Home Blog Page 139

అమరవీరుల స్థూపం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా..

అమరవీరుల స్థూపం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా..

*కలెక్టర్ కు వివరించిన బాలూరి గోవర్ధన్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపం నిర్మాణం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా తీశారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శనివారం అమరవీరులకు కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం ఎప్పుడు నిర్మించారని స్థానికులను అడగగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 లో మంగళ్ పాండే నాటి భారతీయ తిరుగుబాటు కు జ్ఞాపకార్ధంగా ఈ స్థూపం నిర్మించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ కు వివరించారు. ఈ స్థూపం నిర్మాణానికి ఆదిలాబాద్ సమీపంలోని భీంసరి గ్రామ వాగులో లభించే ఎర్రటి రాతి తో నిర్మించడం జరిగిందని తెలిపారు. 1999 లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాకిస్తాన్ పై విజయం సాధించినందుకు గాను తొలిసారిగా ఇక్కడే వేడుకలు జరుపుకున్నామని పేర్కొన్నారు.  ఆనాటి మున్సిపల్ చైర్మన్ దివంగత లాలా రాధేశ్యామ్ పాలకవర్గం 2000 సంవత్సరం లో స్థూపానికి మరమ్మతులు చేయించి ఈ పార్క్ కు కార్గిల్ పార్కుగా నామకరణం చేశారన్నారు. కార్గిల్ యుద్ధం సమయములో తమ స్పందన స్వచ్ఛంద సంస్థ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బిపిన్ పటేల్, హార్పల్ సింగ్, పార్థసారథి లము రూ.50 వేలు సేకరించి ప్రధానమంత్రి సహాయ నిధికి  పంపించామని  కలెక్టర్ కు తెలిపారు.

ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ అభియాన్ 

1

జవాన్లను సన్మానిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్ అధ్యక్షతన శనివారం ఉదయం 11:30 గంటలకు తాళ్లూరి సత్రంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారత జవాన్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సన్మాన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వర రావు హాజరయ్యారు. నాయకులతో కలిసి సురపతి కృష్ణారావు దంపతులను, BS రెడ్డి జవాన్ ను ఈ సందర్భంగా సన్మానించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహన్ రావు,  సీనియర్ నాయకులు, చింత శ్యామ్ సుందర్ , కొత్త వీరభద్రరావు, అద్దేపల్లి వెంకట్రావు, రేపాక ప్రసాద్,  భారతీయ జనతా పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అమర జవాన్లకు ఘన నివాళి

అమర జవాన్లకు  నివాళుర్పిస్తున్న భజరంగ్ దళ్  నాయకులు

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ కూడలి వద్ద కార్గిల్ విజయ్ దివస్ ను భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం  ఘనంగా నిర్వహించారు.  అమరులైన జవాన్లకు నాయకులు నివాళుర్పించారు. ఈ సందర్భంగా భజరంగ్ దళ్ మండల అధ్యక్షులు అగార్కర్ ఆకాష్ మాట్లాడుతూ..జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి నేటితో 26 ఏళ్లు పూర్తయిందని అన్నారు. ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించామన్నారు. దేశ సరిహద్దుల్లో ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలకు రక్షణగా ఉంటున్నది జవానులేనని పేర్కొన్నారు.  దేశం కోసం సైన్యంలో చేరేందుకు యువత ముందుకు రావాలన్నారు. భజరంగ్ దళ్ మండల ఉపాధ్యక్షులు ముజేందర్ ప్రీతం, రాము బర్కడే, తరుణ్, సచిన్, అనోజ్, కళ్యాణ్, వంశీ, శివ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల ఉదారత 

                    ఉపాధ్యాయుల ఉదారత

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దహిగావ్ మరాఠి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు తలో కొంత విరాళం సేకరించి రూ.40 వేల విలువైన ప్రొజెక్టర్ ను కొనుగోలు చేసే ఉదారత చాటుకున్నారు. ఎంఈఓ కోల నరసింహులు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఇఓ కోల నరసింహులు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తమ పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉపాధ్యాయులు ప్రాజెక్టర్ ను కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నారు.  ఉపాధ్యాయులను  నాయకులు, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూదగిరి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి నితిన్, బేల మాజీ సర్పంచ్ తేజారావు, కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాక్లే,సంజయ్ గుండావార్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ టాక్రే, విట్టల్ వరాడే,  బీజేపీ నాయకులు  మురళీధర్ ఠాక్రే, దత్తా నిక్కం, ఉపాధ్యాయులు సంధ్య, నర్సింగ్ విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.

మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో నూతన డాక్టర్లకు సన్మానం

మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో నూతన డాక్టర్లకు సన్మానం చేస్తున్న  మాసం అనిల్, తదితరులు

చిత్రం న్యూస్, బోథ్:ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లో గల ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ గావచ్చిన బోథ్ గ్రామ వాస్తవ్యుడు శబరిరామ్, మహిళా డాక్టర్ సురక్ష లను మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో శాలువాతో సన్మానం చేశారు. ఛైర్మన్ మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా గొప్పదని తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఎందరో ప్రాణాలు కాపాడుతూ పునర్జన్మ ఇస్తున్నారన్నారు. బోథ్ కి చెందిన శబరి రామ్ కష్టపడి చదివి ఇప్పుడు డాక్టర్ అయ్యి ఊరుకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడే నూతనంగా డాక్టర్ గా సేవలు చేయడం చాలా అభినందనీయమన్నారు. కార్యక్రమం లో దుర్గ కమిటీ అధ్యక్షుడు పాలిక్ రమేష్, తుం శివ, మందుల అశోక్, ఆడెపు సాయి విఘ్నేష్, పడిగేల మణిరత్నం, మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

దీపాయిగూడలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము

దీపాయిగూడలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్న గ్రామస్తులు

చిత్రం న్యూస్, జైనథ్: మొదటి శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు లోక సౌజన్య కరుణాకర్ రెడ్డి  మాట్లాడుతూ.. హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. ప్రతీ గ్రామంలో కూడా సామూహిక సత్సంగాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం పారాయణం నిర్వహించుకునేల ప్రణాళిక వేసుకుంటే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయుడు నాగభూషణం పాల్గొన్నారు.

వజ్జర్ అంగన్వాడీ కేంద్రం గోస 

వజ్జర్ అంగన్వాడీ కేంద్రంలోని పరిస్థితి

చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని ఆదివాసీ మారుమూల గ్రామం వజ్జర్ మహదుగూడ అంగన్వాడీ కేంద్రం పరిస్థితి గోస గా ఉంది. ఇందులో 15 మంది పిల్లలు,  ఇద్దరు బాలింతలు, నలుగురు గర్భిణులు ఉన్నారు. ఈ కేంద్రం ప్రభుత్వ పాత బిల్డింగ్ లో కొనసాగుతుంది.  వర్షం వస్తే అంతే సంగతి. నీరు కారడంతో  అక్కడ ఉండలేని పరిస్థితి. కూర్చుందామంటే కింద  నీళ్లు ఉంటాయి. భవనం శిధిలావస్థకు చేరడంతో పిల్లలు భయాందోళన నడుమ బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. వజ్జర్ అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ మంజూరులో ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్డింగ్ పనులు ప్రారంభించాలని వజ్జర్ గ్రామస్థులు  కోరుతున్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం 

0

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం

చిత్రం న్యూస్, పెద్దాపురం: ఎన్నికల సమయంలో కూటమి నేతలు లారీ డ్రైవర్స్, ఓనర్స్ కు గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుని, తక్షణమే దానిని అమలు చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షీరాభీషేకం నిర్వహించారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద లారీ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరికి అప్పారావు, కార్యదర్శి కుంది కొండలరావు, కోశాధికారి యందమూరి రవి కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు మట్టే శ్రీనివాస్ రావు, అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ సప్లయ్ స్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, బుజ్జి, దిద్ది సత్యనారాయణ, కొప్పిశెట్టి వీరేంద్ర, గెడ్డం పెదకాపు, తూతిక రాజు, వల్లూరి సూర్యప్రకాష్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో లారీ ఓనర్స్, డ్రైవర్స్ పాల్గొన్నారు.

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

*మాట్లాడుతున్న ఎమ్మార్పీస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ 

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ అన్నారు. కెమెరాలు ఏర్పాటుకై శుక్రవారం ఎంపీడీవో, పోలీస్ అధికారులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి  శివాజీ విగ్రహాల దగ్గర, బస్టాండ్, మార్కెట్ తో పాటు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం వలన అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా కొంతమంది దొంగతనాలకు పాల్పడడం జరుగుతుందని అన్నారు. వీటిని అరికట్టేందుకు పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంకజ్ గణేష్, ఎం.అంకుష్ ఎం. గణేష్ ఆకాష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

దివిలి గ్రామంలో డోర్ టు డోర్  కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు

0

దివిలి గ్రామంలో డోర్ టు డోర్  కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు

చిత్రం న్యూస్ , పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో బూత్ నంబర్ 32,33,34 డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు నిర్వహించారు. పెద్దాపురం నియోజవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దివిలి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఊడి శ్రీను, నానేపల్లి రఘు, ఆకుల ఈశ్వరరావు, పోకల రఘు, మాగాపు చందర్రావు, పాలాటి సత్తిబాబు, రెడ్డి శీను, మరికి వెంకటకృష్ణ, బూత్ ఇంచార్జ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.