-Advertisement-

దుబ్బగూడ ఆసుపత్రిలో ఎన్సీడీపై సమీక్షా సమావేశం 

దుబ్బగూడ ఆసుపత్రిలో ఎన్సీడీపై సమీక్షా సమావేశం 

చిత్రం న్యూస్, మావల: మావల మండలంలోని దుబ్బగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం జిల్లా NCD అధికారిణి డా. సుమలత ఆధ్వర్యంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న డేటాను వెంటనే పూర్తి చేయాలని, ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డులను పూర్తి చేయాలని ఆదేశించారు. బీపీ, షుగర్ కేసులకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందించి, మందులు క్రమం తప్పకుండా వాడితేనే రోగం నయమవుతుందని, ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడే వారి పూర్తి వివరాలు తమ వద్ద ఉండాలని సూచించారు. ప్రతి సబ్ సెంటర్ ANM లు, MLHP లు ఈ నెల 20వ తేదీలోగా పనులు పూర్తి చేయకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PHC ఆంకోలి NCD నోడల్ పర్సన్ బొమ్మెత సుభాష్, MLHPలు అగ్గిమల్ల అంజలి, కృష్ణవేణి, రోజారమణి, పూనమ్, సౌజన్య, ఆరోగ్య సహాయకులు నల్ల ఈశ్వర్ రెడ్డి, తార, లలిత, సంగీత, సునీత, శ్రీవాణి, మమత, శకుంతల, సజిదా, శ్రీదేవి, మమత, దుబ్బగూడ ఆసుపత్రి సిబ్బంది ఇర్ఫానా, చంద్రకళ, శృతి, రిహాజ్, రత్న, శాంత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments