Home Blog Page 143

మిస్సింగ్, చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరి

మిస్సింగ్, చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరి

*బాధితులకు అందజేసిన పోలీసులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ లలో మొబైల్ మిస్సింగ్, చోరికి గురియిన దాదాపు 150 పైగా ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. బాధితులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వాటిని పోలీసులు అందచేశారు. పోయినవని అనుకున్న ఫోన్లు మళ్ళీ తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. జీవితంలో ఫోన్ ఒక భాగం అయిపోయింది.  ఎటు వెళ్ళాలన్న ఏం చేయాలన్న చేతిలో ఫోన్ ఉండాల్సింది. ప్రతిదీ ఫోన్ లోనే భద్రపర్చుకుంతున్నారు. మొబైల్ పడిపోతే లేదా ఎవరైనా దొంగలిస్తే ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అయితే టెన్షన్ పడకుండా వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి సీఈఐఆర్ పోర్టర్ లో ఫిర్యాదు చేస్తే చాలు మీ ఫోన్ ఎక్కడున్నా పోలీసులు వెతికిపట్టుకుంటారు.

కల్తీ కల్లు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వినతి

ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీకి వినతిపత్రం అందజేస్తున్న సామాజి కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కల్తీ కల్లు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కల్తీ కల్లు విక్రయిస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కల్తీ కల్లు తాగి ఎంతోమంది అనారోగ్య బారినపడటమే కాక.. రహదారి ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని వివరించారు. కల్తీ కల్లు కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సురేందర్ రెడ్డి, ప్రసాద్ చారి, శ్రీకాంత్ రెడ్డి, అతర్వ తదితరులు ఉన్నారు.

బోథ్ కేజీబీవీలో సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్స్

బోథ్ కేజీబీవీలో సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్స్

చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ కస్తూర్బా గాంధీ కళాశాల  ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ గ్రూపు లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారిణి రాథోడ్ వలిత తెలిపారు. అడ్మిషన్స్ తీసుకునే అభ్యర్థులు ఈ నెల 22 న మంగళవారం తమ ఒరిజినల్ సర్టిఫికేట్ తో కేజీబీవీ లో హాజరుకావాలని కోరారు.

బోథ్ కేజీబీవీలో పోచమ్మ తల్లికి బోనాలు

బోథ్ కేజీబీవీలో పోచమ్మ తల్లికి బోనాలు

చిత్రం న్యూస్, బోథ్:  ఆషాఢమాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ కేజీబీవీలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. విద్యార్థులు అమ్మవారి వేషధారణతో అలరించారు. భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నైవేద్యం సమర్పించి సల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రాథోడ్  వలిత, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, ఎమ్మార్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొత్త రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు

కొత్త రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు

చిత్రం న్యూస్, జైనథ్ : జైనథ్ మండలంలోని వివిధ గ్రామాలకి చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ పనిచేయక పోవడంతో చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కూడా తప్పకుండా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విచారణ ముగిసిన సర్వర్ పనిచేయక పోవడంతో మండలంలోనే దరఖాస్తులు పెండింగ్ లో ఉంటున్నాయి. దరఖాస్తు దారులు రోజూ మండల కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని లబ్ధిదారులు   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి సామ రూపేష్ రెడ్డి రక్తదానం

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి సామ రూపేష్ రెడ్డి రక్తదానం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భవాని గూడ గ్రామానికి చెందిన టేకం సంతోష్ అనే యువకుడుకిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు రక్తం 6.7 గ్రాం ఉండడంతో వెంటనే ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి యువకుడికి అవసరమైన ఓ పాజిటివ్ రక్తాన్ని అత్యవసర సమయంలో అందజేశాడు. ఈ రక్తం అందించడంతో యువకుడికి వైద్యులు రక్తం ఎక్కించారు. అత్యవసర సమయంలో అందరికీ అందుబాటులో ఉంటూ అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్న సామ రూపేష్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఆయన వెంట యువ నాయకుడు మేకల జితేందర్,కుటుంబ సభ్యులు విజయ్ తదితరులు ఉన్నారు.

ఘనంగా న్యాయ దినోత్సవం

ఘనంగా న్యాయ దినోత్సవం

*ప్రముఖ న్యాయవాది ఆడెపు హరీష్ కుమార్ కు పద్మశాలి సంఘం నేతల సన్మానం

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఆడెపు హరీష్ కుమార్ కు పద్మశాలి సంఘం తరఫున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేరుగు భోజన్న, కట్కూరి గంగాధర్, తడక పోశెట్టి, ఉసికెల కార్తీక్, వడ్లకొండ సురేందర్, మాసం అనిల్, మేరుగు సాయి, ఆడేపు కిరణ్, ఆడేపు ప్రసాద్, కటకం ప్రసాద్, కొమారి దయాకర్, కొక్కుల సంతోష్, బిట్లింగు సురేష్, సిరిపురం శేఖర్, బోగ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

బేల ఎస్ఐను సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

బేల ఎస్ఐను సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

చిత్రం న్యూస్, బేల:   బేల మండల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన యానకి మధుకృష్ణను ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.  ఎస్ఐ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ బేల మండల అధ్యక్షుడు కృష్ణపెల్లి అంకుశ్, నాయకులు సునీల్,  భూమన్న, దీపక్, అశోక్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా న్యాయ దినోత్సవం

ఘనంగా న్యాయ దినోత్సవం

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండల కేంద్రంలోని వాగ్దేవి జూనియర్, డిగ్రీ కళాశాలలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది కుమ్మరి విజయ్ కుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయాన్ని గెలిపించడానికే చట్టాలు ఉన్నాయని అన్నారు. చట్టాలను ప్రతిఒక్కరు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం న్యాయవాది విజయ్ కుమార్ ను కళాశాల యాజమాన్య, అధ్యాపక బృందం, విద్యార్థులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజశేఖర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, యాజమాన్య సభ్యులు కుమ్మరి పోశెట్టి, ప్రవీణ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

ఆరోగ్య పాఠశాలలో యోగా కార్యక్రమం

ఆరోగ్య పాఠశాలలో యోగా కార్యక్రమం

చిత్రం న్యూస్, బోథ్ : మండలంలోని కనుగుట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగ శిక్షకురాలు మునిగెల యోగిత  విద్యార్థులతో సూర్య నమస్కారాలు, యోగాసనాలలో వృక్షాసనం, తాడాసనం, హాలాసనం వేయించారు. యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, మానసిక అలసట ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జె.మహేందర్,  పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.