, బుస లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు, సీపీఐ సీనియర్ నాయకులు బి. గోవర్ధన్, మండల కార్యదర్శి  ఎల్. నరేష్, పట్టణ కార్యదర్శి కార్తీక్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మున్సిఫ్, నాయకులు నితీష్,  సాయి, బోథ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు  సోలంకి సుభాష్, వైస్ ప్రెసిడెంట్ జమ్మూ, జనరల్ సెక్రటరీ భూమన్న, సెక్రటరీ రహీం, కోశాధికారి భరత్ తదితరులు ఎస్ఐని సన్మానించిన వారిలో ఉన్నారు.