-Advertisement-

బాసర అమ్మవారికి తెలుగు అక్షరమాలతో చేనేత పట్టుచీర

బాసర అమ్మవారికి తెలుగు అక్షరమాలతో చేనేత పట్టుచీర

చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా సిరిసిల్లకు చెందిన నల్ల పరంధాములు కుమారుడు నల్ల జగదీష్ నేసిన చేనేత తెలుగు అక్షరమాల పట్టుచీరను మేళ తాళాల మధ్య శుక్రవారం బాసర సరస్వతి అమ్మవారికి ఆలయ ఈవో అంజనాదేవి వేద పండితుల సమక్షంలో సమర్పించారు.నల్ల జగదీష్ నేత చేనేత మగ్గముపై తెలుగు అక్షరమాలను పట్టుచీరపై నేయడానికి సంకల్పించుకొన్నారు. 15 రోజుల్లో ఆరు మీటర్ల 30 సెంటీమీటర్ల వస్త్రము 650 గ్రాములతో  నేశారు. సున్నిహితమైన పనితనముతో ఈ వస్త్రాన్ని తయారుచేసి పద్మశాలీల వృత్తి నైపుణ్యాన్ని తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాలలో ఖ్యాతిని పెంపొందించేలా చేశారు. చేనేత పరిశ్రమ.. మిల్లు వస్త్రములతో పోటీ పడలేక కునారిలుతుందని తెలిసిందే.. చేనేత ఎప్పటికప్పుడు వృత్తి కళాకారుల నైపుణ్యముతో ప్రజల మనసులకు దగ్గరయ్యే వస్త్రాలను తయారు చేస్తూ మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కార్యక్రమంలో సత్ర అధ్యక్షులు శ్రీ రాపోల్ సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షులు, గుజ్జ రాజేశ్వరి,ప్రధాన కార్యదర్శిలు రమణ విశ్వం, శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్,కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్ ఓని స్వామి ,రువ్విపోశెట్టి, మేకల అశోక్ ,అంకం రమేష్ గ్రామ పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments